రానా నాయుడు.. ఇప్పుడు తెలుగు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీస్తున్న వెబ్ సిరీస్. ఈ సిరీస్ మేకర్స్ అందరూ బాలీవుడ్ వాళ్లే కానీ.. ఇందులో లీడ్ రోల్స్ చేసింది మాత్రం టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్, ఆయన అన్న కొడుకు రానా దగ్గుబాటి. వెంకీ తొలిసారి చేస్తున్న టీవీ షో కావడంతో ఆయన అభిమానులు చాలా ఉత్కంఠగా దీని కోసం ఎదురు చూశారు. కానీ వెంకీ పాత్రను ఇందులో ప్రెజెంట్ చేసిన విధానం.. ఆయనతో పలికించిన బూతులు.. ఇప్పించిన హావభావాలు చూసి జనాలు షాకైపోతున్నారు.
ఇక ఈ సిరీస్లో ఎరోటిక్ సీన్ల గురించి చెప్పడానికి చాలానే ఉంది. వెబ్ సిరీస్ల్లో శృంగార సన్నివేశాలు కొత్తేమీ కాదు కానీ.. ఇందులో అవి మరీ జుగుప్సాకరంగా ఉండటం పట్ల తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఇండియాలో ఓ వెబ్ సిరీస్ విషయంలో ఇంత వ్యతిరేకత రావడం బహుశా ఇదే తొలిసారి కావచ్చు.
వెంకీ ఉన్నాడు కదా అని ‘రానా నాయుడు’ మొదలుపెట్టి.. తట్టుకోలేక ఆరంభ దశలోనే వదిలేసిన వాళ్లే ఎక్కువమంది. ఐతే ఇలాంటి సిరీస్లు అలవాటైన వాళ్లు మాత్రం ‘రానా నాయుడు’ను చూస్తున్నట్లున్నారు. ఇందులో హాట్ హాట్ సీన్ల కోసమే చూసేవాళ్లు కూడా లేకపోలేదు. ఐతే కంటెంట్ పరంగా చాలా వీక్ కావడంతో ‘రానా నాయుడు’కు మైనస్ అయింది.
ఓవైపు పూర్ రేటింగ్స్ తెచ్చుకోవడం, మరోవైపు వెంకీ అభిమానుల నుంచి వ్యతిరేకత ఊహించని స్థాయిలో ఉండటంతో దీని సీక్వెల్స్ విషయంలో నెట్ ఫ్లిక్స్ పునరాలోచనలో పడే ఛాన్సుంది. నిజానికి ఈ సిరీస్లను మూడు సీజన్ల పాటు నడిపించాలన్నది ప్లాన్ అట. ఆ మేరకు ఆర్టిస్టులు, టెక్నీషియన్లతో నెట్ఫ్లిక్స్ ఒప్పందం చేసుకుంది. కానీ తొలి సీజన్కు రెస్పాన్స్ ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ఇప్పుడు మిగతా రెండు సీజన్లు సందిగ్ధంలో పడ్డాయి. కానీ నెట్ఫ్లిక్స్ ఇలాంటి వాటికి జడిసే రకం అయితే కాదు. కాబట్టి ఇంకో రెండు సీజన్లు కూడా దించుతుందేమో చూద్దాం.
This post was last modified on March 12, 2023 8:13 pm
శ్రియా రెడ్డి అంటే తెలుగు ప్రేక్షకుల్లో చాలామందికి ఇప్పటికీ ‘పొగరు’ సినిమాలోని ఈశ్వరి పాత్ర గుర్తొస్తుంది. విశాల్ హీరోగా వచ్చిన…
ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో, అటు ప్రేక్షకుల్లో జరుగుతున్న చర్చ ఎల్లుండి నుంచి ఇరుముడికి కేటాయించిన చాలా థియేటర్లు టాక్సిక్ కు…
ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత ప్రమాదానికి గురయ్యారు. ఆమె ఎగుర వేసిన డ్రోన్.. కొద్ద దూరం పైకి వెళ్లి…
కుళ్లిపోయిన చికెన్ వ్యర్థాలను చేపలకు ఆహారంగా వినియోగిస్తున్న వ్యవహారం వెలుగులోకి రావడంతో ప్రజారోగ్యంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో…
బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన ఒక ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్ అభ్యంతరకరంగా వ్యవహరించడం విమర్శలకు తావిచ్చింది. రాజస్థాన్ లోని ఒక ప్రిన్సిపాల్ విద్యార్థినులతో…
మహారాష్ట్రలో ఒక కుటుంబానికి చెందిన ముగ్గురు.. చాలామంది చూస్తుండగా, నిమిషాల వ్యవధిలో అనూహ్యంగా ప్రాణాలు కోల్పోయిన ఘటన ఇప్పుడు సోషల్…