నేచురల్ స్టార్ నాని కెరీర్కు చాలా కీలకమైన సినిమా.. దసరా. ఇప్పటిదాకా కెరీర్లో ఎన్నడూ చేయనంత ఊర మాస్ పాత్రను నాని చేశాడిందులో. ఈ పాత్ర నానికి మేకోవర్ మాత్రమే కాదు.. తన కెరీర్ను ఇంకో స్థాయికి తీసుకెళ్లేది అవుతుందన్న అంచనాలు ఉన్నాయి. వేసవి కానుకగా ఈ నెల 30నే ‘దసరా’ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానున్న ఈ సినిమాను నాని చాలా అగ్రెసివ్గా ప్రమోట్ చేస్తున్నాడు. ఈ క్రమంలో మీడియాకు వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు.
ఈ సందర్భంగా ‘దసరా’ షూటింగ్ టైంలో ఎదురైన భయానక అనుభవం గురించి అతను మాట్లాడడు. ఈ సినిమా వల్ల తాను రెండు నెలలు పాటు విపరీతంగా భయపడ్డానని.. నిద్ర లేని రాత్రులు గడిపానని అతను వెల్లడించాడు.
“దసరా సినిమా సింగరేణి బొగ్గు నేపథ్యంలో నడుస్తుంది. ఇందులో డంపర్ ట్రక్ బొగ్గును తీసుకెళ్లి డంప్ చేసే సన్నివేశం చేశాం. ఈ సీన్లో డంపర్ ట్రక్లోంచి కింద పడితే ఆ బొగ్గు నాపై పడాలి. ఇందుకోసం సింథటిక్ బొగ్గును వాడాం. అది మొత్తం దుమ్ముతో కూడి ఉంటుంది. ఆ సీన్లో నేను డంపర్ నుంచి కింద పడిపోతాను. సింథటిక్ కోల్స్ కింది నుంచి నన్ను పైకి లాగడానికి కొంత సమయం పడుతుంది. ఆ గ్యాప్లో నేను గాలి పీల్చకూడదు. పీలిస్తే డస్ట్ అంతా లోపలికి వెళ్లిపోతుంది. ఈ సీన్ షూటింగ్ చాలా రోజులు చేశాం.
ఐతే ఆ తర్వాత కూడా.. నేను డంప్లోంచి బొగ్గుతో పాటు కింద పడటం.. బొగ్గు నాపై పడటం.. నన్ను పైకి లాగడం.. ఇవన్నీ గుర్తుకొచ్చేవి. అవి గుర్తుకొచ్చినపుడల్లా లోపల ఏదో ఇబ్బందిగా అనిపించేది. ఈ క్రమంలో నాకు తెలియకుండానే నేను శ్వాస ఆపడం చేసేవాడిని.. దాన్నుంచి బయటపడటానికి నాకు చాలా టైం పట్టింది. దీని వల్ల రెండు నెలల పాటు సరిగా నిద్ర కూడా పోలేదు” అని నాని తెలిపాడు. ఇక ఈ సినిమాలో సన్నివేశాల్లో సహజత్వం కోసం తాను మద్యం తాగి నటించినట్లు నాని వెల్లడించడం విశేషం.
This post was last modified on March 17, 2023 11:49 am
బాలీవుడ్ లోనే కాదు భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదయిన సినిమాగా తెరకెక్కుతున్న రామాయణ పార్ట్ 1 టీజర్ ఇవాళ…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే లక్ష్యంతో గత నెల 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా భేటీ అయి.. దీనిపై…
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…