Movie News

పవన్ సినిమాలో లేనంటున్న మలయాళీ భామ

పవన్ కళ్యాణ్ సినిమాల షూటింగుల్లో ముందు ఏది పూర్తవుతుందో ఖచ్చితంగా చెప్పలేకపోయినా కమిటైన వాటికి సంబంధించిన పనులు మాత్రం ఆయా దర్శక నిర్మాతలు చేసుకుంటూ ఉన్నారు. తేరి రీమేక్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాక దర్శకుడు హరీష్ శంకర్ దాని కోసం గబ్బర్ సింగ్ తరహాలో కొన్ని కీలక మార్పులు చేసుకుని స్క్రిప్ట్ సిద్ధం చేసిన సంగతి తెలిసిందే. కాకపోతే మెయిన్ లైన్ మాత్రం మార్చకుండా కేవలం ట్రీట్ మెంట్ లోనే తేడాలుండేలా జాగ్రత్త పడుతున్నాడట. ఇక ఇద్దరు హీరోయిన్లలో ఆల్రెడీ శ్రీలీల లాక్ అయిన సంగతి తెలిసిందే.

తాజాగా మాళవిక మోహనన్ ని మరో జోడిగా ఎంచుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఒరిజినల్ వెర్షన్ ఫ్లాష్ బ్యాక్ లో సమంతా క్యారెక్టర్ చనిపోతుంది. అది జరిగాకే విజయ్ పోలీస్ ఉద్యోగం వదిలేసి వేరే చోట బేకరీ పెట్టుకుని జీవనం సాగిస్తాడు. అక్కడ స్కూల్ టీచర్ గా పని చేస్తున్న అమీ జాక్సన్ అతన్ని ఇష్టపడి కోరుకుంటుంది. క్లైమాక్స్ లో వాళ్ళు కలిసినట్టు పెళ్లైనట్టు చూపించకుండా వదిలేశాడు అట్లీ. ఇక్కడ సామ్ ప్లేసులోనే మాళవికను తీసుకున్నట్టు మీమ్స్ గట్రా వచ్చేశాయి. కానీ మాళవిక మాత్రం ఈ ప్రాజెక్టులో తాను లేనని ట్విట్టర్ లో అఫీషియల్ క్లారిటీ ఇచ్చింది.

మాళవిక మోహనన్ ఆల్రెడీ ప్రభాస్ మారుతీ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. అది కూడా టీమ్ అధికారికంగా చెప్పలేదు కానీ షూట్ లో ఉన్న మాట వాస్తవమే. ఇక పవన్ గురించి ప్రచారం ఎలా ఎక్కడి నుంచి మొదలైందో కానీ మొత్తానికి గంటల్లోనే వార్త వైరల్ అయ్యింది. మాములుగా ప్రొడక్షన్ హౌసులు ఖండించే ఇలాంటి న్యూస్ ని స్వయానా హీరోయినే స్పష్టత ఇవ్వడం విశేషం. టాలీవుడ్ డెబ్యూ గురించి ఎగ్జైటింగ్ గా ఉన్నానని పవన్ పట్ల ఎంతో గౌరవముందని అయితే తేరి రీమేక్ లో మాత్రం భాగం కాలేదని సినిమా పేరు ప్రస్తావించకుండానే కుండ బద్దలు కొట్టేసింది.

This post was last modified on March 21, 2023 4:40 pm

Share
Show comments

Recent Posts

నిన్న బాబు – నేడు పవన్!!

పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ…

13 minutes ago

ఐమాక్స్ వస్తే మన పరిస్తితి కూడా ఇంతేనా?

దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…

2 hours ago

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

3 hours ago

గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…

4 hours ago

చరణ్ రాకతో పెరిగిన ఛాంపియన్ మైలేజ్

నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…

4 hours ago

రుషికొండ పంచాయతీ… కొలిక్కి వచ్చినట్టేనా?

వైసీపీ హ‌యాంలో విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క ప్రాంతం రుషికొండ‌ను తొలిచి.. నిర్మించిన భారీ భ‌వ‌నాల వ్య‌వ‌హారం కొలిక్కి వ‌స్తున్న‌ట్టు ప్ర‌భుత్వ…

5 hours ago