సీనియర్ హీరోలకు హీరోయిన్లను సెట్ చేయడం ఈ రోజుల్లో చాలా చాలా కష్టమైపోతోంది. 70, 80 దశకాల్లో మాదిరి హీరోలు తమ వయసులో మూడో వంతున్న హీరోయిన్లతో ఏ ఫీలింగ్ లేకుండా రొమాన్స్ చేసే పరిస్థితి లేదిప్పుడు. అలా చేస్తే ప్రేక్షకుల నుంచి వెటకారాలు తప్పవు. సీనియర్ల పక్కన యంగ్గా అనిపించే హీరోయిన్లను పెడితే.. అదో రకమైన ఫీలింగ్ వచ్చేస్తోంది జనాలకు.
వాళ్ల కెమిస్ట్రీ, రొమాన్స్ అస్సలు వర్కవుట్ కావడం లేదు. దీంతో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్.. ఈ నలుగురికీ హీరోయిన్ల సమస్య తప్పట్లేదు. తన చివరి సినిమా ‘ఎఫ్-3’లో తమన్నాతో జోడీ కట్టాడు వెంకీ. ఇప్పుడు ఆయన ‘హిట్’ డైరెక్టర్ శైలేష్ కొలనుతో ‘సైంధవ్’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఓ కథానాయికగా రుహాని శర్మను అనుకుంటున్నట్లు వార్తలొచ్చాయి.
ఐతే ఆమెది ఇందులో సెకండ్ హీరోయిన్ పాత్ర అట. మెయిన్ లీడ్ కోసం వేరే అమ్మాయిని ఎంచుకున్నారు. ఆ అమ్మాయి కన్నడ భామ శ్రద్ధ శ్రీనాథ్ అని సమాచారం. శ్రద్ధ ఈ తరం హీరోయినే అయినా.. విశాల్ లాంటి సీనియర్లతోనూ నటించింది. వెంకీ సరసన ఆమె ఆడ్గా ఏమీ అనిపించకపోవచ్చు.
తెలుగులో ఆమె నటిస్తున్న అత్యంత పెద్ద సినిమా ఇదే కానుంది. తెలుగులో ఆమెకు కృష్ణ అండ్ హిజ్ లీల, జెర్సీ లాంటి మంచి సినిమాలున్నాయి. ‘సైంధవ్’లో బాలీవుడ్ విలక్షణ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖి విలన్ పాత్ర చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా అనౌన్స్మెంట్ వీడియో చూస్తే ఇంటెన్స్ యాక్షన్ ఎంటర్టైనర్ లాగా కనిపించింది. వెంకీకిది 75వ సినిమా కావడం విశేషం.
This post was last modified on March 27, 2023 7:25 am
ఏపీ సీఎం చంద్రబాబుకు కేంద్రం చేసిన ప్రతిపాదన తీవ్ర సంకట స్థితిలోకి నెట్టేసింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలంటూ.. కేంద్ర…
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…