కథలు దర్శకులు ఒక హీరో చేతి నుంచి మరొకరికి వెళ్లడం ఇండస్ట్రీలో సర్వ సాధారణం. కాకపోతే మనం తీసుకున్నది సరైన నిర్ణయమా కాదానేది బాక్సాఫీస్ రిజల్ట్ చూశాకే తెలుస్తుంది. ఇవాళ విశ్వక్ సేన్ హీరోగా సితార ఎంటర్ టైన్మెంట్స్ తమ 21వ సినిమాని ప్రకటించింది. ఎక్కువ డీటెయిల్స్ రివీల్ చేయలేదు కానీ లాంచ్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేయడానికి విడుదల చేసిన వీడియోలో సంగీత దర్శకుడిగా యువన్ శంకర్ రాజా పేరొకటి హైలైట్ చేశారు.
నాగ చైతన్య కస్టడీకి తండ్రి ఇళయరాజాతో కలిసి యువన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ వెనుక ఒక ఇంటరెస్టింగ్ సెటప్ ఉంది. దీని దర్శకుడు కృష్ణ చైతన్య. నారా రోహిత్ కున్న అతి కొద్ది హిట్లలో ఒకటైన రౌడీ ఫెలో ఇతను తీసిందే. తర్వాత నితిన్ తో చల్ మోహనరంగా చేశాడు. పవన్ కళ్యాణ్ నిర్మాణంలో త్రివిక్రమ్ పర్యవేక్షణలో రూపొందిన ఆ లవ్ డ్రామా ఆశించిన విజయం సాధించలేదు.
తిరిగి నితిన్ తోనే గుంటూరు బ్యాక్ డ్రాప్ లో పవర్ పేట టైటిల్ తో గ్యాంగ్ స్టర్ డ్రామాని ప్లాన్ చేసుకున్నాడు కృష్ణ చైతన్య. స్క్రిప్ట్ కూడా రెడీ అయ్యింది. రెండు భాగాలుగా నితిన్ ని వివిధ వయసుల్లో చూపించేలా రాసుకున్నాడు. కానీ ముందుకెళ్ళలేదు. తర్వాత చాలా గ్యాప్ వచ్చేసింది. ఎందుకో నితిన్ డ్రాప్ అయ్యాడు.
ఇప్పుడా కథనే విశ్వక్ సేన్ తో కృష్ణచైతన్య ఈ సినిమాగా తీస్తున్నాడని ఇన్ సైడ్ టాక్. వీడియోలో ఉన్న బ్యాక్ గ్రౌండ్ విజువల్స్ చూస్తే పోలికలు సరిపోతున్నాయి. పైగా డార్క్, నెగటివ్ అంటూ హింట్లు కూడా ఇచ్చారు. ఇటీవలే దాస్ కా ధమ్కీతో ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయిన విశ్వక్ సేన్ మొత్తానికి పెద్ద బ్యానర్ చేతిలో పడ్డాడు. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కాబోతున్న ఈ చిత్రానికి టైటిల్ ఇంకా లాక్ చేయలేదు. కృష్ణచైతన్యకు తిరిగి త్రివిక్రమ్ క్యాంపే చేయూతనందించడం విశేషం.
This post was last modified on March 29, 2023 4:15 pm
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…
మలయాళంలో దృశ్యం 3 షూటింగ్ అయిపోయింది. మోహన్ లాల్ సహకారంతో దర్శకుడు జీతూ జోసెఫ్ చాలా వేగంగా పూర్తి చేసి…