విభిన్నమైన కథలు చేస్తున్నా ఛలో తరువాత మళ్ళీ ఆ స్థాయి విజయం అందుకోలేకపోయిన నాగ శౌర్య ఈసారి ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయితో వస్తున్నాడు. వచ్చే వారం 17న థియేటర్లలో విడుదల కాబోతోంది. ఇవాళ జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ట్రైలర్ ని లాంచ్ చేశారు. నటుడిగానే కాక ఊహలు గుసగుసలాడే, జో అచ్యుతానంద లాంటి ఫీల్ గుడ్ మూవీస్ తో దర్శకుడిగానూ మంచి పేరు తెచ్చుకున్న అవసరాల శ్రీనివాస్ కొంత గ్యాప్ తీసుకుని ఈ రామ్ కామ్ లవ్ ఎంటర్ టైనర్ తో వస్తున్నారు. కబ్జతో పోటీ పడబోతున్న అబ్బాయి అమ్మాయి యూత్ ని టార్గెట్ చేసుకున్నారు.
కాలేజీలో చదువుకునే రోజుల్లో సంజయ్(నాగశౌర్య) అనుపమ(మాళవిక నాయర్)లు జూనియర్ సీనియర్ గా పరిచయమవుతారు. మొదట్లో సాధారణంగా ఉన్న ఈ స్నేహం క్రమంగా ప్రేమగా మారుతుంది. ఒకరినొకరు అర్థం చేసుకుని ఐ లవ్ యు కూడా చెప్పుకుంటారు. ఈలోగా కొన్ని అనూహ్య పరిణామాలు తర్వాత బ్రేకప్. కట్ చేస్తే కొంత కాలం తర్వాత అనుపమ జీవితంలో మరో యువకుడు(అవసరాల శ్రీనివాస్)వస్తాడు. ఇటు సంజయ్ లైఫ్ లోనూ ఇంకో అమ్మాయి(మేఘా చౌదరి) వస్తుంది. ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ కలుసుకున్న ఈ ఇద్దరి ప్రయాణం ఏ మలుపు తీసుకుందనేది తెరమీదే చూడాలి.
ట్రైలర్ మొత్తం అవసరాల మార్క్ సాఫ్ట్ విజువల్స్ నిండిపోయాయి. లైన్ పరంగా మరీ కొత్తగా అనిపించలేదు కానీ యువతను లక్ష్యంగా చేసుకుని సున్నితమైన సంబంధాలు, భావోద్వేగాలను చూపించే ప్రయత్నం బలంగా చేశారు. హిట్టా ఫట్టా తేల్చబోయేది ఈ అంశమే. నాగశౌర్య మూడు రకాల గెటప్స్ ని ట్రై చేశాడు. మాళవిక నాయర్ తన సహజమైన నటనతో అనుపమగా ఒదిగిపోయింది. కళ్యాణి మాలిక్ మెలోడీ మ్యూజిక్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. మొత్తానికి అబ్బాయి అమ్మాయి వెరైటీగా లేకపోయినా కూల్ ఆండ్ స్వీట్ గా ఆకట్టుకునేలా ఉన్నారు. సినిమా కూడా ఇలాగే ఉంటే జోడి కుదిరినట్టే.
This post was last modified on March 12, 2023 7:19 am
కొందరు నటులు తరచుగా సినిమాల్లో కనిపిస్తుంటారు. చాలా ఫెమిలియర్గా అనిపిస్తారు. కానీ ఆ నటుల పేరేంటో కూడా జనాలకు గుర్తుండదు.…
చారిత్రక నేపథ్యం ఉన్న కథలను, భారీ బడ్జెట్లలో, పాన్ ఇండియా స్థాయిలో తీసే ధైర్యం దర్శక నిర్మాతల్లో పెంచిన ఘనత…
సినిమాలకు టైటిళ్లు పెట్టడంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ స్టైలే వేరు. స్టార్ హీరోల సినిమాలకు సైతం, క్లాస్గా, కొంచెం పొయెటిగ్గా, ఫ్యామిలీ…
సంక్రాంతికి ‘మన శంకర వరప్రసాద్ గారు’ భారీ విజయం సాధించిన ఉత్సాహంలో ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి. దీనికి తోడు చరణ్కు…
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగం వ్యవహారం.. కీలక మలుపు తిరిగింది. ఈ కల్తీ వ్యవహారంపై విచారణ…
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్.. తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. పార్టీ వర్గాలతో చర్చలు జరిపిన ఆయన..…