నేచురల్ స్టార్ నాని కెరీర్కు చాలా కీలకమైన సినిమా.. దసరా. ఇప్పటిదాకా కెరీర్లో ఎన్నడూ చేయనంత ఊర మాస్ పాత్రను నాని చేశాడిందులో. ఈ పాత్ర నానికి మేకోవర్ మాత్రమే కాదు.. తన కెరీర్ను ఇంకో స్థాయికి తీసుకెళ్లేది అవుతుందన్న అంచనాలు ఉన్నాయి. వేసవి కానుకగా ఈ నెల 30నే ‘దసరా’ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానున్న ఈ సినిమాను నాని చాలా అగ్రెసివ్గా ప్రమోట్ చేస్తున్నాడు. ఈ క్రమంలో మీడియాకు వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు.
ఈ సందర్భంగా ‘దసరా’ షూటింగ్ టైంలో ఎదురైన భయానక అనుభవం గురించి అతను మాట్లాడడు. ఈ సినిమా వల్ల తాను రెండు నెలలు పాటు విపరీతంగా భయపడ్డానని.. నిద్ర లేని రాత్రులు గడిపానని అతను వెల్లడించాడు.
“దసరా సినిమా సింగరేణి బొగ్గు నేపథ్యంలో నడుస్తుంది. ఇందులో డంపర్ ట్రక్ బొగ్గును తీసుకెళ్లి డంప్ చేసే సన్నివేశం చేశాం. ఈ సీన్లో డంపర్ ట్రక్లోంచి కింద పడితే ఆ బొగ్గు నాపై పడాలి. ఇందుకోసం సింథటిక్ బొగ్గును వాడాం. అది మొత్తం దుమ్ముతో కూడి ఉంటుంది. ఆ సీన్లో నేను డంపర్ నుంచి కింద పడిపోతాను. సింథటిక్ కోల్స్ కింది నుంచి నన్ను పైకి లాగడానికి కొంత సమయం పడుతుంది. ఆ గ్యాప్లో నేను గాలి పీల్చకూడదు. పీలిస్తే డస్ట్ అంతా లోపలికి వెళ్లిపోతుంది. ఈ సీన్ షూటింగ్ చాలా రోజులు చేశాం.
ఐతే ఆ తర్వాత కూడా.. నేను డంప్లోంచి బొగ్గుతో పాటు కింద పడటం.. బొగ్గు నాపై పడటం.. నన్ను పైకి లాగడం.. ఇవన్నీ గుర్తుకొచ్చేవి. అవి గుర్తుకొచ్చినపుడల్లా లోపల ఏదో ఇబ్బందిగా అనిపించేది. ఈ క్రమంలో నాకు తెలియకుండానే నేను శ్వాస ఆపడం చేసేవాడిని.. దాన్నుంచి బయటపడటానికి నాకు చాలా టైం పట్టింది. దీని వల్ల రెండు నెలల పాటు సరిగా నిద్ర కూడా పోలేదు” అని నాని తెలిపాడు. ఇక ఈ సినిమాలో సన్నివేశాల్లో సహజత్వం కోసం తాను మద్యం తాగి నటించినట్లు నాని వెల్లడించడం విశేషం.
పెద్ద సినిమా విడుదలవుతున్న ప్రతిసారి తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు అనేది పెద్ద సమస్యగా మారిపోయింది. ప్రతిసారి ప్రభుత్వాన్ని అడగలేక,…
మాములుగా దర్శక నిర్మాతలు తమ సినిమాకు ఎంత ఖర్చు పెట్టినా బడ్జెట్ ని బాహాటంగా బయటికి చెప్పుకోరు. దానికి కారణాలు…
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాటల్లో రాజీపడరు.. చేతల్లో ఆలస్యం చేయరు. ఇదేదో మనం చెప్పే మాట కాదు..…
తన కొత్త సినిమా పెద్ది ప్రమోషన్లలో భాగంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎక్కడికి వెళ్లినా… ఆయన వెంట…
ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ కు ఒక ఎక్స్ పైరీ డేట్ ఉంటుందనేది ఎప్పటినుంచో వినిపించే మాటే. పాతికేళ్ల నుంచి ముప్పై…
మహారాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు దేవేంద్ర ఫడణవీస్తో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్…