దసరా పై బోయపాటి కర్చీఫ్వచ్చే ఏడాది సంక్రాంతి కి ఇప్పటికే రెండు భారీ సినిమాలు కర్చీఫ్ వేసేసుకున్నాయి. ఇక మిగిలిన దసరా సీజన్ పై కూడా కన్నేస్తున్నారు స్టార్ దర్శకులు. తాజాగా బోయపాటి రామ్ కాంబో సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 20 రిలీజ్ అంటూ ప్రకటించారు.
అఖండ తర్వాత బోయపాటి నుండి రాబోతున్న ఈ మాస్ యాక్షన్ సినిమాపై మంచి అంచనాలున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ లో షూట్ జరుపుకుంటున్న ఈ సినిమా ఇప్పటికే యాభై శాతం షూట్ కంప్లీట్ చేసుకుంది.
పూరితో చేసిన ఇస్మార్ట్ శంకర్ తో రామ్ కి మాస్ లో క్రేజ్ వచ్చింది. ఈ సినిమా తర్వాత ఆశించిన మాస్ హిట్ అందుకోలేక పోయాడు రామ్. ఈసారి బోయపాటి తనకి పోటీ లెవెల్ మాస్ బ్లాక్ బస్టర్ ఇస్తాడని నమ్మకంతో ఉన్నాడు.
రామ్ సరసన శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ప్రిన్స్ కీ రోల్ ప్లే చేస్తున్నాడు. బోయపాటి స్టైల్ యాక్షన్ ఇందులో భారీ గా ఉండబోతుంది. అందుకే దసరా సీజన్ కి సినిమా రిలీజ్ ను లాక్ చేశారు.
This post was last modified on March 28, 2023 7:21 am
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…
దేశంలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…