ఇంకో ఇరవై నాలుగు గంటల కంటే తక్కువ వ్యవధిలో దసరా షోలు ప్రారంభం కాబోతున్నాయి. న్యాచురల్ స్టార్ కెరీర్ లో మొట్టమొదటిసారి ఊర మాస్ క్యారెక్టర్ కావడంతో నాని బోలెడు నమ్మకంతో ఉన్నాడు. దీనికి పని చేసిన పన్నెండు మంది అసిస్టెంట్ డైరెక్టర్లు అందరికీ అడ్వాన్స్ చెక్కులు ఇచ్చుకోండని చెప్పడం బట్టి చూస్తే కాన్ఫిడెన్స్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
అసలే బాక్సాఫీస్ ఏమంత జోష్ లో లేదు. దాస్ కా ధమ్కీ మొదటి రెండు మూడు రోజుల హడావిడి తప్ప తర్వాత స్లో అయిపోయింది. అందుకే ట్రేడ్ చూపు దసరా మీదే ఉంది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 2700కి పైగా స్క్రీన్లలో దసరాని రిలీజ్ చేయబోతున్నారు. థియేట్రికల్ బిజినెస్ 50 కోట్ల దాకా జరిగినట్టు సమాచారం. ఇందులో ఒక్క నైజామ్ నుంచే 13 కోట్ల డీల్స్ జరిగాయట.
ఓవర్సీస్ లో ప్రీమియర్లు పడే సమయానికి అర మిలియన్ సులభంగా దాటొచ్చని అక్కడి విశ్లేషకుల అంచనా. మార్నింగ్ షో టాక్ ఏ మాత్రం పాజిటివ్ గా వచ్చినా ఆపై జరిగే ఊచకోత మాములుగా ఉండదు. ముఖ్యంగా బిసి సెంటర్లలో వసూళ్ల సునామిని ఎక్స్ పెక్ట్ చేయొచ్చు. హైదరాబాద్ లాంటి ఏ కేంద్రాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ మంచి స్వింగ్ లో ఉన్నాయి.
నానికి ఇది సక్సెస్ అయితే ప్యాన్ ఇండియా మార్కెట్ వచ్చేస్తుంది. ఆపై చేయబోయే సినిమాలకు రెవిన్యూ ప్లస్ రెమ్యునరేషన్ పరంగా పెద్ద ప్లస్ అవుతుంది. పైగా చెప్పుకోదగ్గ పోటీ ఏదీ లేకపోవడం దసరాకు మరో సానుకూలాంశం. ఇంటర్ తో పాటు కొన్ని తరగతుల కీలక పరీక్షలు ముగియడంతో స్టూడెంట్స్ అంతా థియేటర్లకు వస్తే వాళ్లకు ఉన్న ఒకే ఆప్షన్ దసరానే. ఎలాగూ గురువారం వస్తోంది కాబట్టి వీకెండ్ మొత్తం నాలుగు రోజులు ఉంటుంది. బాగుందనే మాట వినడమే బాకీ. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన దసరాలో కీర్తి సురేష్ హీరోయిన్ కాగా సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు
సమంత అసాధ్యం అనుకున్నది చేసి చూపించేసింది. ఈ రోజుతో మా ఇంటి బంగారం వంద కోట్ల గ్రాస్ క్లబ్బులో అడుగు…
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…