విభిన్నమైన కథలు చేస్తున్నా ఛలో తరువాత మళ్ళీ ఆ స్థాయి విజయం అందుకోలేకపోయిన నాగ శౌర్య ఈసారి ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయితో వస్తున్నాడు. వచ్చే వారం 17న థియేటర్లలో విడుదల కాబోతోంది. ఇవాళ జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ట్రైలర్ ని లాంచ్ చేశారు. నటుడిగానే కాక ఊహలు గుసగుసలాడే, జో అచ్యుతానంద లాంటి ఫీల్ గుడ్ మూవీస్ తో దర్శకుడిగానూ మంచి పేరు తెచ్చుకున్న అవసరాల శ్రీనివాస్ కొంత గ్యాప్ తీసుకుని ఈ రామ్ కామ్ లవ్ ఎంటర్ టైనర్ తో వస్తున్నారు. కబ్జతో పోటీ పడబోతున్న అబ్బాయి అమ్మాయి యూత్ ని టార్గెట్ చేసుకున్నారు.
కాలేజీలో చదువుకునే రోజుల్లో సంజయ్(నాగశౌర్య) అనుపమ(మాళవిక నాయర్)లు జూనియర్ సీనియర్ గా పరిచయమవుతారు. మొదట్లో సాధారణంగా ఉన్న ఈ స్నేహం క్రమంగా ప్రేమగా మారుతుంది. ఒకరినొకరు అర్థం చేసుకుని ఐ లవ్ యు కూడా చెప్పుకుంటారు. ఈలోగా కొన్ని అనూహ్య పరిణామాలు తర్వాత బ్రేకప్. కట్ చేస్తే కొంత కాలం తర్వాత అనుపమ జీవితంలో మరో యువకుడు(అవసరాల శ్రీనివాస్)వస్తాడు. ఇటు సంజయ్ లైఫ్ లోనూ ఇంకో అమ్మాయి(మేఘా చౌదరి) వస్తుంది. ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ కలుసుకున్న ఈ ఇద్దరి ప్రయాణం ఏ మలుపు తీసుకుందనేది తెరమీదే చూడాలి.
ట్రైలర్ మొత్తం అవసరాల మార్క్ సాఫ్ట్ విజువల్స్ నిండిపోయాయి. లైన్ పరంగా మరీ కొత్తగా అనిపించలేదు కానీ యువతను లక్ష్యంగా చేసుకుని సున్నితమైన సంబంధాలు, భావోద్వేగాలను చూపించే ప్రయత్నం బలంగా చేశారు. హిట్టా ఫట్టా తేల్చబోయేది ఈ అంశమే. నాగశౌర్య మూడు రకాల గెటప్స్ ని ట్రై చేశాడు. మాళవిక నాయర్ తన సహజమైన నటనతో అనుపమగా ఒదిగిపోయింది. కళ్యాణి మాలిక్ మెలోడీ మ్యూజిక్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. మొత్తానికి అబ్బాయి అమ్మాయి వెరైటీగా లేకపోయినా కూల్ ఆండ్ స్వీట్ గా ఆకట్టుకునేలా ఉన్నారు. సినిమా కూడా ఇలాగే ఉంటే జోడి కుదిరినట్టే.
This post was last modified on March 12, 2023 7:19 am
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…