వెంకటేష్ , రానా ఇద్దరు కలిసి ఫస్ట్ టైమ్ ‘రానా నాయుడు’ అనే సిరీస్ చేశారు. ఈ షో ఈ నెల 10న ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకొస్తుంది. ఈ సిరీస్ కోసం వెంకీ , రానాలు జోరుగా ప్రచారం చేస్తున్నారు. ముంబై తో పాటు హైదరాబాద్ లో కూడా ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ షో ఎలా ఉండబోతుందో ఇప్పటికే టీజర్ , ట్రైలర్ ద్వారా చెప్పేసిన వెంకీ, రానాలు ఈ షో ఫ్యామిలీ మొత్తం కలిసి చూడొద్దని రిక్వెస్ట్ చేస్తున్నారు.
ఇప్పటికే ప్రెస్ మీట్లో అలాగే ఇంటర్వ్యూల్లో రానా పదే పదే అదే చెప్తున్నాడు. వెంకటేష్ , రానా చేసిన సిరీస్ కదా అని ఫ్యామిలీతో కలిసి చూడొద్దని , సెపరేట్ గా ఎవరి రూమ్ లో వాళ్ళు లాప్ టాప్ లో చూసి ఎంజాయ్ చేయమని చెప్తున్నారు. రానా , వెంకీ ఇలా చెప్పడానికి రీజన్ లేకపోలేదు. ఇది అడల్ట్ కంటెంట్ తో తీసిన సిరీస్. రొమాన్స్ లు , ఫైటింగ్ లు , ముఖ్యంగా ఈ తరహా సిరీస్ లో వినిపించే బూతులు కూడా గట్టిగా ఉంటాయి. అందుకే వెంకీ నటించాడు కదా ఫ్యామిలీస్ అంతా కలిసి హాల్ లో కూర్చొని చూస్తే ఎవరూ ఎంజాయ్ చేయలేరని రానా భావన.
ఈ షోకి ఇద్దరు హీరోలు ఉన్నట్టే ఇద్దరు దర్శకులు వర్క్ చేశారు. కరణ్ అన్షుమాన్ , సూపర్న్ వెర్మ డైరెక్ట్ చేశారు. అమెరికన్ సిరీస్ ‘రెయ్ డోనవన్’ కి రీమేక్ గా షో తెరకెక్కింది. మరి ఈ సిరీస్ తో బాబాయ్ , అబ్బాయ్ ఓటీటీ అడియన్స్ ను ఎలా మెప్పిస్తారో ?
పోలీసు స్టేషన్లకు వెళ్లి ఫిర్యాదు చేయాల్సిన అవసరం లేకుండా.. ఇక నుంచి వాయిస్ మెసేజ్ల ద్వారా కూడా ఫిర్యాదులు చేసే…
ఏపీలో వైసీపీ అదికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలోని పాత జిల్లాలతో పాటుగా వైసీపీ సర్కారే కొత్తగా ఏర్పాటు చేసిన కొత్త జిల్లాల్లోనూ…
పవన్ కళ్యాణ్ భుజాల లోపల కలిగిన గాయం ఊహించిన దానికంటే తీవ్రంగా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్…
ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును వేధింపులకు గురిచేసి.. కస్టడీలో టార్చర్ చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్ సునీల్ కుమార్…
రాజకీయాలంటే చాలా మంది చెడిపోయాయని అనుకుంటారు. కానీ, రాజకీయాలు అంతగా ఏమీ చెడిపోలేదు. ఒక పార్టీ కారణంగానే ఈ పేరు…
జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అనౌన్స్ మెంట్ ఇవాళ వచ్చేసింది. నిజానికి…