చూస్తుంటే బాలీవుడ్ మళ్ళీ క్రాస్ రోడ్స్ లోకి వచ్చినట్టుంది. పఠాన్ సాధించిన వెయ్యి కోట్ల ఆనందం మెల్లగా ఆవిరయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కిందా మీద పడి తూ ఝూటి మై మక్కర్ హిట్ అనిపించుకుని వంద కోట్ల మార్క్ దాటేస్తే మిగిలినవి కనీసం పబ్లిసిటీ ఖర్చలు కూడా తేవడం లేదు. నిన్న భీడ్ రిలీజయ్యింది. విలక్షణమైన కథలను ఎంచుకుంటాడని పేరున్న రాజ్ కుమార్ రావు హీరో. భూమి పెడ్నేకర్ హీరోయిన్. కరోనా సమయంలో మొదటిసారి విధించిన లాక్ డౌన్ పరిస్థితుల నేపథ్యంలో దర్శకుడు అనుభవ్ సిన్హా ఈ భీడ్ ని రూపొందించారు.
ఈయనేమి ఆషామాషీ డైరెక్టర్ కాదు. ఆర్టికల్ 15 మూవీ రేపిన సంచలనం అందరికీ గుర్తే. ముల్క్, తప్పడ్ లు విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి. అనేక్ మాత్రం ఫ్లాప్ అయ్యింది. సరే ఇవన్నీ ఫలితంతో సంబంధం లేకుండా డీసెంట్ నెంబర్లు నమోదు చేసుకున్నవి. కానీ భీడ్ మాత్రం విడుదల రోజు దేశవ్యాప్తంగా అన్ని సెంటర్లలో కలిపి కేవలం 15 లక్షల నెట్ ని వసూలు చేయడం ట్రేడ్ ని నివ్వెరపరిచింది. చాలా చోట్ల కనీసం ఒకరిద్దరు ఆడియన్స్ కూడా లేక షోలు క్యాన్సిల్ చేశారు. చూసిన పది ఇరవై మంది బానే ఉందని చెప్పడం కొసమెరుపు.
సహజత్వం కోసం భీడ్ ని బ్లాక్ అండ్ వైట్ లో తీయడం ప్రేక్షకుల్లో ఆసక్తిని చంపేసింది. ఎంత న్యాచురాలిటీ అయినా మరీ ఇంత సాహసానికి ఒడిగడితే కష్టమే. పైగా పెద్ద స్క్రీన్ మీద అంతసేపు రంగులు లేకుండా ఇంత సీరియస్ డ్రామాని జనం భరించలేరు. అందుకే ఫలితం కూడా రివర్స్ అయ్యింది. కబ్జలాంటి ఇతర బాషల నుంచి డబ్బింగ్ చేసినవి సైతం డిజాస్టర్ కావడంతో నార్త్ బయ్యర్ల కళ్లన్నీ అజయ్ దేవగన్ భోళా మీద ఉన్నాయి. నాని ప్రమోషన్ల పుణ్యమాని దసరాకు కూడా మెల్లగా బజ్ పెరుగుతోంది. ఇక సోమవారం నుంచి భీడ్ పని ముగిసినట్టే.
This post was last modified on March 25, 2023 12:13 pm
మనం ఎంతో పారదర్శకంగా వ్యవహరిస్తున్నాం. ఎవరికీ ఎలాంటిఇబ్బంది లేకుండా చేస్తున్నాం. అయినా.. జగన్ను కొందరు కలుస్తున్నారు. ఇలా ఎందుకు జరుగుతోంది..?…
ఏపీ రాజధాని విషయంలో వైసీపీ అధినేత జగన్ పక్కా క్లారిటీతోనే ఉన్నారా? అంటే.. ఔననే ఆయన చెబుతున్నారు. ప్రజలు మెచ్చుతారా..…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. యుద్ధమైనా.. విపత్తయినా.. ప్రజలకు ఏం…
ఈ రోజుల్లో ఓ మోస్తరు మార్కెట్ ఉన్న హీరోల పరిస్థితి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. థియేటర్లకు వచ్చే జనం…
ఇండియన్ క్రికెట్లోనే ఐపీఎల్లో అద్భుతమైన రికార్డులున్న క్రికెటర్లలో మహేంద్ర సింగ్ ధోని ఒకడు. అతడి సారథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్…
ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు, మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ తాను తప్పు చేసినట్టుగా ఒప్పేసుకున్నారు. జనసేనాని, ఏపీ డిప్యూటీ సీఎం…