ఆర్ఆర్ఆర్ సినిమా విడుదలై ఏడాది కావస్తున్నా.. ఇప్పటికీ ఆ చిత్రం ఇండియాలోనే కాక ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతూ వస్తుండటం విశేషమే. అందులోనూ ఇటీవలే ఈ సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు రావడంతో ఎక్కడా చూసినా ఈ చిత్రం గురించే చర్చ జరుగుతోంది. మన సినిమా గురించి ప్రపంచమంతా ఇలా మాట్లాడుకుంటుండటం విశేషమే. ఈ సందర్భంలోనే ఆర్ఆర్ఆర్ కథా రచయిత విజయేంద్ర ప్రసాద్ ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు.
గత ఏడాది ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశమైన సందర్భంగా ఆయన ఏం చెప్పారో.. సరిగ్గా అదే విషయాన్ని తన కొడుకు, ఆర్ఆర్ఆర్ దర్శకుడు రాజమౌళి దగ్గర హాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ స్టీఫెన్ స్పీల్బర్గ్ కూడా చెప్పినట్లు విజయేంద్ర ప్రసాద్ వెల్లడించడం విశేషం.
నేను కొంత కాలం కిందట ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారిని కలిశాను. నాతో ఆయన నాలుగు నిమిషాలు మాట్లాడతారేమో అనుకున్నా. కానీ మా సమావేశం 40 నిమిషాలు సాగింది. ఆ నలభై నిమిషాలు.. ప్రపంచం మొత్తం మన దేశం వైపు ఎలా చూడాలి అనే దాని గురించే చర్చించుకున్నాం. మోడీ గారి విజన్కు నేను ఆశ్చర్యపోయా. మన దేశ సంస్కృతి చాలా గొప్పదని.. దాన్ని ప్రపంచానికి చాటేలా కృషి చేయాలని ఆయన అన్నారు.
ఇక రాజమౌళి.. ఆర్ఆర్ఆర్ స్క్రీనింగ్ కోసం ఆమెరికాకు వెళ్లినపుడు స్పీల్బర్గ్ను కలవగా.. సరిగ్గా ఆయన కూడా ఇదే విషయం చెప్పినట్లు నాతో అన్నాడు. భారత దేశ సంస్కృతి ఉట్టిపడేలా.. ప్రపంచానికి ఇక్కడి సంస్కృతి గురించి తెలిసేలా సినిమాలు తీయాలని రాజమౌళికి స్పీల్బర్గ్ సూచించినట్లు తెలిసింది. మోడీ నాకు చెప్పిన విషయమే.. స్పీల్బర్గ్ రాజమౌళికి చెప్పడం ఆశ్చర్యం కలిగించింది అని విజయేంద్ర ప్రసాద్ అన్నారు. ఆర్ఆర్ఆర్ విజయం వెనుక తమ కుటుంబానికి చెందిన మూడు తరాల వారి కృషి ఉండటం తనకెంతో ఆనందాన్ని కలిగించే విషయమని విజయేంద్ర ఈ సందర్భంగా చెప్పారు.
This post was last modified on March 16, 2023 10:08 am
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…
గత కొన్నేళ్లుగా ప్రయోగాలు, రొటీన్ మాస్ మసాలాలతో అభిమానులే నీరసపడేలా చేసిన రవితేజ ఫైనల్ గా గేరు మార్చేశాడు. సంక్రాంతికి…