టాలీవుడ్లో ఒకప్పుడు హీరోగా, నిర్మాతగా వైభవం చూసిన వ్యక్తి మోహన్ బాబు. తెలుగు సినిమా చరిత్రలోనే గొప్ప నటుల్లో ఒకడిగా పేరు తెచ్చుకున్న ఆయన.. 90వ దశకంలో పెదరాయుడు, అసెంబ్లీ రౌడీ, అల్లుడుగారు, అల్లరి మొగుడు లాంటి సూపర్ హిట్లు కొట్టారు. కానీ ఆ తర్వాత ట్రెండును అందిపుచ్చుకోలేక వరుస పరాభవాలు ఎదుర్కొన్నారు.
మోహన్ బాబు ఘన వారసత్వాన్ని అందుకుని తెరంగేట్రం చేసిన మంచు విష్ణు, మంచు మనోజ్, మంచు లక్ష్మీ ప్రసన్న సైతం విజయవంతం కాలేకపోయారు. అందులోనూ గత కొన్నేళ్లలో మంచు ఫ్యామిలీ నటీనటుల పరిస్థితి దారుణంగా ఉంటోంది. మనోజ్, లక్ష్మీప్రసన్న సినిమాలు బాగా తగ్గించేయగా.. విష్ణు మాత్రం అప్పుడప్పడూ ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ వాటికి తిరస్కారం తప్పట్లేదు. గత ఏడాది విష్ణు నుంచి వచ్చిన ‘జిన్నా’ డిజాస్టరే అయింది. అంతకుముందు మోహన్ బాబు సినిమా ‘సన్నాఫ్ ఇండియా’ కూడా తీవ్రంగా నిరాశ పరిచింది.
ఈ ఫలితాలపై తాజాగా ఒక ఇంటర్వ్యూలో మోహన్ బాబు ఓపెన్ అయ్యారు. ‘జిన్నా’ లాంటి సినిమా ఆడకపోవడం తననెంతో బాధించినట్లు చెప్పారు. “ఒకప్పుడు లక్ష్మీప్రసన్న పిక్చర్స్ బేనర్లో నేను ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేశాను. కానీ ఇప్పుడు అదే బేనర్లో వరుసగా పరాజయాలు ఎదురవుతున్నాయి. నేను హీరోగా నటించిన ‘సన్నాఫ్ ఇండియా’ ఒక ప్రయోగాత్మక చిత్రం. ఆ సినిమాకు ప్రతికూల ఫలితం రావడం గురంచి పెద్దగా పట్టించుకోను. కానీ ‘జిన్నా’ సూపర్ హిట్ అవ్వాల్సిన సినిమా. మంచు విష్ణు కెరీర్లోనే బెస్ట్ ఫిలిం. ఆ సినిమా ఆడకపోవడం నాకెంతో బాధ కలిగించింది” అని మోహన్ బాబు అన్నారు.
మెగాస్టార్ చిరంజీవితో విభేదాల గురించి మాట్లాడుతూ.. తామిద్దరం ఎప్పుడు ఎదురు పడినా బాగానే మాట్లాడుకుంటామని, తమవి గిల్లికజ్జాల్లాంటివని.. అంతే తప్ప వ్యక్తిగతంగా ఇద్దరి మధ్య గొడవలేమీ లేవని మోహన్ బాబు స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో తమ కుటుంబం గురించి వచ్చే ట్రోల్స్ను తాను అస్సలు పట్టించుకోనని మోహన్ బాబు చెప్పారు.
This post was last modified on March 20, 2023 12:09 pm
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…
మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…
సరైన భద్రత ఏర్పాట్లు చేయకుండా సినిమా, రాజకీయ ఈవెంట్లు పెడితే ఏం జరుగుతుందో.. ఎప్పటికప్పుడు ఉదాహరణలు చూస్తూనే ఉన్నాం. అయినా…
నటుడు శ్రీకాంత్ వారసుడిగా పెళ్లి సందడితో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రోషన్ మేక తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నాడు. మధ్యలో…
స్టార్ హీరోలు ఏడాదికి ఒక్క సినిమా అయినా చేయాలని.. అప్పుడే ఇండస్ట్రీ బాగుంటుందనే అభిప్రాయం ఎప్పట్నుంచో ఉన్నదే. పెద్ద స్టార్లు మాత్రమే…