రెండు రోజుల క్రితం కెజిఎఫ్ మీద విపరీతమైన కామెంట్లు చేసి సోషల్ మీడియాలో వైరల్ టాపిక్ గా మారిపోయిన దర్శకుడు కం నటుడు వెంకటేష్ మహా తాజాగా యాంగర్ టేల్స్ వెబ్ సిరీస్ లో కనిపించాడు. డిస్నీ హాట్ స్టార్ లో నిన్న అర్ధరాత్రి నుంచి స్ట్రీమింగ్ అవుతున్న ఈ నాలుగు భాగాల యాంథాలజీలో వెంకటేష్ ఓ స్టార్ హీరో అభిమానిగా నటించాడు. డెబ్భై రూపాయల టికెట్ ని పన్నెండు వందలకు అమ్మితే తీరా బెనిఫిట్ షో సమయానికి డిజిటల్ ప్రింట్ కీ రాకపోవడం, ఆ తర్వాత లోకల్ కుర్ర లీడర్ చేతిలో అవమానింపపబడటం అనే పాయింట్ మీద చివరి ఎపిసోడ్ ని తీశారు.
మనిషికి కోపం వచ్చే పరిస్థితులను థీమ్ గా తీసుకుని ఈ యాంగర్ టేల్స్ ని రూపొందించారు. ముందే బెనిఫిట్ షో ఎపిసోడ్లో బూతులు ఉంటాయని ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హింట్ ఇచ్చారు కానీ ఫైనల్ గా ఫ్యామిలీతో పాటు కూర్చుంటే వామ్మో అనిపించే రేంజ్ లో సంస్కృతం వాడేశారు. ఎంత సహజత్వం కోసమే అయినా మరీ ఇంతగా డబుల్ మీనింగ్ పదాలు వాడాల్సిన అవసరమైతే లేదనిపిస్తుంది. నటుడిగా వెంకటేష్ మహా, అతన్ని కవ్వించే పాత్రలో సుహాస్ బాగానే నటించారు. ఉన్నవాటిలో ఇదొక్కటే కొంచెం బెటర్ గా అనిపిస్తుంది కానీ మిగిలినవి నెరేషన్ సమస్య వల్ల అంతగా ఆకట్టుకోవు.
మొన్న సినిమాటిక్ లిబర్టీ గురించి హీరో క్యారెక్టరైజేషన్ గురించి అంత వెటకారంగా మాట్లాడిన వెంకటేష్ మహా దీనికి తను దర్శకుడు కాకపోయినా ఇప్పుడీ బూతు మాటల పురాణాన్ని ఎలా సమర్ధించుకుంటాడో. ఇది న్యాచులారిటీ, ముందే చెప్పాము కదా అంటారేమో. అలాంటప్పుడు ఎవరి క్రియేటివిటీ అయినా అంతే కదా. కుటుంబమంతా కలిసి కూర్చుని చూడండి అని ధైర్యంగా చెప్పలేని స్థాయిలో మన కంటెంట్ ఉన్నప్పుడు ఇంకొకరిని వేరే విషయంలో ఎలా అంటారని నెటిజెన్లు నిలదీస్తున్నారు. కేరాఫ్ కంచరపాలం డైరెక్టర్ గా కన్నా వివాదాలు, నటనతోనే వెంకటేష్ మహా ఎక్కువ పాపులర్ అవుతున్నాడు.
విజయవాడలోని కృష్ణలంక ప్రాంతానికి చెందిన సాయికృష్ణ అనే యువకుడు లాకప్ డెత్ కు గురయ్యాడని తీవ్రస్థాయిలో ఆరోపణలు వస్తున్న సంగతి…
అమెరికానుంచి తరచుగా భారత్కు అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి. వలస విధానానికి సంబంధించి, హెచ్-1బీ వీసాలకు సంబంధించి కూడా భారత్కు అమెరికా…
ఓ పరామర్శ అయినా, ఓ సాయం అయినా, ఓ ఓదార్పు అయినా, ఓ కేసు అయినా, ఓ పథకం అయినా……
ఇప్పుడు ప్రపంచంలో నంబర్ వన్ డైౌరెక్టర్ ఎవరు అని పోల్ పెడితే.. తిరుగులేని ఆధిక్యంతో క్రిస్టోఫర్ నోలనే గెలుస్తాడు అనడంలో…
గత శుక్రవారం ‘సింగ్గీతం’ చిత్రం విడుదల కావడానికి ముందు పెద్దగా బజ్ కనిపించలేదు. 94 ఏళ్ల వయసులో సింగీతం ఓపిగ్గా…
గత ఎన్నికల సమయంలో మంగళగిరిలోని ప్రతి వీధిలోనూ పర్యటించిన నారా లోకేష్.. అక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యను ప్రభుత్వం…