దగ్గుబాటి వెంకటేష్ రానా మొదటిసారి ఆన్ స్క్రీన్ కాంబినేషన్ రానా నాయుడు వెబ్ సిరీస్ సోషల్ మీడియా వేదికగా ఎంత రచ్చ చేసిందో చూశాం. ముఖ్యంగా అందులో అడల్ట్ కంటెంట్, బూతు డైలాగుల మీద ఓ రేంజ్ లో విమర్శలు వచ్చి పడ్డాయి. అయినా ఆడియన్స్ లెక్క చేయడం లేదు. దెబ్బకు వారం తిరక్కుండానే పది లక్షల వ్యూస్ అవర్స్ కు దగ్గరగా వెళ్లడం నెట్ ఫ్లిక్స్ ని సైతం ఆశ్చర్యంలో పడేసింది. రెస్పాన్స్ ఊహించిందే అయినా మరీ ఈ స్థాయిలో కాదని డిజిటల్ వర్గాల కథనం. ప్రస్తుతానికి ఇండియాతో పాటు కొన్ని ప్రధాన దేశాల్లోనూ రానా నాయుడే టాప్ 1లో ఉన్నాడు.
ఇక్కడ నెగటివ్ పబ్లిసిటీనే ఎక్కువగా పని చేసినట్టు కనిపిస్తోంది. ఫేస్ బుక్ పోస్టులు, ట్వీట్లు చూసిన సగటు జనాలు అవునా ఇందులో వెంకటేష్ మరీ అంత పచ్చి కంటెంట్ లో నటించాడా అని అదే పనిగా చూడటం మొదలుపెడుతున్నారు. రెగ్యులర్ గా ఫారిన్ సిరీస్ చూసే అలవాటున్న వాళ్లకు అదేమీ జుగుప్సగా అనిపించలేదు కానీ ఈ వ్యవహారాలకు దూరంగా ఉండే మాములు జనాలు మాత్రం ఇలాంటివి చేయకపోతేనే మంచిదనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఎలా ఉన్నా రానా నాయుడుకి ఫ్యాన్స్ తో పాటు యూత్ మద్దతు బాగా దొరికిందని ట్రెండ్ రుజువు చేసింది.
దీని ప్రమోషన్ మీద రానా ఎంత శ్రద్ధ వహించాడంటే తాత్కాలికంగా రామానాయుడు స్టూడియోస్ బోర్డుని రానా నాయుడుగా మార్పించి దాన్ని గ్లో సైన్ బోర్డు రూపంలో ఫిలిం నగర్ రోడ్డు మీద వెళ్ళేవాళ్ళకు హైలైట్ అయ్యేలా చేయించాడు. అంతేకాదు టైం దొరికినప్పుడు రానా నాయుడు గురించి ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేసిన వాళ్లకు సమాధానం చెబుతూ తన వంతుగా పబ్లిసిటీలో భాగమవుతున్నాడు. దీని సక్సెస్ ని ఒక ఈవెంట్ రూపంలో ప్లాన్ చేయాలని నెట్ ఫ్లిక్స్ ప్లాన్ చేస్తోంది. దానికి వెంకటేష్ అంగీకారం రావాల్సి ఉందని టాక్. తన మీద కామెంట్స్ కి కౌంటర్ ఇవ్వడానికైనా వెంకీ ఎస్ అంటారేమో.
This post was last modified on March 16, 2023 2:08 pm
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…