Movie News

ఒక్క పాట కోసం తమన్ దేవీల దోస్తీ

టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఎవరయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు తమన్, దేవిశ్రీ ప్రసాద్. స్థిరంగా హిట్లు కొట్టే క్రమంలో తమన్ దే పైచేయి అయినప్పటికీ ఇటీవలే వాల్తేరు వీరయ్య రూపంలో దేవి తనలోనూ ఇంకా ఎనర్జీ బోలెడుందని చాటి చెప్పాడు. పుష్ప 2 ది రూల్ తో మళ్ళీ రూల్ చేయగలననే నమ్మకం చూపిస్తున్నాడు. ఈ ఇద్దరి కలయిక బయట చాలా అరుదు. ఆ మధ్య ఎవరు మీలో కోటీశ్వరులు ప్రోగ్రాంకి జూనియర్ ఎన్టీఆర్ కోసం కలిసి వెళ్లడం తప్పించి బయట స్టేజిలు ఈవెంట్ల దగ్గర స్క్రీన్ షేర్ చేసుకున్న దాఖలాలు చాలా తక్కువ.

తాజాగా ఈ ఇద్దరు కలిసి పనిచేయబోతున్నట్టు సమాచారం. అయితే సినిమాకు కాదులెండి. త్వరలో ప్రారంభం కానున్న ఐపీఎల్ 2023లో ఆడబోయే సన్ రైజర్స్ టీమ్ కోసం ఒక స్పెషల్ బ్యాక్ గ్రౌండ్ సాంగ్ ని కంపోజ్ చేయబోతున్నారట. ఒకరు ట్యూన్ చేసి మరొకరు పాడతారా లేక ఇద్దరు కలిసి పనిచేసి వేరే సింగర్స్ తో మెప్పిస్తారానేది వేచి చూడాలి. స్వతహాగానే తమన్ మంచి క్రికెట్ ప్రియుడు. ఇటీవలే సెలబ్రిటీ లీగ్ లో ఏ రేంజ్ లో ఆడాడో చూశాం. పైగా ఇంటర్నేషనల్ టోర్నీలు జరిగినప్పుడు ఇండియా తరఫున ట్వీట్లు పెడుతూనే ఉంటాడు. చెన్నై సూపర్ కింగ్స్ ధోని అంటే పిచ్చి.

ఇక దేవి సైతం స్పోర్ట్స్ లవరే కానీ మరీ ఈ స్థాయిలో కాదు. కారణం ఏదైనా ఈ కాంబో ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇచ్చేదే. ఇంకా అఫీషియల్ న్యూస్ రాలేదు కానీ దాదాపు ఖరారైనట్టేనని టాక్. మార్చి 31న ఐపీఎల్ ప్రారంభమవ్వొచ్చని క్రికెట్ వర్గాల న్యూస్. మే దాకా కొనసాగుతుంది. ఈసారి హైదరాబాద్ టీమ్ సమూల మార్పులకు దారి తీసింది. కీలక ఆటగాళ్లను వదులుకోవడం ఎలాంటి ప్రభావం చూపిస్తుందో చూడాలి. దేవి తమన్ లు కనక ఒక పవర్ ఫుల్ సిగ్నేచర్ సాంగ్ ఇచ్చారంటే అది సన్ రైజర్స్ కి శాశ్వతంగా మిగిలిపోతుంది. చూద్దాం ఎలాంటి పాట ఇస్తారో.

This post was last modified on March 10, 2023 10:28 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘సైన్యం గోల మ‌నకొద్దురా అయ్యా’ అని తండ్రి అంటే..

నూనూగు మీసాల నూత్న య‌వ్వ‌నంలోకి అడుగుపెట్టిన యువ‌కుడు.. దేశం కోసం జ‌రిగిన పోరాటంలో వీర‌మ‌రణం చెంది.. చెక్క పెట్టెలో పార్థివ…

12 minutes ago

తారక్ చరణ్ స్నేహానికి మరో సాక్ష్యం

నిన్న లండన్ రాయల్ అల్బర్ట్ హాల్ లో జరిగిన ఆర్ఆర్ఆర్ లైవ్ కన్సర్ట్ బ్రహ్మాండంగా జరిగింది. వేలాదిగా తరలి వచ్చిన…

44 minutes ago

చైనా తోక కత్తెరించేలా ఇస్రో నిఘా!

ఇప్పటివరకు శాంతియుత ప్రయోగాలతో ఆకట్టుకున్న ఇస్రో, ఇప్పుడు భద్రతా వ్యూహాల విషయంలోనూ కీలకంగా మారుతోంది. దేశ సరిహద్దులు, సముద్ర తీరాలు,…

45 minutes ago

వలంటీర్లకు శిక్షణ ఇచ్చారంట, బిల్ – రూ.272 కోట్ల

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాను సీఎంగా ఉండగా… ఏపీ ప్రజలకు ఓ అద్భుతమైన వ్యవస్థను అందించానని,…

1 hour ago

అనురాగ్ క‌శ్య‌ప్ కూతురి పెళ్లికి డ‌బ్బు లేదంటే..

బాలీవుడ్లో గ్యాంగ్స్ ఆఫ్ వ‌స్సీపూర్ స‌హా కొన్ని గొప్ప సినిమాలు తీసి మేటి ద‌ర్శ‌కుల్లో ఒక‌డిగా పేరు తెచ్చుకున్నాడు అనురాగ్…

2 hours ago

ర‌జినీకి న‌చ్చిన స్టోరీని మార్చేసిన లోకేష్‌

లోకేష్ క‌న‌క‌రాజ్.. ప్ర‌స్తుతం సౌత్ ఇండియాలో మోస్ట్ వాంటెడ్ డైరెక్ట‌ర్ల‌లో ఒక‌డు. ఖైదీ, విక్ర‌మ్ లాంటి చిత్రాల‌తో అత‌ను తిరుగులేని…

3 hours ago