వెంకటేష్ , రానా ఇద్దరు కలిసి ఫస్ట్ టైమ్ ‘రానా నాయుడు’ అనే సిరీస్ చేశారు. ఈ షో ఈ నెల 10న ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకొస్తుంది. ఈ సిరీస్ కోసం వెంకీ , రానాలు జోరుగా ప్రచారం చేస్తున్నారు. ముంబై తో పాటు హైదరాబాద్ లో కూడా ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ షో ఎలా ఉండబోతుందో ఇప్పటికే టీజర్ , ట్రైలర్ ద్వారా చెప్పేసిన వెంకీ, రానాలు ఈ షో ఫ్యామిలీ మొత్తం కలిసి చూడొద్దని రిక్వెస్ట్ చేస్తున్నారు.
ఇప్పటికే ప్రెస్ మీట్లో అలాగే ఇంటర్వ్యూల్లో రానా పదే పదే అదే చెప్తున్నాడు. వెంకటేష్ , రానా చేసిన సిరీస్ కదా అని ఫ్యామిలీతో కలిసి చూడొద్దని , సెపరేట్ గా ఎవరి రూమ్ లో వాళ్ళు లాప్ టాప్ లో చూసి ఎంజాయ్ చేయమని చెప్తున్నారు. రానా , వెంకీ ఇలా చెప్పడానికి రీజన్ లేకపోలేదు. ఇది అడల్ట్ కంటెంట్ తో తీసిన సిరీస్. రొమాన్స్ లు , ఫైటింగ్ లు , ముఖ్యంగా ఈ తరహా సిరీస్ లో వినిపించే బూతులు కూడా గట్టిగా ఉంటాయి. అందుకే వెంకీ నటించాడు కదా ఫ్యామిలీస్ అంతా కలిసి హాల్ లో కూర్చొని చూస్తే ఎవరూ ఎంజాయ్ చేయలేరని రానా భావన.
ఈ షోకి ఇద్దరు హీరోలు ఉన్నట్టే ఇద్దరు దర్శకులు వర్క్ చేశారు. కరణ్ అన్షుమాన్ , సూపర్న్ వెర్మ డైరెక్ట్ చేశారు. అమెరికన్ సిరీస్ ‘రెయ్ డోనవన్’ కి రీమేక్ గా షో తెరకెక్కింది. మరి ఈ సిరీస్ తో బాబాయ్ , అబ్బాయ్ ఓటీటీ అడియన్స్ ను ఎలా మెప్పిస్తారో ?
This post was last modified on March 10, 2023 11:13 am
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…
మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…
సరైన భద్రత ఏర్పాట్లు చేయకుండా సినిమా, రాజకీయ ఈవెంట్లు పెడితే ఏం జరుగుతుందో.. ఎప్పటికప్పుడు ఉదాహరణలు చూస్తూనే ఉన్నాం. అయినా…
నటుడు శ్రీకాంత్ వారసుడిగా పెళ్లి సందడితో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రోషన్ మేక తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నాడు. మధ్యలో…
స్టార్ హీరోలు ఏడాదికి ఒక్క సినిమా అయినా చేయాలని.. అప్పుడే ఇండస్ట్రీ బాగుంటుందనే అభిప్రాయం ఎప్పట్నుంచో ఉన్నదే. పెద్ద స్టార్లు మాత్రమే…
ఏపీలో మెడికల్ కాలేజీల అంశంపై పెద్ద దుమారమే రేగుతోంది. కోటి సంతకాల పేరుతో రెండు నెలల పాటు వైసీపీ ఈ…