సాహో, రాధే శ్యామ్ వరసగా నిరాశపరిచాక అభిమానులకు నాన్ స్టాప్ ఎంటర్ టైన్మెంట్ ఇవ్వాలని నిర్ణయించుకున్న ప్రభాస్ శరవేగంగా సినిమాలు చేస్తూ షూటింగులే ప్రపంచంగా తిరుగుతున్నాడు. నిర్మాతలు ప్రకటించిన ప్రకారమే రిలీజ్ డేట్లు కనక మారకపోతే కేవలం ఎనిమిది నెలల్లో మూడు ప్యాన్ ఇండియా మూవీస్ చూసుకోవచ్చు. ఆది పురుష్ జూన్ నుంచి వెనుకడుగు వేసేది ఉండదని దర్శకుడు ఓం రౌత్ నొక్కి వక్కాణిస్తున్నాడు. నిర్మాణ సంస్థ టి సిరీస్ ఆల్రెడీ హండ్రెడ్ డేస్ కౌంట్ డౌన్ అంటూ ప్రమోషన్లు మొదలుపెట్టింది. ఇంకొద్ది రోజుల్లో పీక్స్ కు తీసుకెళ్లనున్నారు.
ఇక సలార్ విషయానికి వస్తే దాదాపు డెబ్భై శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ యాక్షన్ డ్రామాకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఫ్యాన్స్ కి కిక్ ఇస్తున్నాయి. అందులో మొదటిది సలార్ రెండు భాగాలుగా రావడం దాదాపు లాంఛనమే. అఫీషియల్ గా చెప్పలేదు కానీ టీజర్ లేదా ట్రైలర్ లాంచ్ రోజు ఇది అనౌన్స్ చేయొచ్చు. కానీ సీక్వెల్ షూటింగ్ సమాంతరంగా జరుగుతోందా లేక గ్యాప్ ఇచ్చి కెజిఎఫ్ 2 లాగా సెపరేట్ గా తీస్తారా అనేది ఇంకా తెలియలేదు. ఇంకో కీలకమైన లీక్ ఏంటంటే డార్లింగ్ డ్యూయల్ రోల్ చేయడం.
ప్రధాన పాత్ర పేరు సలార్ అయితే కొడుకు క్యారెక్టర్ కి దేవా అని ఫిక్స్ చేశారట. ఒకరికి జగపతిబాబు విలన్ అయితే ఇంకొకరితో పృథ్విరాజ్ సుకుమారన్ తలపడతాడు. అయితే బాహుబలి లాగా ఇద్దరు ప్రభాస్ లు ఒకే ఫ్రేమ్ లో కలుసుకునే అవకాశం ఉండదా లేక రివెంజ్ డ్రామా టైప్ ట్విస్టు పెట్టి జాయింట్ గా చూపించే ప్లాన్ ఏమైనా దర్శకుడు ప్రశాంత్ నీల్ చేశాడేమో ప్రస్తుతానికి సస్పెన్స్ గా ఉంచుతున్నారు. ఆది పురుష్ ఎలాగూ మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో రూపొందుతున్న మూవీ కాబట్టి జనాల ఆసక్తి అంచనాలు సలార్ మీదే ఎక్కువగా ఉన్న మాట వాస్తవం
This post was last modified on March 16, 2023 1:51 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…