ఎట్టకేలకు భీష్మ తర్వాత దర్శకుడు వెంకీ కుడుముల కొత్త సినిమా మొదలైపోయింది. అదే కాంబినేషన్ ని రిపీట్ చేస్తూ నితిన్ రష్మిక మందన్న జోడిగా దీన్ని తెరకెక్కించబోతున్నారు. ఇవాళ హైదరాబాద్ లో మైత్రి మూవీ మేకర్స్ గ్రాండ్ గా ప్రారంభోత్సవం జరిపింది. సంస్థలో పని చేసిన డైరెక్టర్లతో పాటు అతిథులు చాలానే వచ్చారు. నిజానికి వెంకీతో చిరంజీవి హీరోగా డివివి దానయ్య ఎప్పుడో ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు. కానీ కథ విషయంలో ఏకాభిప్రాయం రాకపోవడంతో దాన్ని క్యాన్సిల్ చేశారు. దీంతో కుడుముల ఎక్కువ సమయం వేచి చూడాల్సి వచ్చింది.
ఓ కుర్ర దర్శకుడి సమయాన్ని వృధా చేసారనే కామెంట్లు చిరు మీద వచ్చాయి. అయితే దీని వెనుక మెగా వ్యూహం ఉందని ఇన్ సైడ్ టాక్. వాల్తేరు వీరయ్య షూటింగ్ జరుగుతున్న సమయంలో మైత్రితో వెంకీ కుడుములని జట్టు కట్టించిందే మెగాస్టారని వినికిడి. ప్యాన్ ఇండియా సినిమాలు మాత్రమే చేస్తున్న రశ్మిక మందన్నకు భారీ రెమ్యునరేషన్ ఇచ్చి ఒప్పించడానికి, మంచి డిమాండ్ లో జీవి ప్రకాష్ కుమార్ ని సంగీతం కోసం సెట్ చేయడానికి బడ్జెట్ విషయంలో రాజీ లేకుండా చూడమని చిరునే ఒప్పించారట.
ఈ కారణంగానే నితిన్ మార్కెట్ కొంత డౌన్ లో ఉన్నప్పటికీ దాన్ని పట్టించుకోకుండా నిర్మాతలు నవీన్, రవిలు ఆడిగినంతా ఖర్చు పెట్టడానికి సిద్ధపడినట్టు సమాచారం. ఇది పూర్తయ్యాక అప్పటికి వెంకీ కుడుముల ఏదైనా కొత్త స్టోరీని సిద్ధం చేసుకుని ఒప్పిస్తే చిరుతో సినిమా పట్టాలు ఎక్కేస్తుంది. భోళా శంకర్ తర్వాత చిరంజీవి ఎవరికీ కమిట్మెంట్లు ఇవ్వలేదు. మాట అయితే పెండింగ్ పెట్టారు కానీ పూర్తిగా అయితే రద్దు కాలేదు. ఇవన్నీ క్లియర్ చేయడానికే చిరంజీవి స్పెషల్ గెస్టుగా రావడం కొసమెరుపు.
This post was last modified on March 24, 2023 3:37 pm
ఇండస్ట్రీ పెద్ద ఎవరు..? ఈ ప్రశ్న టాలీవుడ్లో తరచుగా వినిపిస్తుంటుంది. ఒకప్పుడు దర్శక రత్న దాసరి నారాయణరావు ఈ పాత్రను…
ఎన్నికలు అనగానే నాయకుల్లో మార్పులు సహజం. మరీ ముఖ్యంగా ప్రధాన మంత్రినరేంద్ర మోడీ అయితే.. మరింత ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటారు.…
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…