కోలీవుడ్ హీరో శింబుకు తెలుగులో ఒకప్పుడు మంచి ఇమేజ్ ఉండేది. మన్మథ సూపర్ హిట్ అయ్యాక ఇక్కడా ఫాలోయింగ్ వచ్చింది. వల్లభ లాంటివి ఒకటి రెండు కమర్షియల్ గా బాగానే ఆడినా తర్వాత వరస ఫ్లాపుల వల్ల మార్కెట్ దాదాపుగా పోయింది. ఆ మధ్య గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెలుగు డబ్బింగ్ లైఫ్ అఫ్ ముత్తుతో పలకరించాడు కానీ అది కనీస స్థాయిలో ఆడలేదు.
తాజాగా పాతు తలతో నిన్న ప్రేక్షకుల ముందుకొచ్చాడు. తమిళనాడులో నాని దసరాకి సరిపడా థియేటర్లు రాకపోవడంలో వెట్రిమారన్ విడుదలై 1తో పాటు ఈ పాతు తల కూడా ప్రధాన కారణం. ఇక విషయానికి వస్తే పాతుతల కన్నడ బ్లాక్ బస్టర్ మఫ్టీ రీమేక్. ఒరిజినల్ చూసే వీరసింహారెడ్డిలో గెటప్ ని డిజైన్ చేయించామని బాలకృష్ణ వేద ఈవెంట్ లో చెప్పారు.
ఇక్కడా రీమేక్ చేసే ప్రయత్నాలు జరిగాయి కానీ స్టార్ ఇమేజ్ ఉన్న సీనియర్ జూనియర్ హీరోలు ఇద్దరు అవసరం పడటంతో కాంబినేషన్ కుదరలేదు. ఫైనల్ గా తమిళంలో శింబు, గౌతమ్ కార్తీక్(కడలి ఫేమ్)కాంబోతో సెట్ చేశారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించడం వల్ల దీని మీద మంచి అంచనాలే ఉన్నాయి. అయితే రిజల్ట్ మాత్రం ఆశించిన స్థాయిలో వచ్చేలా లేదని టాక్ తో పాటు రివ్యూలు స్పష్టం చేస్తున్నాయి.
మఫ్టీలో శివరాజ్ కుమార్ ఎంట్రీ ఇంటర్వెల్ నుంచి ఉంటుంది. అక్కడి నుంచి స్క్రీన్ ప్లే ఇంకో లెవెల్ కు వెళ్ళిపోయి మంచి మాస్ స్టఫ్ ఇస్తుంది. కానీ పాతుతలలో ఫస్ట్ లోనే రివీల్ చేశారు. ఒక పెద్ద మాఫియా డాన్ ని పట్టుకోవడం కోసం కుర్ర పోలీస్ ఆఫీసర్ ఆ ప్రాంతానికి అండర్ కాప్ గా మారు వేషంలో వస్తాడు. ఇక్కడో సిస్టర్ సెంటిమెంట్ ఎపిసోడ్ ఉంటుంది. దర్శకుడు ఒబెలి ఎన్ కృష్ణ మఫ్టీ స్థాయిలో దీన్ని నిలబెట్టేందుకు శతవిధాల ప్రయత్నించాడు కానీ శింబు నటన. రెహమాన్ సంగీతం కొంత వరకు కాపాడినా ఫైనల్ గా పాతు తల అంచనాలు అందుకోలేకపోయింది. తెలుగు డబ్ చేసే ప్లాన్ లో ఉన్నారు నిర్మాతలు
This post was last modified on March 31, 2023 3:46 pm
ఇటీవలే టోవినో థామస్ 'పళ్ళి చట్టంబి' తెలుగు వెర్షన్ విడుదలయ్యింది. మార్నింగ్ షోనే డెఫిసిట్ తో మొదలై సాయంత్రానికే డిజాస్టర్…
కల్వకుంట్ల కవిత.. మాజీసీఎం కేసీఆర్ తనయగా.. రాజకీయాల్లోకి అడుగు పెట్టిన ఆమె.. ఎంపీగా, ఎమ్మెల్సీగా వ్యవహరించారు. ఇక, ఆ పార్టీతో…
టాలీవుడ్లో బిగ్గెస్ట్ సినీ ఫ్యామిలీ ఏది అంటే.. మెగా కుటుంబం గురించే ముందుగా చెప్పుకోవాలి. ఆ కుటుంబంలో ఉన్నంత మంది…
ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో మలయాళ పరిశ్రమను మినహాయిస్తే.. ప్రతి చోటా సినిమాల మేకింగ్ బాగా టైం తీసుకుంటోంది. కొంచెం స్టార్ ఇమేజ్…
టీడీపీ వ్యవస్థాపకుడు, ఉమ్మడి ఏపీకి పలుమార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన దివంగత నందమూరి తారక రామారావుకు భారత దేశ అత్యున్నత పురస్కారం భారత రత్న ఇవ్వాలన్నమాట నిత్యం…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో కూటమి పార్టీలకు చెందిన నేతల మధ్య…