సీనియర్ హీరోలకు హీరోయిన్లను సెట్ చేయడం ఈ రోజుల్లో చాలా చాలా కష్టమైపోతోంది. 70, 80 దశకాల్లో మాదిరి హీరోలు తమ వయసులో మూడో వంతున్న హీరోయిన్లతో ఏ ఫీలింగ్ లేకుండా రొమాన్స్ చేసే పరిస్థితి లేదిప్పుడు. అలా చేస్తే ప్రేక్షకుల నుంచి వెటకారాలు తప్పవు. సీనియర్ల పక్కన యంగ్గా అనిపించే హీరోయిన్లను పెడితే.. అదో రకమైన ఫీలింగ్ వచ్చేస్తోంది జనాలకు.
వాళ్ల కెమిస్ట్రీ, రొమాన్స్ అస్సలు వర్కవుట్ కావడం లేదు. దీంతో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్.. ఈ నలుగురికీ హీరోయిన్ల సమస్య తప్పట్లేదు. తన చివరి సినిమా ‘ఎఫ్-3’లో తమన్నాతో జోడీ కట్టాడు వెంకీ. ఇప్పుడు ఆయన ‘హిట్’ డైరెక్టర్ శైలేష్ కొలనుతో ‘సైంధవ్’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఓ కథానాయికగా రుహాని శర్మను అనుకుంటున్నట్లు వార్తలొచ్చాయి.
ఐతే ఆమెది ఇందులో సెకండ్ హీరోయిన్ పాత్ర అట. మెయిన్ లీడ్ కోసం వేరే అమ్మాయిని ఎంచుకున్నారు. ఆ అమ్మాయి కన్నడ భామ శ్రద్ధ శ్రీనాథ్ అని సమాచారం. శ్రద్ధ ఈ తరం హీరోయినే అయినా.. విశాల్ లాంటి సీనియర్లతోనూ నటించింది. వెంకీ సరసన ఆమె ఆడ్గా ఏమీ అనిపించకపోవచ్చు.
తెలుగులో ఆమె నటిస్తున్న అత్యంత పెద్ద సినిమా ఇదే కానుంది. తెలుగులో ఆమెకు కృష్ణ అండ్ హిజ్ లీల, జెర్సీ లాంటి మంచి సినిమాలున్నాయి. ‘సైంధవ్’లో బాలీవుడ్ విలక్షణ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖి విలన్ పాత్ర చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా అనౌన్స్మెంట్ వీడియో చూస్తే ఇంటెన్స్ యాక్షన్ ఎంటర్టైనర్ లాగా కనిపించింది. వెంకీకిది 75వ సినిమా కావడం విశేషం.
This post was last modified on March 27, 2023 7:25 am
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…
అప్పుడు మహ్మద్ గజని… ఇప్పుడు వైఎస్ జగన్ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…
సంక్రాంతి సీజన్ లో భారీ అంచనాల మధ్య వచ్చిన ది రాజా సాబ్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఒక రకమైన…
సంక్రాంతి రేసులో రెండో పుంజు దిగుతోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ది రాజా సాబ్ ఫలితం మీద దాదాపు…
వాళ్లు వీళ్లు అన్న తేడా లేకుండా మోసమే శ్వాసగా మారి.. తమ మాటల్ని నమ్మినోళ్లను మోసం చేసే సైబర్ బందిపోట్లు..…
వేటూరి, సిరివెన్నెల లాంటి దిగ్గజ గేయ రచయితలు వెళ్ళిపోయాక తెలుగు సినీ పాటల స్థాయి తగ్గిపోయిందని సాహితీ అభిమానులు బాధ…