పవన్ కళ్యాణ్ సినిమాల షూటింగుల్లో ముందు ఏది పూర్తవుతుందో ఖచ్చితంగా చెప్పలేకపోయినా కమిటైన వాటికి సంబంధించిన పనులు మాత్రం ఆయా దర్శక నిర్మాతలు చేసుకుంటూ ఉన్నారు. తేరి రీమేక్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాక దర్శకుడు హరీష్ శంకర్ దాని కోసం గబ్బర్ సింగ్ తరహాలో కొన్ని కీలక మార్పులు చేసుకుని స్క్రిప్ట్ సిద్ధం చేసిన సంగతి తెలిసిందే. కాకపోతే మెయిన్ లైన్ మాత్రం మార్చకుండా కేవలం ట్రీట్ మెంట్ లోనే తేడాలుండేలా జాగ్రత్త పడుతున్నాడట. ఇక ఇద్దరు హీరోయిన్లలో ఆల్రెడీ శ్రీలీల లాక్ అయిన సంగతి తెలిసిందే.
తాజాగా మాళవిక మోహనన్ ని మరో జోడిగా ఎంచుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఒరిజినల్ వెర్షన్ ఫ్లాష్ బ్యాక్ లో సమంతా క్యారెక్టర్ చనిపోతుంది. అది జరిగాకే విజయ్ పోలీస్ ఉద్యోగం వదిలేసి వేరే చోట బేకరీ పెట్టుకుని జీవనం సాగిస్తాడు. అక్కడ స్కూల్ టీచర్ గా పని చేస్తున్న అమీ జాక్సన్ అతన్ని ఇష్టపడి కోరుకుంటుంది. క్లైమాక్స్ లో వాళ్ళు కలిసినట్టు పెళ్లైనట్టు చూపించకుండా వదిలేశాడు అట్లీ. ఇక్కడ సామ్ ప్లేసులోనే మాళవికను తీసుకున్నట్టు మీమ్స్ గట్రా వచ్చేశాయి. కానీ మాళవిక మాత్రం ఈ ప్రాజెక్టులో తాను లేనని ట్విట్టర్ లో అఫీషియల్ క్లారిటీ ఇచ్చింది.
మాళవిక మోహనన్ ఆల్రెడీ ప్రభాస్ మారుతీ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. అది కూడా టీమ్ అధికారికంగా చెప్పలేదు కానీ షూట్ లో ఉన్న మాట వాస్తవమే. ఇక పవన్ గురించి ప్రచారం ఎలా ఎక్కడి నుంచి మొదలైందో కానీ మొత్తానికి గంటల్లోనే వార్త వైరల్ అయ్యింది. మాములుగా ప్రొడక్షన్ హౌసులు ఖండించే ఇలాంటి న్యూస్ ని స్వయానా హీరోయినే స్పష్టత ఇవ్వడం విశేషం. టాలీవుడ్ డెబ్యూ గురించి ఎగ్జైటింగ్ గా ఉన్నానని పవన్ పట్ల ఎంతో గౌరవముందని అయితే తేరి రీమేక్ లో మాత్రం భాగం కాలేదని సినిమా పేరు ప్రస్తావించకుండానే కుండ బద్దలు కొట్టేసింది.
This post was last modified on March 21, 2023 4:40 pm
టిల్లు సిరీస్ తర్వాత సిద్దు జొన్నలగడ్డ చేస్తున్న సినిమాగా జాక్ మీద ఈపాటికి భారీ అంచనాలు నెలకొనాలి. అయితే బయట…
ఏపీ సీఎం చంద్రబాబుపై జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మరోసారి పొగడ్తల వర్షం కురిపించారు. బాబు ఔదార్యం…
దేశంలో మహిళలు, బాలికలకు భద్రతే లేకుండా పోయింది. ఈ మాటలు కాస్తంత కఠువుగా ఉన్నా.. వరుసగా వెలుగు చూస్తున్న ఘటనలు…
కొన్ని పాత్రల విషయంలో మేకర్స్ చాలా పర్టికులర్గా ఉంటారు. ఒక పాత్రను ఫలానా వాళ్లు చేస్తేనే సినిమా చేయాలని లేదంటే లేదని…
అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత తీసుకుంటున్న పలు నిర్ణయాలు ప్రవాస భారతీయుల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తోన్న సంగతి…
జనసేన అదినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సోమవారం అల్లూరి సీతారామ రాజు జిల్లా పర్యటనకు వెళ్లారు. గిరి…