రానా నాయుడు.. ఇప్పుడు తెలుగు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీస్తున్న వెబ్ సిరీస్. ఈ సిరీస్ మేకర్స్ అందరూ బాలీవుడ్ వాళ్లే కానీ.. ఇందులో లీడ్ రోల్స్ చేసింది మాత్రం టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్, ఆయన అన్న కొడుకు రానా దగ్గుబాటి. వెంకీ తొలిసారి చేస్తున్న టీవీ షో కావడంతో ఆయన అభిమానులు చాలా ఉత్కంఠగా దీని కోసం ఎదురు చూశారు. కానీ వెంకీ పాత్రను ఇందులో ప్రెజెంట్ చేసిన విధానం.. ఆయనతో పలికించిన బూతులు.. ఇప్పించిన హావభావాలు చూసి జనాలు షాకైపోతున్నారు.
ఇక ఈ సిరీస్లో ఎరోటిక్ సీన్ల గురించి చెప్పడానికి చాలానే ఉంది. వెబ్ సిరీస్ల్లో శృంగార సన్నివేశాలు కొత్తేమీ కాదు కానీ.. ఇందులో అవి మరీ జుగుప్సాకరంగా ఉండటం పట్ల తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఇండియాలో ఓ వెబ్ సిరీస్ విషయంలో ఇంత వ్యతిరేకత రావడం బహుశా ఇదే తొలిసారి కావచ్చు.
వెంకీ ఉన్నాడు కదా అని ‘రానా నాయుడు’ మొదలుపెట్టి.. తట్టుకోలేక ఆరంభ దశలోనే వదిలేసిన వాళ్లే ఎక్కువమంది. ఐతే ఇలాంటి సిరీస్లు అలవాటైన వాళ్లు మాత్రం ‘రానా నాయుడు’ను చూస్తున్నట్లున్నారు. ఇందులో హాట్ హాట్ సీన్ల కోసమే చూసేవాళ్లు కూడా లేకపోలేదు. ఐతే కంటెంట్ పరంగా చాలా వీక్ కావడంతో ‘రానా నాయుడు’కు మైనస్ అయింది.
ఓవైపు పూర్ రేటింగ్స్ తెచ్చుకోవడం, మరోవైపు వెంకీ అభిమానుల నుంచి వ్యతిరేకత ఊహించని స్థాయిలో ఉండటంతో దీని సీక్వెల్స్ విషయంలో నెట్ ఫ్లిక్స్ పునరాలోచనలో పడే ఛాన్సుంది. నిజానికి ఈ సిరీస్లను మూడు సీజన్ల పాటు నడిపించాలన్నది ప్లాన్ అట. ఆ మేరకు ఆర్టిస్టులు, టెక్నీషియన్లతో నెట్ఫ్లిక్స్ ఒప్పందం చేసుకుంది. కానీ తొలి సీజన్కు రెస్పాన్స్ ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ఇప్పుడు మిగతా రెండు సీజన్లు సందిగ్ధంలో పడ్డాయి. కానీ నెట్ఫ్లిక్స్ ఇలాంటి వాటికి జడిసే రకం అయితే కాదు. కాబట్టి ఇంకో రెండు సీజన్లు కూడా దించుతుందేమో చూద్దాం.
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…