Movie News

వెంకీ వెనుక చిరు చక్రవ్యూహం

ఎట్టకేలకు భీష్మ తర్వాత దర్శకుడు వెంకీ కుడుముల కొత్త సినిమా మొదలైపోయింది. అదే కాంబినేషన్ ని రిపీట్ చేస్తూ నితిన్ రష్మిక మందన్న జోడిగా దీన్ని తెరకెక్కించబోతున్నారు. ఇవాళ హైదరాబాద్ లో మైత్రి మూవీ మేకర్స్ గ్రాండ్ గా ప్రారంభోత్సవం జరిపింది. సంస్థలో పని చేసిన డైరెక్టర్లతో పాటు అతిథులు చాలానే వచ్చారు. నిజానికి వెంకీతో చిరంజీవి హీరోగా డివివి దానయ్య ఎప్పుడో ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు. కానీ కథ విషయంలో ఏకాభిప్రాయం రాకపోవడంతో దాన్ని క్యాన్సిల్ చేశారు. దీంతో కుడుముల ఎక్కువ సమయం వేచి చూడాల్సి వచ్చింది.

ఓ కుర్ర దర్శకుడి సమయాన్ని వృధా చేసారనే కామెంట్లు చిరు మీద వచ్చాయి. అయితే దీని వెనుక మెగా వ్యూహం ఉందని ఇన్ సైడ్ టాక్. వాల్తేరు వీరయ్య షూటింగ్ జరుగుతున్న సమయంలో మైత్రితో వెంకీ కుడుములని జట్టు కట్టించిందే మెగాస్టారని వినికిడి. ప్యాన్ ఇండియా సినిమాలు మాత్రమే చేస్తున్న రశ్మిక మందన్నకు భారీ రెమ్యునరేషన్ ఇచ్చి ఒప్పించడానికి, మంచి డిమాండ్ లో జీవి ప్రకాష్ కుమార్ ని సంగీతం కోసం సెట్ చేయడానికి బడ్జెట్ విషయంలో రాజీ లేకుండా చూడమని చిరునే ఒప్పించారట.

ఈ కారణంగానే నితిన్ మార్కెట్ కొంత డౌన్ లో ఉన్నప్పటికీ దాన్ని పట్టించుకోకుండా నిర్మాతలు నవీన్, రవిలు ఆడిగినంతా ఖర్చు పెట్టడానికి సిద్ధపడినట్టు సమాచారం. ఇది పూర్తయ్యాక అప్పటికి వెంకీ కుడుముల ఏదైనా కొత్త స్టోరీని సిద్ధం చేసుకుని ఒప్పిస్తే చిరుతో సినిమా పట్టాలు ఎక్కేస్తుంది. భోళా శంకర్ తర్వాత చిరంజీవి ఎవరికీ కమిట్మెంట్లు ఇవ్వలేదు. మాట అయితే పెండింగ్ పెట్టారు కానీ పూర్తిగా అయితే రద్దు కాలేదు. ఇవన్నీ క్లియర్ చేయడానికే చిరంజీవి స్పెషల్ గెస్టుగా రావడం కొసమెరుపు.

This post was last modified on March 24, 2023 3:37 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

52 minutes ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

1 hour ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

3 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

3 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

4 hours ago

బాబుకు కుప్పం ఎలానో… పవన్ కు పిఠాపురం అలా!

కుప్పం.. ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం. గ‌త 40 సంవ‌త్స‌రాలుగా ఏక ఛ‌త్రాధిప‌త్యంగా చంద్ర‌బాబు ఇక్క‌డ విజ‌యం దక్కించుకుంటున్నారు.…

5 hours ago