మొన్న జరిగిన ఆస్కార్ వేడుకలో స్టేజి మీద ఫారిన్ డాన్సర్లు నాటు నాటుకి లైవ్ లో డాన్స్ చేయడం గొప్ప అనుభూతినిచ్చింది కానీ దానికి బదులు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లు చేసుంటే అదో చిరస్మరణీయ ఘట్టంగా మిగిలిపోయేదని ఇద్దరి అభిమానులు బాగా ఫీలయ్యారు. అందులో నిజం లేకపోలేదు. ఎందుకంటే అలాంటి అంతర్జాతీయ వేదిక మీద నృత్యం చేయడమంటే అదో అరుదైన దృశ్యంగా చిరకాలం నిలిచిపోయేది. ప్రాక్టీస్ లేకపోవడం ఒక కారణమని తారక్ చెప్పాడు కానీ తెరవెనుక ఏం జరిగిందననేది అకాడెమి అఫీషియల్ వెబ్ సైట్ లో వివరణ ఇచ్చింది.
నిజానికి ఆస్కార్ కమిటీ తారక్, చరణ్ ల లైవ్ నే అడిగింది. కానీ ఫిబ్రవరి మధ్యలో తమకున్న వృత్తిపరమైన కమిట్ మెంట్ల వల్ల అలా చేయలేమని, పైగా రిహార్సల్ చేయడానికి తగినంత సమయం లేదని ఇద్దరి నుంచి బదులు వచ్చింది. పైగా ఆ పాట తాలూకు వర్క్ షాప్ ని రెండు నెలలు నిర్వహించి మరో పదిహేను రోజులు చిత్రీకరించడానికి తీసుకున్నారు. అలాంటిది కొన్ని కోట్ల మంది చూస్తున్న కెమెరాల ముందు పర్ఫెక్ట్ గా రావాలంటే సాధన సరిపోదని వాళ్ళ ఉద్దేశం. ఈ కారణంగానే నాటు నాటుని మరోసారి ప్రత్యక్షంగా చూసే అవకాశం ఫ్యాన్స్ కోల్పోయినట్టయ్యింది.
మనం చూసిన విదేశీ డాన్సర్ల పెర్ఫార్మన్స్ కి ముందు లాస్ యాంజిల్స్ లో 18 గంటల పాటు నిపుణున ఆధ్వర్యంలో శిక్షణ ఇప్పించారు. 90 నిమిషాల కెమెరా బ్లాకింగ్ ని వాడి ఎలాంటి లోటుపాట్లు రాకుండా చూసుకున్నారు. ఇంత జాగ్రత్త తీసుకోవడం వల్లే ఎలాంటి పొరపాట్లకు అవకాశం దక్కలేదు. ఒకవేళ నాటు నాటుకి అవార్డు ఖాయమని ఏ నవంబర్ లోనో తెలిసి ఉంటే ముందస్తుగా సన్నద్ధమవ్వడానికి ఛాన్స్ ఉండేది. కానీ నామినేషన్ల స్టేజిలోనే విజేత ఎవరని తెలిసే ఆస్కారం లేకపోవడంతో ఇలా సర్దుకోక తప్పలేదు. టైం ఉండింటే మాత్రం అద్భుతమే జరిగేది.
This post was last modified on March 15, 2023 12:00 pm
తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల కేసు వ్యవహారం ఆసక్తి రేపిన సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ కు 10…
సోషల్ మీడియాలో చాలా అలెర్ట్ గా ఉండాలి. ముఖ్యంగా సెలబ్రిటీలు బిజీగా షెడ్యూల్స్ లో ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా…
థియేటర్లకు సరైన సినిమాలు వస్తే రావడానికి ప్రేక్షకులు సిద్ధంగా ఉన్నారు. ఎటొచ్చి వాళ్ళను కనీస స్థాయిలో మెప్పించే కంటెంట్ ఉన్నవి…
తెలంగాణలో రెండు రాజ్యసభ స్థానాలకు పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అభిషేక్ మను సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డిలు..…
వంటగ్యాస్ కొరత కారణంగా దేశవ్యాప్తంగా చిన్న హోటళ్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. హోటళ్లకు సరఫరా అయ్యే కమర్షియల్ సిలిండర్ల పంపిణీని…
రాష్ట్రంలోని పలు మున్సిపల్ సంస్థల్లో పాలకవర్గాల గడువు ముగియడంతో అక్కడ స్పెషల్ ఆఫీసర్ల పాలన అమల్లోకి రానుంది. మున్సిపల్ కార్పొరేషన్లు,…