సాహో, రాధే శ్యామ్ వరసగా నిరాశపరిచాక అభిమానులకు నాన్ స్టాప్ ఎంటర్ టైన్మెంట్ ఇవ్వాలని నిర్ణయించుకున్న ప్రభాస్ శరవేగంగా సినిమాలు చేస్తూ షూటింగులే ప్రపంచంగా తిరుగుతున్నాడు. నిర్మాతలు ప్రకటించిన ప్రకారమే రిలీజ్ డేట్లు కనక మారకపోతే కేవలం ఎనిమిది నెలల్లో మూడు ప్యాన్ ఇండియా మూవీస్ చూసుకోవచ్చు. ఆది పురుష్ జూన్ నుంచి వెనుకడుగు వేసేది ఉండదని దర్శకుడు ఓం రౌత్ నొక్కి వక్కాణిస్తున్నాడు. నిర్మాణ సంస్థ టి సిరీస్ ఆల్రెడీ హండ్రెడ్ డేస్ కౌంట్ డౌన్ అంటూ ప్రమోషన్లు మొదలుపెట్టింది. ఇంకొద్ది రోజుల్లో పీక్స్ కు తీసుకెళ్లనున్నారు.
ఇక సలార్ విషయానికి వస్తే దాదాపు డెబ్భై శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ యాక్షన్ డ్రామాకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఫ్యాన్స్ కి కిక్ ఇస్తున్నాయి. అందులో మొదటిది సలార్ రెండు భాగాలుగా రావడం దాదాపు లాంఛనమే. అఫీషియల్ గా చెప్పలేదు కానీ టీజర్ లేదా ట్రైలర్ లాంచ్ రోజు ఇది అనౌన్స్ చేయొచ్చు. కానీ సీక్వెల్ షూటింగ్ సమాంతరంగా జరుగుతోందా లేక గ్యాప్ ఇచ్చి కెజిఎఫ్ 2 లాగా సెపరేట్ గా తీస్తారా అనేది ఇంకా తెలియలేదు. ఇంకో కీలకమైన లీక్ ఏంటంటే డార్లింగ్ డ్యూయల్ రోల్ చేయడం.
ప్రధాన పాత్ర పేరు సలార్ అయితే కొడుకు క్యారెక్టర్ కి దేవా అని ఫిక్స్ చేశారట. ఒకరికి జగపతిబాబు విలన్ అయితే ఇంకొకరితో పృథ్విరాజ్ సుకుమారన్ తలపడతాడు. అయితే బాహుబలి లాగా ఇద్దరు ప్రభాస్ లు ఒకే ఫ్రేమ్ లో కలుసుకునే అవకాశం ఉండదా లేక రివెంజ్ డ్రామా టైప్ ట్విస్టు పెట్టి జాయింట్ గా చూపించే ప్లాన్ ఏమైనా దర్శకుడు ప్రశాంత్ నీల్ చేశాడేమో ప్రస్తుతానికి సస్పెన్స్ గా ఉంచుతున్నారు. ఆది పురుష్ ఎలాగూ మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో రూపొందుతున్న మూవీ కాబట్టి జనాల ఆసక్తి అంచనాలు సలార్ మీదే ఎక్కువగా ఉన్న మాట వాస్తవం
This post was last modified on March 16, 2023 1:51 pm
‘‘ఏమ్మా నాన్నగారు ఉన్నారా? నాన్న గారు….ఇంట్లో లేరని చెప్పమన్నారండీ….నాన్న గారు లేరని చెప్పమన్నారేంట్రా…చెయ్యి పట్టుకొని ఇక్కడికే తీసుకురాలేకపోయావా…కన్ఫ్యూజన్ లేకుండా……’’అల వైకుంఠపురములో…
ఇటీవలే విడుదలైన విశ్వనాథ్ అండ్ సన్స్ లో మమిత బైజు పోషించిన పాత్ర ఆ సినిమా విజయంలో ఎంత కీలక…
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకృతి చికిత్స కోసం శుక్రవారం కేరళం బయలుదేరి వెళ్లనున్నారు. 20 రోజుల పాటు కేరళంలోనే…
ఇవాళ విడుదలైన ఇరుముడికి సర్వత్రా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. అన్ని సెంటర్ల…
దక్షిణాది లెజండరీ నటీనటులు ఇటీవలి కాలంలో కన్ను మూయడం సినీ ప్రియులను బాధిస్తోంది. భాగ్యరాజ్ గారి హఠాన్మరణం ఇంకా మర్చిపోక…
ప్రచార హోరులో తానే సింగిల్ సింహం అని, కృష్ణుడిని, అర్జునుడిని అంటూ గొప్పలు చెప్పుకోవడం రాజకీయాల్లో సాధారణమే. కానీ, ప్రజాసమస్యలపై…