నేచురల్ స్టార్ నాని కెరీర్కు చాలా కీలకమైన సినిమా.. దసరా. ఇప్పటిదాకా కెరీర్లో ఎన్నడూ చేయనంత ఊర మాస్ పాత్రను నాని చేశాడిందులో. ఈ పాత్ర నానికి మేకోవర్ మాత్రమే కాదు.. తన కెరీర్ను ఇంకో స్థాయికి తీసుకెళ్లేది అవుతుందన్న అంచనాలు ఉన్నాయి. వేసవి కానుకగా ఈ నెల 30నే ‘దసరా’ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానున్న ఈ సినిమాను నాని చాలా అగ్రెసివ్గా ప్రమోట్ చేస్తున్నాడు. ఈ క్రమంలో మీడియాకు వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు.
ఈ సందర్భంగా ‘దసరా’ షూటింగ్ టైంలో ఎదురైన భయానక అనుభవం గురించి అతను మాట్లాడడు. ఈ సినిమా వల్ల తాను రెండు నెలలు పాటు విపరీతంగా భయపడ్డానని.. నిద్ర లేని రాత్రులు గడిపానని అతను వెల్లడించాడు.
“దసరా సినిమా సింగరేణి బొగ్గు నేపథ్యంలో నడుస్తుంది. ఇందులో డంపర్ ట్రక్ బొగ్గును తీసుకెళ్లి డంప్ చేసే సన్నివేశం చేశాం. ఈ సీన్లో డంపర్ ట్రక్లోంచి కింద పడితే ఆ బొగ్గు నాపై పడాలి. ఇందుకోసం సింథటిక్ బొగ్గును వాడాం. అది మొత్తం దుమ్ముతో కూడి ఉంటుంది. ఆ సీన్లో నేను డంపర్ నుంచి కింద పడిపోతాను. సింథటిక్ కోల్స్ కింది నుంచి నన్ను పైకి లాగడానికి కొంత సమయం పడుతుంది. ఆ గ్యాప్లో నేను గాలి పీల్చకూడదు. పీలిస్తే డస్ట్ అంతా లోపలికి వెళ్లిపోతుంది. ఈ సీన్ షూటింగ్ చాలా రోజులు చేశాం.
ఐతే ఆ తర్వాత కూడా.. నేను డంప్లోంచి బొగ్గుతో పాటు కింద పడటం.. బొగ్గు నాపై పడటం.. నన్ను పైకి లాగడం.. ఇవన్నీ గుర్తుకొచ్చేవి. అవి గుర్తుకొచ్చినపుడల్లా లోపల ఏదో ఇబ్బందిగా అనిపించేది. ఈ క్రమంలో నాకు తెలియకుండానే నేను శ్వాస ఆపడం చేసేవాడిని.. దాన్నుంచి బయటపడటానికి నాకు చాలా టైం పట్టింది. దీని వల్ల రెండు నెలల పాటు సరిగా నిద్ర కూడా పోలేదు” అని నాని తెలిపాడు. ఇక ఈ సినిమాలో సన్నివేశాల్లో సహజత్వం కోసం తాను మద్యం తాగి నటించినట్లు నాని వెల్లడించడం విశేషం.
This post was last modified on March 17, 2023 11:49 am
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…