దగ్గుబాటి వెంకటేష్ రానా మొదటిసారి ఆన్ స్క్రీన్ కాంబినేషన్ రానా నాయుడు వెబ్ సిరీస్ సోషల్ మీడియా వేదికగా ఎంత రచ్చ చేసిందో చూశాం. ముఖ్యంగా అందులో అడల్ట్ కంటెంట్, బూతు డైలాగుల మీద ఓ రేంజ్ లో విమర్శలు వచ్చి పడ్డాయి. అయినా ఆడియన్స్ లెక్క చేయడం లేదు. దెబ్బకు వారం తిరక్కుండానే పది లక్షల వ్యూస్ అవర్స్ కు దగ్గరగా వెళ్లడం నెట్ ఫ్లిక్స్ ని సైతం ఆశ్చర్యంలో పడేసింది. రెస్పాన్స్ ఊహించిందే అయినా మరీ ఈ స్థాయిలో కాదని డిజిటల్ వర్గాల కథనం. ప్రస్తుతానికి ఇండియాతో పాటు కొన్ని ప్రధాన దేశాల్లోనూ రానా నాయుడే టాప్ 1లో ఉన్నాడు.
ఇక్కడ నెగటివ్ పబ్లిసిటీనే ఎక్కువగా పని చేసినట్టు కనిపిస్తోంది. ఫేస్ బుక్ పోస్టులు, ట్వీట్లు చూసిన సగటు జనాలు అవునా ఇందులో వెంకటేష్ మరీ అంత పచ్చి కంటెంట్ లో నటించాడా అని అదే పనిగా చూడటం మొదలుపెడుతున్నారు. రెగ్యులర్ గా ఫారిన్ సిరీస్ చూసే అలవాటున్న వాళ్లకు అదేమీ జుగుప్సగా అనిపించలేదు కానీ ఈ వ్యవహారాలకు దూరంగా ఉండే మాములు జనాలు మాత్రం ఇలాంటివి చేయకపోతేనే మంచిదనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఎలా ఉన్నా రానా నాయుడుకి ఫ్యాన్స్ తో పాటు యూత్ మద్దతు బాగా దొరికిందని ట్రెండ్ రుజువు చేసింది.
దీని ప్రమోషన్ మీద రానా ఎంత శ్రద్ధ వహించాడంటే తాత్కాలికంగా రామానాయుడు స్టూడియోస్ బోర్డుని రానా నాయుడుగా మార్పించి దాన్ని గ్లో సైన్ బోర్డు రూపంలో ఫిలిం నగర్ రోడ్డు మీద వెళ్ళేవాళ్ళకు హైలైట్ అయ్యేలా చేయించాడు. అంతేకాదు టైం దొరికినప్పుడు రానా నాయుడు గురించి ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేసిన వాళ్లకు సమాధానం చెబుతూ తన వంతుగా పబ్లిసిటీలో భాగమవుతున్నాడు. దీని సక్సెస్ ని ఒక ఈవెంట్ రూపంలో ప్లాన్ చేయాలని నెట్ ఫ్లిక్స్ ప్లాన్ చేస్తోంది. దానికి వెంకటేష్ అంగీకారం రావాల్సి ఉందని టాక్. తన మీద కామెంట్స్ కి కౌంటర్ ఇవ్వడానికైనా వెంకీ ఎస్ అంటారేమో.
This post was last modified on March 16, 2023 2:08 pm
ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకో వారమే సమయం ఉంది. ఈ ఎన్నికలు ఇటు అధికార వైఎస్సార్ కాంగ్రెస్కు, అటు ప్రతిపక్ష…
‘ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ ఎంత పెద్ద హిట్టో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇండియాలో అత్యంత ఆదరణ పొందిన…
ఏపీ ప్రభుత్వానికి కేంద్ర ఎన్నికల సంఘం భారీ షాక్ ఇచ్చింది. ముఖ్యంగా జగన్ ప్రబుత్వం అమలు చేస్తున్న పథకాలను ఎన్నికల…
రాజమండ్రిలో నిర్వహించిన కూటమి పార్టీల(జనసేన-బీజేపీ-టీడీపీ) ఎన్నికల ప్రచార సభ 'ప్రజాగళం'లో చంద్రబాబు పాల్గొన లేక పోయారు. ఆయన వేరే సభలో…
మాములుగా కమెడియన్లు హీరోలు కావడం గతంలో ఎన్నో చూశాం. చూస్తున్నాం. కానీ మధ్యవయసు దాటిన క్యారెక్టర్ ఆర్టిస్టులు కథానాయకులుగా మారడం…
ఏపీలో డబుల్ ఇంజన్ సర్కారు రానుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమే కేంద్రంలోనూ…