Movie News

వెంకీ వెనుక చిరు చక్రవ్యూహం

ఎట్టకేలకు భీష్మ తర్వాత దర్శకుడు వెంకీ కుడుముల కొత్త సినిమా మొదలైపోయింది. అదే కాంబినేషన్ ని రిపీట్ చేస్తూ నితిన్ రష్మిక మందన్న జోడిగా దీన్ని తెరకెక్కించబోతున్నారు. ఇవాళ హైదరాబాద్ లో మైత్రి మూవీ మేకర్స్ గ్రాండ్ గా ప్రారంభోత్సవం జరిపింది. సంస్థలో పని చేసిన డైరెక్టర్లతో పాటు అతిథులు చాలానే వచ్చారు. నిజానికి వెంకీతో చిరంజీవి హీరోగా డివివి దానయ్య ఎప్పుడో ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు. కానీ కథ విషయంలో ఏకాభిప్రాయం రాకపోవడంతో దాన్ని క్యాన్సిల్ చేశారు. దీంతో కుడుముల ఎక్కువ సమయం వేచి చూడాల్సి వచ్చింది.

ఓ కుర్ర దర్శకుడి సమయాన్ని వృధా చేసారనే కామెంట్లు చిరు మీద వచ్చాయి. అయితే దీని వెనుక మెగా వ్యూహం ఉందని ఇన్ సైడ్ టాక్. వాల్తేరు వీరయ్య షూటింగ్ జరుగుతున్న సమయంలో మైత్రితో వెంకీ కుడుములని జట్టు కట్టించిందే మెగాస్టారని వినికిడి. ప్యాన్ ఇండియా సినిమాలు మాత్రమే చేస్తున్న రశ్మిక మందన్నకు భారీ రెమ్యునరేషన్ ఇచ్చి ఒప్పించడానికి, మంచి డిమాండ్ లో జీవి ప్రకాష్ కుమార్ ని సంగీతం కోసం సెట్ చేయడానికి బడ్జెట్ విషయంలో రాజీ లేకుండా చూడమని చిరునే ఒప్పించారట.

ఈ కారణంగానే నితిన్ మార్కెట్ కొంత డౌన్ లో ఉన్నప్పటికీ దాన్ని పట్టించుకోకుండా నిర్మాతలు నవీన్, రవిలు ఆడిగినంతా ఖర్చు పెట్టడానికి సిద్ధపడినట్టు సమాచారం. ఇది పూర్తయ్యాక అప్పటికి వెంకీ కుడుముల ఏదైనా కొత్త స్టోరీని సిద్ధం చేసుకుని ఒప్పిస్తే చిరుతో సినిమా పట్టాలు ఎక్కేస్తుంది. భోళా శంకర్ తర్వాత చిరంజీవి ఎవరికీ కమిట్మెంట్లు ఇవ్వలేదు. మాట అయితే పెండింగ్ పెట్టారు కానీ పూర్తిగా అయితే రద్దు కాలేదు. ఇవన్నీ క్లియర్ చేయడానికే చిరంజీవి స్పెషల్ గెస్టుగా రావడం కొసమెరుపు.

Satya

Recent Posts

మ్యూజిక్ చిచ్చు పెట్టిన ‘గాడ్ ఆఫ్ వార్’

తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…

30 minutes ago

ఎట్టకేలకు బూత్ స్థాయిపై జనసేన కన్ను

బూత్ స్థాయిలో బ‌లోపేతం అయ్యే దిశ‌గా జ‌న‌సేన క‌స‌ర‌త్తు షురూ చేసింది. ప్ర‌స్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయ‌కులు ఉన్న‌ప్ప‌టికీ..…

1 hour ago

రాజధాని భూముల రచ్చలో నిజమేంటి..?

ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…

2 hours ago

నాగ‌వంశీ చెప్పింది నిజమే

లెనిన్ సినిమా ప్ర‌మోష‌న్ల‌లో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాత‌ల్లో ఒక‌రైన నాగ‌వంశీ. లెనిన్…

8 hours ago

పిల్లలు వద్దనుకుంటే సంపదను వదులుకున్నట్టే: చంద్రబాబు

పిల్లలు సంప‌ద అని సీఎం చంద్ర‌బాబు మ‌రోసారి స్ప‌ష్టం చేశారు. తాను చెప్పిన మాటకే క‌ట్టుబ‌డి ఉన్నాన‌ని తెలిపారు. దీనిని…

9 hours ago

విషాదం మిగిల్చిన విహారం… తెలుగువారు మృతి

వియ‌త్నాంలో విహార యాత్ర‌కు వెళ్లిన భార‌తీయుల కుటుంబాల్లో విషాదం నెల‌కొంది. ఊహించ‌ని ప్ర‌మాదంలో చిక్కుకుని 15 మంది భార‌తీయులు మృతి…

9 hours ago