సమంత ఎందుకంత దూరం?

సమంత పాన్ ఇండియా మూవీ ‘శాకుంతలం’ ఏప్రిల్ 14న గ్రాండ్ గా రిలీజవుతోంది. తాజాగా ఈ సినిమాకు ప్రమోషన్స్ మొదలు పెట్టింది సమంత. చెన్నై, ముంబై లో ప్రమోషనల్ ఇంటర్యూలు ఇస్తూ శాకుంతలం గురించి, తన లైఫ్ గురించి చెప్పుకుంటుంది. అయితే సమంత కొన్నాళ్లుగా తెలుగు మీడియాకి దూరంగా ఉంటుంది.

యశోద టైంలో కూడా తెలుగు మీడియా ముందుకు రాలేదు సమంత. ఆ టైమ్ లో సుమ తో ఒక కామన్ ఇంటర్వ్యూ మాత్రమే చేసింది. అయితే అప్పుడు సామ్ అనారోగ్యంతో ఉందని మీడియా లైట్ తీసుకుంది. కానీ తాజాగా శాకుంతలం విషయంలోనూ సమంత తెలుగు మీడియాకి దూరంగా ఉంటుంది.

ఇటీవలే రిలీజ్ ట్రైలర్ ఈవెంట్ కి కూడా సామ్ హాజరులేదు. అక్కడ మీడియా నుండి ఎదురయ్యే క్వశ్చన్స్ ఫేస్ చేయలేకే అటెండ్ అవ్వలేదనే డిస్కషన్ నడుస్తుంది. టీజర్ లాంచ్ కి హాజరైంది కానీ అప్పుడు తెలుగు మీడియా కి నో క్వశ్చన్ అంటూ టీమ్ ముందే చెప్పేశారు.

ఏదేమైనా తెలుగు మీడియాకి సమంత కాస్త దూరంగానే ఉంటుంది. బహుశా చైతు గురించి, తన హెల్త్ గురించి క్వశ్చన్స్ ఎదురవుతాయని సామ్ ఊహించి అందుకే కాస్త దూరంగా ఉంటుంది కాబోలు. కానీ రిలీజ్ దగ్గర్లో మాత్రం తెలుగు మీడియాను సామ్ ఫేస్ చేయాల్సిందే. సినిమాను ప్రమోట్ చేసుకోవాల్సిందే.