విభిన్నమైన కథలు చేస్తున్నా ఛలో తరువాత మళ్ళీ ఆ స్థాయి విజయం అందుకోలేకపోయిన నాగ శౌర్య ఈసారి ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయితో వస్తున్నాడు. వచ్చే వారం 17న థియేటర్లలో విడుదల కాబోతోంది. ఇవాళ జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ట్రైలర్ ని లాంచ్ చేశారు. నటుడిగానే కాక ఊహలు గుసగుసలాడే, జో అచ్యుతానంద లాంటి ఫీల్ గుడ్ మూవీస్ తో దర్శకుడిగానూ మంచి పేరు తెచ్చుకున్న అవసరాల శ్రీనివాస్ కొంత గ్యాప్ తీసుకుని ఈ రామ్ కామ్ లవ్ ఎంటర్ టైనర్ తో వస్తున్నారు. కబ్జతో పోటీ పడబోతున్న అబ్బాయి అమ్మాయి యూత్ ని టార్గెట్ చేసుకున్నారు.
కాలేజీలో చదువుకునే రోజుల్లో సంజయ్(నాగశౌర్య) అనుపమ(మాళవిక నాయర్)లు జూనియర్ సీనియర్ గా పరిచయమవుతారు. మొదట్లో సాధారణంగా ఉన్న ఈ స్నేహం క్రమంగా ప్రేమగా మారుతుంది. ఒకరినొకరు అర్థం చేసుకుని ఐ లవ్ యు కూడా చెప్పుకుంటారు. ఈలోగా కొన్ని అనూహ్య పరిణామాలు తర్వాత బ్రేకప్. కట్ చేస్తే కొంత కాలం తర్వాత అనుపమ జీవితంలో మరో యువకుడు(అవసరాల శ్రీనివాస్)వస్తాడు. ఇటు సంజయ్ లైఫ్ లోనూ ఇంకో అమ్మాయి(మేఘా చౌదరి) వస్తుంది. ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ కలుసుకున్న ఈ ఇద్దరి ప్రయాణం ఏ మలుపు తీసుకుందనేది తెరమీదే చూడాలి.
ట్రైలర్ మొత్తం అవసరాల మార్క్ సాఫ్ట్ విజువల్స్ నిండిపోయాయి. లైన్ పరంగా మరీ కొత్తగా అనిపించలేదు కానీ యువతను లక్ష్యంగా చేసుకుని సున్నితమైన సంబంధాలు, భావోద్వేగాలను చూపించే ప్రయత్నం బలంగా చేశారు. హిట్టా ఫట్టా తేల్చబోయేది ఈ అంశమే. నాగశౌర్య మూడు రకాల గెటప్స్ ని ట్రై చేశాడు. మాళవిక నాయర్ తన సహజమైన నటనతో అనుపమగా ఒదిగిపోయింది. కళ్యాణి మాలిక్ మెలోడీ మ్యూజిక్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. మొత్తానికి అబ్బాయి అమ్మాయి వెరైటీగా లేకపోయినా కూల్ ఆండ్ స్వీట్ గా ఆకట్టుకునేలా ఉన్నారు. సినిమా కూడా ఇలాగే ఉంటే జోడి కుదిరినట్టే.
This post was last modified on March 12, 2023 7:19 am
మంచి నటన, చలాకీతనం, అందం అన్నీ ఉన్నా కార్తీ విషయంలో జరుగుతున్న పరిణామాలు అభిమానులను తెగ కలవరపెడుతున్నాయి. సరైన హిట్…
విశాఖపట్నంలో జరగనున్న కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ ఆశలు గల్లంతవుతున్నాయి. గతంలో ఉన్న పట్టు.. ఇప్పుడు లేకపోవడం.. గతంలో సాయిరెడ్డి వంటి…
టాలెంట్ ఎంత ఉన్నా సక్సెస్ విషయంలో పోరాడుతూనే ఉన్న హీరోల్లో సుహాస్ ఒకడు. కలర్ ఫోటోకు జాతీయ అవార్డు వచ్చినా…
పహల్గామ్ ఉగ్రదాడి విషయంలో భారత్కు అంతర్జాతీయ వేదికపై కీలక మద్దతు లభించింది. ఢిల్లీలో జరిగిన బ్రిక్స్ సదస్సులో ఆమోదించిన న్యూఢిల్లీ…
రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మక స్థానాల్లో గుంటూరు మేయర్ స్థానం ఒకటి. విజయవాడ, గుంటూరు కార్పొరేషన్లు అమరావతి రాజధాని పరిసరాల్లో ఉండటంతో…
వ్యూహాల కలిమి.. నాయకుల చెలిమి ఏ పార్టీకైనా అత్యంత అవసరం. ఈ విషయంలో వైసీపీ చేస్తున్న వ్వవహారం.. పార్టీని దుంపనాశనం…