అంచనాలు నిజమయ్యాయి. ఆశలు ఫలించాయి. భారతీయ ప్రేక్షకులనే కాక ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమందిని ఊపేసిన ‘నాటు నాటు’ పాటకు ‘ఆస్కార్’ పురస్కారం దక్కింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో అకాడమీ అవార్డును సొంతం చేసుకుంది ‘నాటు నాటు’. ఒక తెలుగు పాటకు ఆస్కార్ వేదిక మీద గౌరవం దక్కడం అంటే చిన్న విషయం కాదు.
మన పాటను ఆస్కార్ వేదిక మీద ప్రదర్శించడం.. మన సంగీత దర్శకుడు, గేయ రచయిత కలిసి అకాడమీ పురస్కారాలను అందుకోవడం.. ఇదంతా కలలోనూ ఊహించలేని విషయం. ఇదంతా ‘ఆర్ఆర్ఆర్’ సినిమా వల్లే సాధ్యమైంది. ఈ పాట ఇంత గొప్ప ఆదరణ సంపాదించుకుని ఆస్కార్ పురస్కారం అందుకోవడంలో చాలామంది పాత్ర ఉంది. ఐతే మేజర్ క్రెడిట్ ఇవ్వాల్సిన వ్యక్తి ఆస్కార్ వేదికలో లేకపోవడం మాత్రం విచారించాల్సిన విషయమే.
ఆస్కార్ అకాడమీ నిబంధనల ప్రకారం బెస్ట్ ఒరిజినల్ సాంగ్ పురస్కారాన్ని ఆ పాటను కంపోజ్ చేసిన సంగీత దర్శకుడితో పాటు గేయ రచయితలకు అవార్డును అందజేస్తారు. కానీ ‘నాటు నాటు’ అంత పెద్ద హిట్ అయి ప్రపంచవ్యాప్తంగా కోట్లమందిని ఊపేయడానికి ప్రధాన కారణం మాత్రం అందులోని అద్భుతమైన స్టెప్పులే. ఆ పాట చూసి అందరూ మైమరిచిపోయింది ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నమ్మశక్యం కాని సింక్లో, మెరుపు వేగంతో, కళ్లు చెదిరే గ్రేస్తో వేసిన స్టెప్పులే. ఆ పాటలో వారి స్టెప్పులు చూసి నోరెళ్లబెట్టని వారు లేరు. కీ
రవాణి సూపర్ బీట్ ఉన్న ట్యూన్ ఇచ్చినా.. చంద్రబోస్ చక్కటి సాహిత్యం సమకూర్చినా.. గాయకులు కూడా బాగా పాడినా.. దృశ్యపరంగానే ఈ పాట ఎక్కువమందికి నచ్చి అంత పెద్ద హిట్ అయింది. ఆ పాటను రాజమౌళి అద్భుతంగా చిత్రీకరించాడు.. తారక్, చరణ్ అద్భుతంగా డ్యాన్స్ చేశారు. కానీ ఆ పాటకు అంత అద్భుతంగా నృత్యరీతులు సమకూర్చి.. తారక్, చరణ్లతో అంత బాగా డ్యాన్స్ చేయించింది ప్రేమ్ రక్షితే. ఆస్కార్ వాళ్లు తమ నిబంధనల ప్రకారం కీరవాణి, చంద్రబోస్లను మాత్రమే గౌరవించి ఉండొచ్చు కానీ.. ప్రేక్షకుల దృష్టిలో మాత్రం వీరితో పాటు ప్రేమ్ రక్షిత్ కూడా ఆస్కార్ అందుకున్నట్లే.
మా ఇంటి బంగారం కథ ముందుగా సాయిపల్లవి దగ్గరికి వెళ్లిన సంగతి సమంత స్వయంగా ఇంటర్వ్యూలో చెప్పాక బయటికి వచ్చింది.…
స్టార్ అన్న గుర్తింపు తెచ్చుకోలేకపోయి ఉండొచ్చు కానీ.. తమిళ, తెలుగు భాషల్లో సీనియర్ నటుడు ఆనంద్కు మంచి గుర్తింపే ఉంది.…
ముంబైలో ఇటీవల జరిగిన ఇంటర్నేషనల్ యోగా డే వేడుకల్లో హీరోయిన్ శ్రీలీలకు అవమానం జరిగిందని సోషల్ మీడియాలో ఒక వీడియో…
తప్పు చేసింది కేంద్ర ప్రభుత్వం. తన తప్పును ఏమాత్రం పట్టించుకోని కేంద్రం… విద్యార్థులు చేసిన చిన్నపాటి తప్పులకూ పెద్ద శిక్షలేసింది.…
ఇటీవలే విడుదలైన బాలీవుడ్ మూవీ 'మై వాపస్ ఆవుంగా'కు తొలి రోజు రివ్యూలు ఏమంత ఆశాజనకంగా లేవు. పబ్లిక్ టాక్…
సాయిధరమ్ తేజ్ హీరోగా రెండేళ్ల ముందు మొదలైన సినిమా.. సంబరాల యేటిగట్టు. తన మార్కెట్ స్థాయికి మించి పెద్ద బడ్జెట్లో…