విభిన్నమైన కథలు చేస్తున్నా ఛలో తరువాత మళ్ళీ ఆ స్థాయి విజయం అందుకోలేకపోయిన నాగ శౌర్య ఈసారి ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయితో వస్తున్నాడు. వచ్చే వారం 17న థియేటర్లలో విడుదల కాబోతోంది. ఇవాళ జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ట్రైలర్ ని లాంచ్ చేశారు. నటుడిగానే కాక ఊహలు గుసగుసలాడే, జో అచ్యుతానంద లాంటి ఫీల్ గుడ్ మూవీస్ తో దర్శకుడిగానూ మంచి పేరు తెచ్చుకున్న అవసరాల శ్రీనివాస్ కొంత గ్యాప్ తీసుకుని ఈ రామ్ కామ్ లవ్ ఎంటర్ టైనర్ తో వస్తున్నారు. కబ్జతో పోటీ పడబోతున్న అబ్బాయి అమ్మాయి యూత్ ని టార్గెట్ చేసుకున్నారు.
కాలేజీలో చదువుకునే రోజుల్లో సంజయ్(నాగశౌర్య) అనుపమ(మాళవిక నాయర్)లు జూనియర్ సీనియర్ గా పరిచయమవుతారు. మొదట్లో సాధారణంగా ఉన్న ఈ స్నేహం క్రమంగా ప్రేమగా మారుతుంది. ఒకరినొకరు అర్థం చేసుకుని ఐ లవ్ యు కూడా చెప్పుకుంటారు. ఈలోగా కొన్ని అనూహ్య పరిణామాలు తర్వాత బ్రేకప్. కట్ చేస్తే కొంత కాలం తర్వాత అనుపమ జీవితంలో మరో యువకుడు(అవసరాల శ్రీనివాస్)వస్తాడు. ఇటు సంజయ్ లైఫ్ లోనూ ఇంకో అమ్మాయి(మేఘా చౌదరి) వస్తుంది. ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ కలుసుకున్న ఈ ఇద్దరి ప్రయాణం ఏ మలుపు తీసుకుందనేది తెరమీదే చూడాలి.
ట్రైలర్ మొత్తం అవసరాల మార్క్ సాఫ్ట్ విజువల్స్ నిండిపోయాయి. లైన్ పరంగా మరీ కొత్తగా అనిపించలేదు కానీ యువతను లక్ష్యంగా చేసుకుని సున్నితమైన సంబంధాలు, భావోద్వేగాలను చూపించే ప్రయత్నం బలంగా చేశారు. హిట్టా ఫట్టా తేల్చబోయేది ఈ అంశమే. నాగశౌర్య మూడు రకాల గెటప్స్ ని ట్రై చేశాడు. మాళవిక నాయర్ తన సహజమైన నటనతో అనుపమగా ఒదిగిపోయింది. కళ్యాణి మాలిక్ మెలోడీ మ్యూజిక్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. మొత్తానికి అబ్బాయి అమ్మాయి వెరైటీగా లేకపోయినా కూల్ ఆండ్ స్వీట్ గా ఆకట్టుకునేలా ఉన్నారు. సినిమా కూడా ఇలాగే ఉంటే జోడి కుదిరినట్టే.
కెరీర్ తొలి నాళ్లలో పెద్దగా అవకాశాలు లేనపుడు దక్షిణాదిన వచ్చే ప్రతి ఛాన్సునూ మహా ప్రసాదం అనుకుంటారు. స్టార్ ఇమేజ్…
మెగా హీరోల సినిమాలకు సంబంధించి ఏ ఈవెంట్ అయినా.. అందులో ఎక్కడో ఒక చోట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్…
హైదరాబాద్ శిల్పకళా వేదికలో జరిగిన పెద్ది సక్సెస్ మీట్ కోసం వేలాది అభిమానులు తరలివచ్చారు. ఈ సినిమాకు సంబంధించి ఇదే…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను టార్గెట్ చేస్తూ విపక్ష వైసీపీ ఇటీవల డోస్ పెంచిన…
ప్రతి సంవత్సరం విజయ్కి స్పెషల్ పిక్తో పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పే త్రిష.. ఈసారి చెప్పలేదు. ఇన్స్టాగ్రామ్లో కూడా ఆయన్ని…
నిజమే…ఆ ఇద్దరూ కలిశారు. రాష్ట్ర అభివృద్ది కోసం రాజకీయాలను పక్కనపెట్టేశారు. అంతే… ఇద్దరు ముగ్గురయ్యారు. ఆ ముగ్గురూ నలుగురయ్యారు. వెరసి…