సాహో, రాధే శ్యామ్ వరసగా నిరాశపరిచాక అభిమానులకు నాన్ స్టాప్ ఎంటర్ టైన్మెంట్ ఇవ్వాలని నిర్ణయించుకున్న ప్రభాస్ శరవేగంగా సినిమాలు చేస్తూ షూటింగులే ప్రపంచంగా తిరుగుతున్నాడు. నిర్మాతలు ప్రకటించిన ప్రకారమే రిలీజ్ డేట్లు కనక మారకపోతే కేవలం ఎనిమిది నెలల్లో మూడు ప్యాన్ ఇండియా మూవీస్ చూసుకోవచ్చు. ఆది పురుష్ జూన్ నుంచి వెనుకడుగు వేసేది ఉండదని దర్శకుడు ఓం రౌత్ నొక్కి వక్కాణిస్తున్నాడు. నిర్మాణ సంస్థ టి సిరీస్ ఆల్రెడీ హండ్రెడ్ డేస్ కౌంట్ డౌన్ అంటూ ప్రమోషన్లు మొదలుపెట్టింది. ఇంకొద్ది రోజుల్లో పీక్స్ కు తీసుకెళ్లనున్నారు.
ఇక సలార్ విషయానికి వస్తే దాదాపు డెబ్భై శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ యాక్షన్ డ్రామాకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఫ్యాన్స్ కి కిక్ ఇస్తున్నాయి. అందులో మొదటిది సలార్ రెండు భాగాలుగా రావడం దాదాపు లాంఛనమే. అఫీషియల్ గా చెప్పలేదు కానీ టీజర్ లేదా ట్రైలర్ లాంచ్ రోజు ఇది అనౌన్స్ చేయొచ్చు. కానీ సీక్వెల్ షూటింగ్ సమాంతరంగా జరుగుతోందా లేక గ్యాప్ ఇచ్చి కెజిఎఫ్ 2 లాగా సెపరేట్ గా తీస్తారా అనేది ఇంకా తెలియలేదు. ఇంకో కీలకమైన లీక్ ఏంటంటే డార్లింగ్ డ్యూయల్ రోల్ చేయడం.
ప్రధాన పాత్ర పేరు సలార్ అయితే కొడుకు క్యారెక్టర్ కి దేవా అని ఫిక్స్ చేశారట. ఒకరికి జగపతిబాబు విలన్ అయితే ఇంకొకరితో పృథ్విరాజ్ సుకుమారన్ తలపడతాడు. అయితే బాహుబలి లాగా ఇద్దరు ప్రభాస్ లు ఒకే ఫ్రేమ్ లో కలుసుకునే అవకాశం ఉండదా లేక రివెంజ్ డ్రామా టైప్ ట్విస్టు పెట్టి జాయింట్ గా చూపించే ప్లాన్ ఏమైనా దర్శకుడు ప్రశాంత్ నీల్ చేశాడేమో ప్రస్తుతానికి సస్పెన్స్ గా ఉంచుతున్నారు. ఆది పురుష్ ఎలాగూ మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో రూపొందుతున్న మూవీ కాబట్టి జనాల ఆసక్తి అంచనాలు సలార్ మీదే ఎక్కువగా ఉన్న మాట వాస్తవం
This post was last modified on March 16, 2023 1:51 pm
సినీ రంగంలో ఎప్పుడు ఎవరి రాత మారుతుందో తెలియదు. నటులుగా చిన్న చిన్న పాత్రలు చేసిన వాళ్లు.. రైటర్లుగా, అసిస్టెంట్…
పదేళ్ల ముందు ‘దంగల్’ మూవీతో ఇండస్ట్రీ హిట్ ఇచ్చాడు బాలీవుడ్ సూపర్ స్టార్. ఇప్పటికీ ఇండియాస్ హైయెస్ట్ గ్రాసింగ్ మూవీ…
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా పెద్ద సినిమాకు ముందస్తు బిజినెస్ జరగడం చాలా కష్టమైపోయింది. ముఖ్యంగా ఒక్క టీజర్ తోనే మొత్తం…
టాలీవుడ్ టాప్ హీరోల్లో అత్యధిక డిమాండ్ ఉన్నది ఎవరికయ్యా అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు ప్రభాస్. తెలుగులోనే కాదు హిందీలోనూ…
ఇరాన్ యుద్ధ పరిణామాలు టీవీలో, సోషల్ మీడియాలో చూస్తూ తెలుసుకుంటున్న మన దేశ జనాలకు మెల్లగా దాని ప్రభావం నేరుగా…
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారం కేసును రెండేళ్ల నుంచి కార్తీక దీపం సీరియల్ మాదిరి లాగుతున్నారని బీఆర్ఎస్ నేతలు…