మొన్న జరిగిన ఆస్కార్ వేడుకలో స్టేజి మీద ఫారిన్ డాన్సర్లు నాటు నాటుకి లైవ్ లో డాన్స్ చేయడం గొప్ప అనుభూతినిచ్చింది కానీ దానికి బదులు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లు చేసుంటే అదో చిరస్మరణీయ ఘట్టంగా మిగిలిపోయేదని ఇద్దరి అభిమానులు బాగా ఫీలయ్యారు. అందులో నిజం లేకపోలేదు. ఎందుకంటే అలాంటి అంతర్జాతీయ వేదిక మీద నృత్యం చేయడమంటే అదో అరుదైన దృశ్యంగా చిరకాలం నిలిచిపోయేది. ప్రాక్టీస్ లేకపోవడం ఒక కారణమని తారక్ చెప్పాడు కానీ తెరవెనుక ఏం జరిగిందననేది అకాడెమి అఫీషియల్ వెబ్ సైట్ లో వివరణ ఇచ్చింది.
నిజానికి ఆస్కార్ కమిటీ తారక్, చరణ్ ల లైవ్ నే అడిగింది. కానీ ఫిబ్రవరి మధ్యలో తమకున్న వృత్తిపరమైన కమిట్ మెంట్ల వల్ల అలా చేయలేమని, పైగా రిహార్సల్ చేయడానికి తగినంత సమయం లేదని ఇద్దరి నుంచి బదులు వచ్చింది. పైగా ఆ పాట తాలూకు వర్క్ షాప్ ని రెండు నెలలు నిర్వహించి మరో పదిహేను రోజులు చిత్రీకరించడానికి తీసుకున్నారు. అలాంటిది కొన్ని కోట్ల మంది చూస్తున్న కెమెరాల ముందు పర్ఫెక్ట్ గా రావాలంటే సాధన సరిపోదని వాళ్ళ ఉద్దేశం. ఈ కారణంగానే నాటు నాటుని మరోసారి ప్రత్యక్షంగా చూసే అవకాశం ఫ్యాన్స్ కోల్పోయినట్టయ్యింది.
మనం చూసిన విదేశీ డాన్సర్ల పెర్ఫార్మన్స్ కి ముందు లాస్ యాంజిల్స్ లో 18 గంటల పాటు నిపుణున ఆధ్వర్యంలో శిక్షణ ఇప్పించారు. 90 నిమిషాల కెమెరా బ్లాకింగ్ ని వాడి ఎలాంటి లోటుపాట్లు రాకుండా చూసుకున్నారు. ఇంత జాగ్రత్త తీసుకోవడం వల్లే ఎలాంటి పొరపాట్లకు అవకాశం దక్కలేదు. ఒకవేళ నాటు నాటుకి అవార్డు ఖాయమని ఏ నవంబర్ లోనో తెలిసి ఉంటే ముందస్తుగా సన్నద్ధమవ్వడానికి ఛాన్స్ ఉండేది. కానీ నామినేషన్ల స్టేజిలోనే విజేత ఎవరని తెలిసే ఆస్కారం లేకపోవడంతో ఇలా సర్దుకోక తప్పలేదు. టైం ఉండింటే మాత్రం అద్భుతమే జరిగేది.
This post was last modified on March 15, 2023 12:00 pm
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…