దసరా పై బోయపాటి కర్చీఫ్వచ్చే ఏడాది సంక్రాంతి కి ఇప్పటికే రెండు భారీ సినిమాలు కర్చీఫ్ వేసేసుకున్నాయి. ఇక మిగిలిన దసరా సీజన్ పై కూడా కన్నేస్తున్నారు స్టార్ దర్శకులు. తాజాగా బోయపాటి రామ్ కాంబో సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 20 రిలీజ్ అంటూ ప్రకటించారు.
అఖండ తర్వాత బోయపాటి నుండి రాబోతున్న ఈ మాస్ యాక్షన్ సినిమాపై మంచి అంచనాలున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ లో షూట్ జరుపుకుంటున్న ఈ సినిమా ఇప్పటికే యాభై శాతం షూట్ కంప్లీట్ చేసుకుంది.
పూరితో చేసిన ఇస్మార్ట్ శంకర్ తో రామ్ కి మాస్ లో క్రేజ్ వచ్చింది. ఈ సినిమా తర్వాత ఆశించిన మాస్ హిట్ అందుకోలేక పోయాడు రామ్. ఈసారి బోయపాటి తనకి పోటీ లెవెల్ మాస్ బ్లాక్ బస్టర్ ఇస్తాడని నమ్మకంతో ఉన్నాడు.
రామ్ సరసన శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ప్రిన్స్ కీ రోల్ ప్లే చేస్తున్నాడు. బోయపాటి స్టైల్ యాక్షన్ ఇందులో భారీ గా ఉండబోతుంది. అందుకే దసరా సీజన్ కి సినిమా రిలీజ్ ను లాక్ చేశారు.
పోలీసు స్టేషన్లకు వెళ్లి ఫిర్యాదు చేయాల్సిన అవసరం లేకుండా.. ఇక నుంచి వాయిస్ మెసేజ్ల ద్వారా కూడా ఫిర్యాదులు చేసే…
ఏపీలో వైసీపీ అదికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలోని పాత జిల్లాలతో పాటుగా వైసీపీ సర్కారే కొత్తగా ఏర్పాటు చేసిన కొత్త జిల్లాల్లోనూ…
పవన్ కళ్యాణ్ భుజాల లోపల కలిగిన గాయం ఊహించిన దానికంటే తీవ్రంగా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్…
ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును వేధింపులకు గురిచేసి.. కస్టడీలో టార్చర్ చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్ సునీల్ కుమార్…
రాజకీయాలంటే చాలా మంది చెడిపోయాయని అనుకుంటారు. కానీ, రాజకీయాలు అంతగా ఏమీ చెడిపోలేదు. ఒక పార్టీ కారణంగానే ఈ పేరు…
జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అనౌన్స్ మెంట్ ఇవాళ వచ్చేసింది. నిజానికి…