టాలీవుడ్ లో సీనియర్ దర్శకుల దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్స్ గా వర్క్ చేసిన వాళ్ళు ఇప్పుడు చాలా మంది దర్శకులుగా మారుతున్నారు. అందులో సుకుమార్ శిష్యులే ఎక్కువగా కనిపిస్తున్నారు. ‘ఉప్పెన’ తో సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు డైరెక్టర్ గా బెస్ట్ డెబ్యూ ఇచ్చి 100 కోట్ల గ్రాస్ లిస్టులో చేరాడు. ఇప్పుడు సుకుమార్ శిష్యుడిగా ‘దసరా’తో శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా మారి ప్రేక్షకుల ముందుకొచ్చాడు.
నాని హీరోగా తెరకెక్కిన దసరాతో డెబ్యూ ఇచ్చాడు శ్రీకాంత్ ఓదెల. అంతకుముందు సుకుమార్ దగ్గర నాన్నకు ప్రేమతో , రంగస్థలం సినిమాలకు దర్శకత్వ శాఖలో పనిచేశాడు. సుకుమార్ ‘రంగస్థలం’ రిలీజైన రోజే తన ‘దసరా’ రిలీజ్ ప్లాన్ చేసుకున్న శ్రీకాంత్ తన మేకింగ్ స్టైల్ తో చాలా వరకు సుకుమార్ ను గుర్తుచేశాడు. దసరా లో కొన్ని షాట్స్ , మేకింగ్ స్టైల్ , పాత్రలు రంగస్థలంను పోలి ఉన్నాయి.
దీంతో సుకుమార్ శిష్యుడు గురువులానే తీసి చూపించడాని అందరూ కొనియాడుతున్నారు. కొందరైతే తక్కువ అనుభవంతో ఈ రేంజ్ సినిమాను బాగా హ్యాండిల్ చేశాడని చెప్తూ గురువుకి తగ్గ శిష్యుడు అనే కాంప్లిమెంట్స్ అందిస్తున్నారు. బుచ్చి బాబు లానే శ్రీకాంత్ ఓదెల ‘దసరా’ తో 100 కోట్ల గ్రాస్ కొల్లగొడితే ఇద్దరు టాలెంటెడ్ డైరెక్టర్స్ ను పరిచయం చేసిన ఘనత సుక్కు ఖాతాలో చేరుతుంది.
ఇప్పటికే పాజిటివ్ టాక్ తో దర్శకుడిగా మంచి మార్కులు అందుకుంటున్నాడు శ్రీకాంత్. కమర్షియల్ గా ఎన్ని కోట్లు కొల్లగొడతాడో చూడాలి. త్వరలోనే సుకుమార్ శిష్యుడిగా కాశీ విశాల్ అనే దర్శకుడు కూడా ‘సెల్ఫీష్’ సినిమాతో రాబోతున్నాడు. ఇంకా మరికొందరు సుకుమార్ శిష్యులు డెబ్యూ ఇచ్చే ప్లానింగ్ లో ఉన్నారు.
This post was last modified on March 30, 2023 7:51 pm
కొందరు ఫిలిం మేకర్స్ తమ సినిమా కథేంటో చివరి వరకు దాచి పెట్టాలని ప్రయత్నిస్తారు. నేరుగా థియేటర్లలో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలనుకుంటారు.…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…