మొన్న జరిగిన ఆస్కార్ వేడుకలో స్టేజి మీద ఫారిన్ డాన్సర్లు నాటు నాటుకి లైవ్ లో డాన్స్ చేయడం గొప్ప అనుభూతినిచ్చింది కానీ దానికి బదులు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లు చేసుంటే అదో చిరస్మరణీయ ఘట్టంగా మిగిలిపోయేదని ఇద్దరి అభిమానులు బాగా ఫీలయ్యారు. అందులో నిజం లేకపోలేదు. ఎందుకంటే అలాంటి అంతర్జాతీయ వేదిక మీద నృత్యం చేయడమంటే అదో అరుదైన దృశ్యంగా చిరకాలం నిలిచిపోయేది. ప్రాక్టీస్ లేకపోవడం ఒక కారణమని తారక్ చెప్పాడు కానీ తెరవెనుక ఏం జరిగిందననేది అకాడెమి అఫీషియల్ వెబ్ సైట్ లో వివరణ ఇచ్చింది.
నిజానికి ఆస్కార్ కమిటీ తారక్, చరణ్ ల లైవ్ నే అడిగింది. కానీ ఫిబ్రవరి మధ్యలో తమకున్న వృత్తిపరమైన కమిట్ మెంట్ల వల్ల అలా చేయలేమని, పైగా రిహార్సల్ చేయడానికి తగినంత సమయం లేదని ఇద్దరి నుంచి బదులు వచ్చింది. పైగా ఆ పాట తాలూకు వర్క్ షాప్ ని రెండు నెలలు నిర్వహించి మరో పదిహేను రోజులు చిత్రీకరించడానికి తీసుకున్నారు. అలాంటిది కొన్ని కోట్ల మంది చూస్తున్న కెమెరాల ముందు పర్ఫెక్ట్ గా రావాలంటే సాధన సరిపోదని వాళ్ళ ఉద్దేశం. ఈ కారణంగానే నాటు నాటుని మరోసారి ప్రత్యక్షంగా చూసే అవకాశం ఫ్యాన్స్ కోల్పోయినట్టయ్యింది.
మనం చూసిన విదేశీ డాన్సర్ల పెర్ఫార్మన్స్ కి ముందు లాస్ యాంజిల్స్ లో 18 గంటల పాటు నిపుణున ఆధ్వర్యంలో శిక్షణ ఇప్పించారు. 90 నిమిషాల కెమెరా బ్లాకింగ్ ని వాడి ఎలాంటి లోటుపాట్లు రాకుండా చూసుకున్నారు. ఇంత జాగ్రత్త తీసుకోవడం వల్లే ఎలాంటి పొరపాట్లకు అవకాశం దక్కలేదు. ఒకవేళ నాటు నాటుకి అవార్డు ఖాయమని ఏ నవంబర్ లోనో తెలిసి ఉంటే ముందస్తుగా సన్నద్ధమవ్వడానికి ఛాన్స్ ఉండేది. కానీ నామినేషన్ల స్టేజిలోనే విజేత ఎవరని తెలిసే ఆస్కారం లేకపోవడంతో ఇలా సర్దుకోక తప్పలేదు. టైం ఉండింటే మాత్రం అద్భుతమే జరిగేది.
This post was last modified on March 15, 2023 12:00 pm
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లోనే అత్యధిక బడ్జెట్లో, భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ‘హరిహర వీరమల్లు’ సినిమా గురించి జనాలు…
థియేటర్లకు జనాలు రాక పరిస్థితి ఏ మాత్రం బాలేదు. రేపు విడుదల కాబోతున్న అయిదు కొత్త సినిమాలతో బాక్సాఫీస్ కు…
పచ్చగా సాగుతున్న వైసీపీ కాపురంలో కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం చిచ్చుపెడుతున్నాడా ? పార్టీకి ఆయన వ్యాఖ్యలు బలం చేకూర్చకపోగా చేటు చేస్తున్నాయా…
మెగా ఫ్యామిలీ హీరోనే అయినప్పటికీ అల్లు అర్జున్ విషయంలో చాలా ఏళ్ల నుంచి పవన్ కళ్యాణ్ అభిమానుల్లో వ్యతిరేకత ఉంది.…
దర్శకధీర రాజమౌళి, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మధ్య ఎంత బంధం ఉందో చాలాసార్లు బయటపడిందే అయినా ప్రతిసారి కొత్తగా…
సరిగ్గా మూడేండ్ల క్రితం రూ.40 వేలు తులం ఉన్న బంగారం ధర ఇప్పుడు రూ.70 వేల మార్క్ ను దాటిపోయింది.…