సమంతేంటి.. దిల్ రాజు కూతురేంటి అని సందేహం కలుగుతోందా? ఏదైనా సినిమాలో సమంతకు తండ్రిగా దిల్ రాజు నటిస్తున్నాడనిపిస్తోందా? ఇక్కడ విషయం వేరులెండి. ముంబయి వాళ్లు సమంత.. దిల్ రాజుకు కూతురని అనుకుంటున్నారట. ఈ విషయాన్ని ‘శాకుంతలం’ దర్శకుడు గుణశేఖర్ ఈ సినిమా ప్రెస్ మీట్లో చెప్పాడు. ఈ సినిమాకు దిల్ రాజు సహ నిర్మాత అన్న సంగతి తెలిసిందే.
సినిమా కోసం ఆయన పరిమితికి మించి ఖర్చు పెట్టాడని.. ఆ ఖర్చు చూసి ముంబయి జనాలు సమంత రాజుకు కూతురేమో.. అందుకే ఇంత ఖర్చు పెట్టాడేమో అనుకుంటున్నారని.. ఇదే మాట తనతో అన్నారని గుణశేఖర్ తెలిపాడు. ‘శాకుంతలం’ సినిమా త్రీడీలో రిలీజవుతుండటానికి రాజే కారణమని గుణ వెల్లడించాడు. పట్టుబట్టి ఆయనే సినిమాను త్రీడీలో చేయించినట్లు తెలిపాడు.
ముందు త్రీడీలో తీసిన ఒక సన్నివేశం చూసి దిల్ రాజు మెస్మరైజ్ అయ్యాడట. ఆ తర్వాత మొత్తం త్రీడీలో తీద్దాం అనే ప్రపోజల్ రాజే పెట్టాడట. దీని వల్ల బడ్జెట్ బాగా ఎక్కువ అవుతుందని అన్నా కూడా ఆయన పర్వాలేదని, క్వాలిటీనే ముఖ్యం అని భావించి బడ్జెట్ పెంచారని.. త్రీడీ వల్ల సినిమా ఆరు నెలలు ఆలస్యం అయిందని గుణశేఖర్ వెల్లడించాడు.
ఇండియాలో ఇప్పటిదాకా వచ్చిన లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో హైయెస్ట్ బడ్జెట్ రికార్డు ‘శాకుంతలం’దే అని.. ప్రేక్షకులకు ఈ సినిమాతో సరికొత్త అనుభూతిని అందిస్తామని గుణ ధీమా వ్యక్తం చేశాడు. సమంతకు జోడీగా మలయాళ నటుడు దేవ్ మోహన్ నటించిన ‘శాకుంతలం’ పాన్ ఇండియా స్థాయిలో ఐదు భాషల్లో ఒకేసారి ఏప్రిల్ 14న విడుదల కానుంది. గుణ సొంత బేనర్లో ఈ సినిమా తెరకెక్కింది.
This post was last modified on March 29, 2023 3:05 pm
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…
ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికాల యుద్ధం మన దేశంపై కూడా ప్రభావం చూపుతోంది. పెట్రోల్, డీజిల్ తో పోలిస్తే ఎల్పీజీ…