Movie News

వెంకీ వెనుక చిరు చక్రవ్యూహం

ఎట్టకేలకు భీష్మ తర్వాత దర్శకుడు వెంకీ కుడుముల కొత్త సినిమా మొదలైపోయింది. అదే కాంబినేషన్ ని రిపీట్ చేస్తూ నితిన్ రష్మిక మందన్న జోడిగా దీన్ని తెరకెక్కించబోతున్నారు. ఇవాళ హైదరాబాద్ లో మైత్రి మూవీ మేకర్స్ గ్రాండ్ గా ప్రారంభోత్సవం జరిపింది. సంస్థలో పని చేసిన డైరెక్టర్లతో పాటు అతిథులు చాలానే వచ్చారు. నిజానికి వెంకీతో చిరంజీవి హీరోగా డివివి దానయ్య ఎప్పుడో ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు. కానీ కథ విషయంలో ఏకాభిప్రాయం రాకపోవడంతో దాన్ని క్యాన్సిల్ చేశారు. దీంతో కుడుముల ఎక్కువ సమయం వేచి చూడాల్సి వచ్చింది.

ఓ కుర్ర దర్శకుడి సమయాన్ని వృధా చేసారనే కామెంట్లు చిరు మీద వచ్చాయి. అయితే దీని వెనుక మెగా వ్యూహం ఉందని ఇన్ సైడ్ టాక్. వాల్తేరు వీరయ్య షూటింగ్ జరుగుతున్న సమయంలో మైత్రితో వెంకీ కుడుములని జట్టు కట్టించిందే మెగాస్టారని వినికిడి. ప్యాన్ ఇండియా సినిమాలు మాత్రమే చేస్తున్న రశ్మిక మందన్నకు భారీ రెమ్యునరేషన్ ఇచ్చి ఒప్పించడానికి, మంచి డిమాండ్ లో జీవి ప్రకాష్ కుమార్ ని సంగీతం కోసం సెట్ చేయడానికి బడ్జెట్ విషయంలో రాజీ లేకుండా చూడమని చిరునే ఒప్పించారట.

ఈ కారణంగానే నితిన్ మార్కెట్ కొంత డౌన్ లో ఉన్నప్పటికీ దాన్ని పట్టించుకోకుండా నిర్మాతలు నవీన్, రవిలు ఆడిగినంతా ఖర్చు పెట్టడానికి సిద్ధపడినట్టు సమాచారం. ఇది పూర్తయ్యాక అప్పటికి వెంకీ కుడుముల ఏదైనా కొత్త స్టోరీని సిద్ధం చేసుకుని ఒప్పిస్తే చిరుతో సినిమా పట్టాలు ఎక్కేస్తుంది. భోళా శంకర్ తర్వాత చిరంజీవి ఎవరికీ కమిట్మెంట్లు ఇవ్వలేదు. మాట అయితే పెండింగ్ పెట్టారు కానీ పూర్తిగా అయితే రద్దు కాలేదు. ఇవన్నీ క్లియర్ చేయడానికే చిరంజీవి స్పెషల్ గెస్టుగా రావడం కొసమెరుపు.

This post was last modified on March 24, 2023 3:37 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

36 minutes ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

3 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

5 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

9 hours ago

జగన్ ఇలానే ఉండాలంటూ టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

11 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

12 hours ago