Movie News

నాగ్ సినిమా తెరవెనుక ట్విస్టులు

ఒక్కోసారి స్క్రీన్ ముందు కనిపించే ట్విస్టుల కన్నా వెనుక జరిగేవి మహా ఇంటరెస్టింగ్ గా ఉంటాయి. నాగార్జున హీరోగా రచయిత బెజవాడ ప్రసన్న కుమార్ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ ఓ ప్రాజెక్ట్ లాకైన సంగతి తెలిసిందే. ఇది 2019లో వచ్చిన మలయాళం సూపర్ హిట్ పోరింజు మరియం జొస్ కు రీమేక్. హక్కులను అఫీషియల్ గానే కొన్నారు. ఈ వ్యవహారం అభిషేక్ అగర్వాల్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ భాగస్వాములుగా ఉన్నప్పుడు జరిగింది. కానీ రైట్స్ అగర్వాల్ పేరు మీద కొనుగోలు చేశారు. ఒరిజినల్ వెర్షన్ ని యధాతథంగా తీస్తే వర్కౌట్ కాదని గుర్తించిన ప్రసన్న కీలక మార్పులు చేసుకున్నాడు.

నాగ్ పాత్రను రెండు వయసుల్లో చూపించడం, అందులో లేని కామెడీ ట్రాక్ ని జోడించడం, అల్లరి నరేష్ రాజ్ తరుణ్ క్యారెక్టర్లకు తగినంత స్కోప్ ఇవ్వడం లాంటివి చాలానే జరిగాయట. అయితే అంతకు ముందు కమిట్ మెంట్ల ప్రకారం ఇది నిర్మాత చిట్టూరి శ్రీనుకి చేయాల్సి వచ్చింది. కానీ అభిషేక్ అగర్వాల్ దానికి ఇష్టపడకపోవడంతో హక్కుల బదలాయింపు మధ్యలోనే ఆగిపోయింది. తీరా చూస్తే నిన్న ఉన్నట్టుండి అభిషేక్ బృందం నుంచి మరియం రీమేక్ ప్రకటన వచ్చేయడంతో అభిమానులు కన్ఫ్యూజ్ అయ్యారు. ఇది వేరేదా లేక ప్రసన్న కుమార్ పూర్తిగా కొత్త కథ రాసుకుని ఇదే తరహా బ్యాక్ డ్రాప్ పెట్టుకుంటాడా అంతు చిక్కలేదు.

ఈ తాజా అనౌన్స్ మెంట్ తో స్టోరీ వేరే మలుపులు తిరిగింది. ఫైనల్ గా నాగార్జున ప్రసన్న కలయికలో రాబోయేది రీమేకా ఫ్రెష్శానేది తేలాలంటే వేచి చూడాలి. అసలే అక్కినేని అభిమానులు దీని మీద బోలెడు ఆశలు పెట్టుకున్నారు. అల్లరి అల్లుడు, ప్రెసిడెంట్ గారి పెళ్ళాం, సోగ్గాడే చిన్ని నాయనా రేంజ్ విలేజ్ మాస్ చూడొచ్చని వెయిట్ చేస్తున్న టైంలో ఇప్పుడీ ఝలక్ వచ్చి పడింది. అందుకే ఓపెనింగ్ చేయలేదనే టాక్ కూడా ఉంది. ఇలాంటి ఇష్యూస్ రావడం సహజమే కానీ లోలోపల మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కారమయ్యేవి. మరి దీనికేం చేస్తారో వేచి చూడాలి. డెబ్యూతోనే ప్రసన్నకు సవాళ్లు మొదలయ్యాయి.

This post was last modified on March 10, 2023 10:18 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

నెట్ ఫ్లిక్స్ ఒకవైపు… డాల్బీ సినిమా ఇంకోవైపు

టాలీవుడ్ కు సంబంధించి హైదరాబాద్ ఇవాళ రెండు కీలక ఘట్టాలకు సాక్ష్యంగా నిలబడుతోంది. నెట్ ఫ్లిక్స్ కార్యాలయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి…

2 hours ago

కాలర్ లాంటి కంటెంట్ ఉంటే చాలు

మార్చి 19 విడుదల కాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి 'మెడ ముట్టుకుంటే తొడ కొట్టినట్టే' పాట వచ్చినప్పుడు పాజిటివిటీ…

3 hours ago

‘అటవీశాఖ అధికారులను కిడ్నాప్ చెయ్యాలి’

అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో అటవీ శాఖ అధికారుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ…

4 hours ago

కష్టాల నాయకుడికి ‘ప్రైమ్’ షాకు ?

రాజకీయాలంటే అంతే. అడుగుపెట్టాక చాలా బురదను కడుక్కోవాల్సి ఉంటుంది. కొందరు తట్టుకుంటారు. కొందరు వదిలేస్తారు. చిరంజీవి ప్రజారాజ్యం విషయంలో ఎక్కడైతే…

4 hours ago

పవన్ ఫ్యాన్స్ బాధ అర్థం చేసుకున్నారు

అభిమానులందు పవన్ అభిమానులు వేరయా అంటే అందులో అతిశయోక్తి ఏమీ లేదు. ఆయనకున్న లాయల్ ఫ్యాన్ బేస్ ఇండియా మొత్తంలో…

5 hours ago

అక్షయ్ కామెడీ… ఇప్పుడు పండుతుందా?

​బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తనకి ఎన్నో…

6 hours ago