అదేంటో కొన్ని డేట్లు కాకతాళీయంగానే అయినా సినిమాల పరంగా భలే కలిసొస్తాయి. ఉదాహరణకు ఏప్రిల్ 28 తీసుకుంటే టాలీవుడ్ చరిత్రలో రికార్డులు సృష్టించిన ఎన్టీఆర్ అడవి రాముడు, బాహుబలి, యమలీల, పోకిరి ఆ డేట్ కి వచ్చినవే. ఇప్పుడు మార్చి 30 కూడా అదే వరసలో చేరేలా ఉంది. అయిదేళ్ల క్రితం 2017లో రిలీజైన రంగస్థలం అప్పటిదాకా రామ్ చరణ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలవడమే కాదు చాలా చోట్ల నాన్ బాహుబలి రికార్డులు నమోదు చేసింది.
దర్శకుడు సుకుమార్ మాస్ యాంగిల్ పూర్తిగా బయటికి వచ్చింద ఈ మూవీతోనే. సరిగ్గా నిన్న అదే తేదీకి దసరా వచ్చింది. అనూహ్యంగా ఇది నానికి హయ్యెస్ట్ గ్రాసర్ గా నిలవబోతోంది. మొదటి రోజు రికార్డులకే ట్రేడ్ కి మాట రావడం లేదు. దీని డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల స్వయానా సుక్కు శిష్యుడు కావడం గమనార్హం.
ఇదొక్కటే కాదు రంగస్థలంకు పని చేసిన కీలక సభ్యుల్లో ఇతనూ ఉన్నాడు. దాని సక్సెస్ మీట్ లో ప్రత్యేకంగా స్టేజి మీద పిలిచి మెచ్చుకోవడం ఇప్పుడు వీడియో రూపంలో వైరల్ అవుతోంది. రెండూ ముప్పై నలభై ఏళ్ళ వెనకటి విలేజ్ బ్యాక్ డ్రాప్ లో రూపొందటం, ఒకదాంట్లో అన్నయ్య మరోదాంట్లో స్నేహితుడు ట్రాజెడీ మీద రివెంజ్ చూపించడం ట్విస్ట్.
ఈ రకంగా మార్చి 30 సైతం ల్యాండ్ మార్క్ గా నిలిచిపోయేలా ఉంది. సెలవుల సీజన్ మొదలుకావడం, మండే ఎండల్లో జనాలు థియేటర్లకు వెళ్లేందుకు ఎక్కువ మొగ్గు చూపడం, పోటీలేని టైంలో కంటెంట్ ఏ మాత్రం బాగుందనే మాట వచ్చినా చాలు కలెక్షన్ కురిపించే వేసవి కావడం ఇవన్నీ దసరాకు ప్లస్ అవుతున్నాయి. అప్పట్లో రంగస్థలంలో రామ్ చరణ్ మేకోవర్ ఏ రకంగా షాక్ ఇచ్చిందో ఇప్పుడు నాని కొత్త వేషం సైతం అంతే గొప్పగా ప్రశంసలు అందుకుంటోంది. వీటిలో హీరోయిన్లుగా నటించిన సమంత, కీర్తి సురేష్ లకు సైతం మంచి పేరు రావడం మరో విశేషం
This post was last modified on March 31, 2023 6:37 pm
దేశ భద్రతపై మళ్లీ శాంతిభంగం కలిగించే అవకాశాలు కనిపిస్తున్నాయని నిఘా సంస్థలు హెచ్చరించాయి. శనివారం కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు…
రెండేళ్ల క్రితం బేబీ రిలీజ్ ముందు వరకు తనెవరో పెద్దగా పరిచయం లేని పేరు. అల వైకుంఠపురములో అల్లు అర్జున్…
తమిళనాట అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ... అధికార డీఎంకేలో ఫుల్ జోష్ నింపే పరిణామం ఒకటి శనివారం జరిగింది. సుప్రీంకోర్టులో రెండేళ్లుగా…
హర్యానాలోని సోనిపట్లో ఉన్న ఓపీ జిందాల్ విశ్వవిద్యాలయంలో ఓ విద్యార్థి చేసిన తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ అవుతోంది.…
మాజీ ఉప రాష్ట్రపతి, బీజేపీ నాయకుడు ముప్పవరపు వెంకయ్యనాయుడు.. తాజాగా అటు తెలంగాణ, ఇటు ఏపీ నేతలపై సెటర్లు గుప్పించారు.…
కొన్నిసార్లు బాక్సాఫీస్ ఫలితాలు అనూహ్యంగా ఉంటాయి. టాక్ తేడాగా వచ్చినా, జనానికి పూర్తిగా నచ్చకపోయినా కలెక్షన్లు మాత్రం భీభత్సంగా వచ్చేస్తాయి.…