వెంకటేష్ , రానా ఇద్దరు కలిసి ఫస్ట్ టైమ్ ‘రానా నాయుడు’ అనే సిరీస్ చేశారు. ఈ షో ఈ నెల 10న ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకొస్తుంది. ఈ సిరీస్ కోసం వెంకీ , రానాలు జోరుగా ప్రచారం చేస్తున్నారు. ముంబై తో పాటు హైదరాబాద్ లో కూడా ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ షో ఎలా ఉండబోతుందో ఇప్పటికే టీజర్ , ట్రైలర్ ద్వారా చెప్పేసిన వెంకీ, రానాలు ఈ షో ఫ్యామిలీ మొత్తం కలిసి చూడొద్దని రిక్వెస్ట్ చేస్తున్నారు.
ఇప్పటికే ప్రెస్ మీట్లో అలాగే ఇంటర్వ్యూల్లో రానా పదే పదే అదే చెప్తున్నాడు. వెంకటేష్ , రానా చేసిన సిరీస్ కదా అని ఫ్యామిలీతో కలిసి చూడొద్దని , సెపరేట్ గా ఎవరి రూమ్ లో వాళ్ళు లాప్ టాప్ లో చూసి ఎంజాయ్ చేయమని చెప్తున్నారు. రానా , వెంకీ ఇలా చెప్పడానికి రీజన్ లేకపోలేదు. ఇది అడల్ట్ కంటెంట్ తో తీసిన సిరీస్. రొమాన్స్ లు , ఫైటింగ్ లు , ముఖ్యంగా ఈ తరహా సిరీస్ లో వినిపించే బూతులు కూడా గట్టిగా ఉంటాయి. అందుకే వెంకీ నటించాడు కదా ఫ్యామిలీస్ అంతా కలిసి హాల్ లో కూర్చొని చూస్తే ఎవరూ ఎంజాయ్ చేయలేరని రానా భావన.
ఈ షోకి ఇద్దరు హీరోలు ఉన్నట్టే ఇద్దరు దర్శకులు వర్క్ చేశారు. కరణ్ అన్షుమాన్ , సూపర్న్ వెర్మ డైరెక్ట్ చేశారు. అమెరికన్ సిరీస్ ‘రెయ్ డోనవన్’ కి రీమేక్ గా షో తెరకెక్కింది. మరి ఈ సిరీస్ తో బాబాయ్ , అబ్బాయ్ ఓటీటీ అడియన్స్ ను ఎలా మెప్పిస్తారో ?
This post was last modified on March 10, 2023 11:13 am
రాజమండ్రిలో నిర్వహించిన కూటమి పార్టీల(జనసేన-బీజేపీ-టీడీపీ) ఎన్నికల ప్రచార సభ 'ప్రజాగళం'లో చంద్రబాబు పాల్గొన లేక పోయారు. ఆయన వేరే సభలో…
మాములుగా కమెడియన్లు హీరోలు కావడం గతంలో ఎన్నో చూశాం. చూస్తున్నాం. కానీ మధ్యవయసు దాటిన క్యారెక్టర్ ఆర్టిస్టులు కథానాయకులుగా మారడం…
ఏపీలో డబుల్ ఇంజన్ సర్కారు రానుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమే కేంద్రంలోనూ…
ఆంధ్రప్రదేశ్లో కొన్ని వారాల నుంచి ఎన్నికల కమిషన్ కొరఢా ఝళిపిస్తూ ఉంది. ఎన్నికల సమయంలో తమ పరిధి దాటి వ్యవహరిస్తున్న…
కుర్ర హీరోల్లో వేగంగా మార్కెట్ పడిపోయిన వాళ్ళలో రాజ్ తరుణ్ పేరు మొదటగా చెప్పుకోవాలి. కెరీర్ ప్రారంభంలో కుమారి 21…
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. గత ఏడాది ఏపీలో జగన్ సర్కారు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి చట్టం. ఇప్పుడీ చట్టం ఎన్నికల ముంగిట…