వెంకటేష్ , రానా ఇద్దరు కలిసి ఫస్ట్ టైమ్ ‘రానా నాయుడు’ అనే సిరీస్ చేశారు. ఈ షో ఈ నెల 10న ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకొస్తుంది. ఈ సిరీస్ కోసం వెంకీ , రానాలు జోరుగా ప్రచారం చేస్తున్నారు. ముంబై తో పాటు హైదరాబాద్ లో కూడా ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ షో ఎలా ఉండబోతుందో ఇప్పటికే టీజర్ , ట్రైలర్ ద్వారా చెప్పేసిన వెంకీ, రానాలు ఈ షో ఫ్యామిలీ మొత్తం కలిసి చూడొద్దని రిక్వెస్ట్ చేస్తున్నారు.
ఇప్పటికే ప్రెస్ మీట్లో అలాగే ఇంటర్వ్యూల్లో రానా పదే పదే అదే చెప్తున్నాడు. వెంకటేష్ , రానా చేసిన సిరీస్ కదా అని ఫ్యామిలీతో కలిసి చూడొద్దని , సెపరేట్ గా ఎవరి రూమ్ లో వాళ్ళు లాప్ టాప్ లో చూసి ఎంజాయ్ చేయమని చెప్తున్నారు. రానా , వెంకీ ఇలా చెప్పడానికి రీజన్ లేకపోలేదు. ఇది అడల్ట్ కంటెంట్ తో తీసిన సిరీస్. రొమాన్స్ లు , ఫైటింగ్ లు , ముఖ్యంగా ఈ తరహా సిరీస్ లో వినిపించే బూతులు కూడా గట్టిగా ఉంటాయి. అందుకే వెంకీ నటించాడు కదా ఫ్యామిలీస్ అంతా కలిసి హాల్ లో కూర్చొని చూస్తే ఎవరూ ఎంజాయ్ చేయలేరని రానా భావన.
ఈ షోకి ఇద్దరు హీరోలు ఉన్నట్టే ఇద్దరు దర్శకులు వర్క్ చేశారు. కరణ్ అన్షుమాన్ , సూపర్న్ వెర్మ డైరెక్ట్ చేశారు. అమెరికన్ సిరీస్ ‘రెయ్ డోనవన్’ కి రీమేక్ గా షో తెరకెక్కింది. మరి ఈ సిరీస్ తో బాబాయ్ , అబ్బాయ్ ఓటీటీ అడియన్స్ ను ఎలా మెప్పిస్తారో ?
This post was last modified on March 10, 2023 11:13 am
గడిచిన కొంతకాలంగా మెమొరీ చిప్స్ ధరలు పెరగటంతో దాని ప్రభావం టీవీ ధరల మీద పడింది. ఇప్పుడు దీనికి పశ్చిమాసియాలో…
మొన్న శుక్రవారం తమిళంతో పాటు తెలుగులో కూడా లీడర్ అనే సినిమా రిలీజయ్యింది. బైకర్, రాకాస హడావిడిలో మనోళ్లు పట్టించుకోలేదు…
వరస బ్లాక్ బస్టర్లతో విజయాలను వదలని విక్రమార్కుడిలా దూసుకుపోతున్న దర్శకుడు అనిల్ రావిపూడి నెక్స్ట్ వెంకటేష్ - కళ్యాణ్ రామ్…
ఏపీలో కీలక ఘట్టానికి కూటమి ప్రభుత్వం తెరదీయనుంది. `గూగుల్ డేటా` కేంద్రానికి కొబ్బరికాయ కొట్టేందుకు సిద్ధమైంది. గత ఏడాది ఈ…
రంగబలి తర్వాత నాగశౌర్య తెరమీద కనిపించి రెండేళ్లు దాటిపోయింది. వరస డిజాస్టర్లతో మార్కెట్ డ్యామేజ్ అయిన టైంలో సరైన కంబ్యాక్…
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను గెలిపించుకున్న పిఠాపురం ప్రజలు... ఇప్పుడు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నారు. నియోజకవర్గంలోని దాదాపుగా అన్ని…