అంచనాలు నిజమయ్యాయి. ఆశలు ఫలించాయి. భారతీయ ప్రేక్షకులనే కాక ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమందిని ఊపేసిన ‘నాటు నాటు’ పాటకు ‘ఆస్కార్’ పురస్కారం దక్కింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో అకాడమీ అవార్డును సొంతం చేసుకుంది ‘నాటు నాటు’. ఒక తెలుగు పాటకు ఆస్కార్ వేదిక మీద గౌరవం దక్కడం అంటే చిన్న విషయం కాదు.
మన పాటను ఆస్కార్ వేదిక మీద ప్రదర్శించడం.. మన సంగీత దర్శకుడు, గేయ రచయిత కలిసి అకాడమీ పురస్కారాలను అందుకోవడం.. ఇదంతా కలలోనూ ఊహించలేని విషయం. ఇదంతా ‘ఆర్ఆర్ఆర్’ సినిమా వల్లే సాధ్యమైంది. ఈ పాట ఇంత గొప్ప ఆదరణ సంపాదించుకుని ఆస్కార్ పురస్కారం అందుకోవడంలో చాలామంది పాత్ర ఉంది. ఐతే మేజర్ క్రెడిట్ ఇవ్వాల్సిన వ్యక్తి ఆస్కార్ వేదికలో లేకపోవడం మాత్రం విచారించాల్సిన విషయమే.
ఆస్కార్ అకాడమీ నిబంధనల ప్రకారం బెస్ట్ ఒరిజినల్ సాంగ్ పురస్కారాన్ని ఆ పాటను కంపోజ్ చేసిన సంగీత దర్శకుడితో పాటు గేయ రచయితలకు అవార్డును అందజేస్తారు. కానీ ‘నాటు నాటు’ అంత పెద్ద హిట్ అయి ప్రపంచవ్యాప్తంగా కోట్లమందిని ఊపేయడానికి ప్రధాన కారణం మాత్రం అందులోని అద్భుతమైన స్టెప్పులే. ఆ పాట చూసి అందరూ మైమరిచిపోయింది ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నమ్మశక్యం కాని సింక్లో, మెరుపు వేగంతో, కళ్లు చెదిరే గ్రేస్తో వేసిన స్టెప్పులే. ఆ పాటలో వారి స్టెప్పులు చూసి నోరెళ్లబెట్టని వారు లేరు. కీ
రవాణి సూపర్ బీట్ ఉన్న ట్యూన్ ఇచ్చినా.. చంద్రబోస్ చక్కటి సాహిత్యం సమకూర్చినా.. గాయకులు కూడా బాగా పాడినా.. దృశ్యపరంగానే ఈ పాట ఎక్కువమందికి నచ్చి అంత పెద్ద హిట్ అయింది. ఆ పాటను రాజమౌళి అద్భుతంగా చిత్రీకరించాడు.. తారక్, చరణ్ అద్భుతంగా డ్యాన్స్ చేశారు. కానీ ఆ పాటకు అంత అద్భుతంగా నృత్యరీతులు సమకూర్చి.. తారక్, చరణ్లతో అంత బాగా డ్యాన్స్ చేయించింది ప్రేమ్ రక్షితే. ఆస్కార్ వాళ్లు తమ నిబంధనల ప్రకారం కీరవాణి, చంద్రబోస్లను మాత్రమే గౌరవించి ఉండొచ్చు కానీ.. ప్రేక్షకుల దృష్టిలో మాత్రం వీరితో పాటు ప్రేమ్ రక్షిత్ కూడా ఆస్కార్ అందుకున్నట్లే.
This post was last modified on March 13, 2023 2:34 pm
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…