మొన్న జరిగిన ఆస్కార్ వేడుకలో స్టేజి మీద ఫారిన్ డాన్సర్లు నాటు నాటుకి లైవ్ లో డాన్స్ చేయడం గొప్ప అనుభూతినిచ్చింది కానీ దానికి బదులు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లు చేసుంటే అదో చిరస్మరణీయ ఘట్టంగా మిగిలిపోయేదని ఇద్దరి అభిమానులు బాగా ఫీలయ్యారు. అందులో నిజం లేకపోలేదు. ఎందుకంటే అలాంటి అంతర్జాతీయ వేదిక మీద నృత్యం చేయడమంటే అదో అరుదైన దృశ్యంగా చిరకాలం నిలిచిపోయేది. ప్రాక్టీస్ లేకపోవడం ఒక కారణమని తారక్ చెప్పాడు కానీ తెరవెనుక ఏం జరిగిందననేది అకాడెమి అఫీషియల్ వెబ్ సైట్ లో వివరణ ఇచ్చింది.
నిజానికి ఆస్కార్ కమిటీ తారక్, చరణ్ ల లైవ్ నే అడిగింది. కానీ ఫిబ్రవరి మధ్యలో తమకున్న వృత్తిపరమైన కమిట్ మెంట్ల వల్ల అలా చేయలేమని, పైగా రిహార్సల్ చేయడానికి తగినంత సమయం లేదని ఇద్దరి నుంచి బదులు వచ్చింది. పైగా ఆ పాట తాలూకు వర్క్ షాప్ ని రెండు నెలలు నిర్వహించి మరో పదిహేను రోజులు చిత్రీకరించడానికి తీసుకున్నారు. అలాంటిది కొన్ని కోట్ల మంది చూస్తున్న కెమెరాల ముందు పర్ఫెక్ట్ గా రావాలంటే సాధన సరిపోదని వాళ్ళ ఉద్దేశం. ఈ కారణంగానే నాటు నాటుని మరోసారి ప్రత్యక్షంగా చూసే అవకాశం ఫ్యాన్స్ కోల్పోయినట్టయ్యింది.
మనం చూసిన విదేశీ డాన్సర్ల పెర్ఫార్మన్స్ కి ముందు లాస్ యాంజిల్స్ లో 18 గంటల పాటు నిపుణున ఆధ్వర్యంలో శిక్షణ ఇప్పించారు. 90 నిమిషాల కెమెరా బ్లాకింగ్ ని వాడి ఎలాంటి లోటుపాట్లు రాకుండా చూసుకున్నారు. ఇంత జాగ్రత్త తీసుకోవడం వల్లే ఎలాంటి పొరపాట్లకు అవకాశం దక్కలేదు. ఒకవేళ నాటు నాటుకి అవార్డు ఖాయమని ఏ నవంబర్ లోనో తెలిసి ఉంటే ముందస్తుగా సన్నద్ధమవ్వడానికి ఛాన్స్ ఉండేది. కానీ నామినేషన్ల స్టేజిలోనే విజేత ఎవరని తెలిసే ఆస్కారం లేకపోవడంతో ఇలా సర్దుకోక తప్పలేదు. టైం ఉండింటే మాత్రం అద్భుతమే జరిగేది.
This post was last modified on March 15, 2023 12:00 pm
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…
మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…