ఆర్ఆర్ఆర్ సినిమా విడుదలై ఏడాది కావస్తున్నా.. ఇప్పటికీ ఆ చిత్రం ఇండియాలోనే కాక ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతూ వస్తుండటం విశేషమే. అందులోనూ ఇటీవలే ఈ సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు రావడంతో ఎక్కడా చూసినా ఈ చిత్రం గురించే చర్చ జరుగుతోంది. మన సినిమా గురించి ప్రపంచమంతా ఇలా మాట్లాడుకుంటుండటం విశేషమే. ఈ సందర్భంలోనే ఆర్ఆర్ఆర్ కథా రచయిత విజయేంద్ర ప్రసాద్ ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు.
గత ఏడాది ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశమైన సందర్భంగా ఆయన ఏం చెప్పారో.. సరిగ్గా అదే విషయాన్ని తన కొడుకు, ఆర్ఆర్ఆర్ దర్శకుడు రాజమౌళి దగ్గర హాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ స్టీఫెన్ స్పీల్బర్గ్ కూడా చెప్పినట్లు విజయేంద్ర ప్రసాద్ వెల్లడించడం విశేషం.
నేను కొంత కాలం కిందట ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారిని కలిశాను. నాతో ఆయన నాలుగు నిమిషాలు మాట్లాడతారేమో అనుకున్నా. కానీ మా సమావేశం 40 నిమిషాలు సాగింది. ఆ నలభై నిమిషాలు.. ప్రపంచం మొత్తం మన దేశం వైపు ఎలా చూడాలి అనే దాని గురించే చర్చించుకున్నాం. మోడీ గారి విజన్కు నేను ఆశ్చర్యపోయా. మన దేశ సంస్కృతి చాలా గొప్పదని.. దాన్ని ప్రపంచానికి చాటేలా కృషి చేయాలని ఆయన అన్నారు.
ఇక రాజమౌళి.. ఆర్ఆర్ఆర్ స్క్రీనింగ్ కోసం ఆమెరికాకు వెళ్లినపుడు స్పీల్బర్గ్ను కలవగా.. సరిగ్గా ఆయన కూడా ఇదే విషయం చెప్పినట్లు నాతో అన్నాడు. భారత దేశ సంస్కృతి ఉట్టిపడేలా.. ప్రపంచానికి ఇక్కడి సంస్కృతి గురించి తెలిసేలా సినిమాలు తీయాలని రాజమౌళికి స్పీల్బర్గ్ సూచించినట్లు తెలిసింది. మోడీ నాకు చెప్పిన విషయమే.. స్పీల్బర్గ్ రాజమౌళికి చెప్పడం ఆశ్చర్యం కలిగించింది అని విజయేంద్ర ప్రసాద్ అన్నారు. ఆర్ఆర్ఆర్ విజయం వెనుక తమ కుటుంబానికి చెందిన మూడు తరాల వారి కృషి ఉండటం తనకెంతో ఆనందాన్ని కలిగించే విషయమని విజయేంద్ర ఈ సందర్భంగా చెప్పారు.
This post was last modified on March 16, 2023 10:08 am
టాక్సిక్ టాక్స్, రివ్యూస్ పక్కనపెడితే ఇవాళ ఈ సినిమాకు వచ్చిన ఓపెనింగ్స్, అడ్వాన్స్ బుకింగ్స్ ఒక విషయాన్ని స్పష్టం చేశాయి.…
మెగాస్టార్ చిరంజీవి ఒకప్పుడు లెక్కలేసుకుని సినిమాలు చేసేవారు. కానీ ఈ మధ్య ఆయన తీరు మారిపోయింది. ఇమేజ్ ఛట్రం నుంచి…
సందీప్ రెడ్డి వంగా.. ఏదైనా మాట్లాడితే ఆ మాటను చుట్టూ తిప్పే రకం కాదు. రోమాంచకం ట్రైలర్ ఈవెంట్లో స్పిరిట్,…
అమెరికా వెళ్లాలనుకునే వారికి షాకింగ్ న్యూస్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా ఎంబసీలు, కాన్సులేట్లలో వీసా అపాయింట్మెంట్లను తాత్కాలికంగా నిలిపివేసినట్లు తాజా…
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కోదాడ మండలం ద్వారకుంట వద్ద ఆగి ఉన్న లారీని ప్రైవేట్ ట్రావెల్స్…
మొత్తం మీద కాంగ్రెస్ అధిష్టానం స్పందించింది. కొండా సురేఖ కూతురు సుస్మిత మొదలుపెట్టిన వివాదానికి ఫుల్ స్థాప్ పెట్టడానికి రంగం…