ఒక్కోసారి స్క్రీన్ ముందు కనిపించే ట్విస్టుల కన్నా వెనుక జరిగేవి మహా ఇంటరెస్టింగ్ గా ఉంటాయి. నాగార్జున హీరోగా రచయిత బెజవాడ ప్రసన్న కుమార్ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ ఓ ప్రాజెక్ట్ లాకైన సంగతి తెలిసిందే. ఇది 2019లో వచ్చిన మలయాళం సూపర్ హిట్ పోరింజు మరియం జొస్ కు రీమేక్. హక్కులను అఫీషియల్ గానే కొన్నారు. ఈ వ్యవహారం అభిషేక్ అగర్వాల్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ భాగస్వాములుగా ఉన్నప్పుడు జరిగింది. కానీ రైట్స్ అగర్వాల్ పేరు మీద కొనుగోలు చేశారు. ఒరిజినల్ వెర్షన్ ని యధాతథంగా తీస్తే వర్కౌట్ కాదని గుర్తించిన ప్రసన్న కీలక మార్పులు చేసుకున్నాడు.
నాగ్ పాత్రను రెండు వయసుల్లో చూపించడం, అందులో లేని కామెడీ ట్రాక్ ని జోడించడం, అల్లరి నరేష్ రాజ్ తరుణ్ క్యారెక్టర్లకు తగినంత స్కోప్ ఇవ్వడం లాంటివి చాలానే జరిగాయట. అయితే అంతకు ముందు కమిట్ మెంట్ల ప్రకారం ఇది నిర్మాత చిట్టూరి శ్రీనుకి చేయాల్సి వచ్చింది. కానీ అభిషేక్ అగర్వాల్ దానికి ఇష్టపడకపోవడంతో హక్కుల బదలాయింపు మధ్యలోనే ఆగిపోయింది. తీరా చూస్తే నిన్న ఉన్నట్టుండి అభిషేక్ బృందం నుంచి మరియం రీమేక్ ప్రకటన వచ్చేయడంతో అభిమానులు కన్ఫ్యూజ్ అయ్యారు. ఇది వేరేదా లేక ప్రసన్న కుమార్ పూర్తిగా కొత్త కథ రాసుకుని ఇదే తరహా బ్యాక్ డ్రాప్ పెట్టుకుంటాడా అంతు చిక్కలేదు.
ఈ తాజా అనౌన్స్ మెంట్ తో స్టోరీ వేరే మలుపులు తిరిగింది. ఫైనల్ గా నాగార్జున ప్రసన్న కలయికలో రాబోయేది రీమేకా ఫ్రెష్శానేది తేలాలంటే వేచి చూడాలి. అసలే అక్కినేని అభిమానులు దీని మీద బోలెడు ఆశలు పెట్టుకున్నారు. అల్లరి అల్లుడు, ప్రెసిడెంట్ గారి పెళ్ళాం, సోగ్గాడే చిన్ని నాయనా రేంజ్ విలేజ్ మాస్ చూడొచ్చని వెయిట్ చేస్తున్న టైంలో ఇప్పుడీ ఝలక్ వచ్చి పడింది. అందుకే ఓపెనింగ్ చేయలేదనే టాక్ కూడా ఉంది. ఇలాంటి ఇష్యూస్ రావడం సహజమే కానీ లోలోపల మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కారమయ్యేవి. మరి దీనికేం చేస్తారో వేచి చూడాలి. డెబ్యూతోనే ప్రసన్నకు సవాళ్లు మొదలయ్యాయి.
This post was last modified on March 10, 2023 10:18 am
టీడీపీ అధినేత చంద్రబాబుకు.. బిగ్ బ్రేక్ వచ్చింది. ఇప్పటి వరకు కేంద్రంలోని పెద్దలు ఎవరూ.. ముఖ్యంగా బీజేపీ అగ్రనాయకులుగా ఉన్నవారు…
ఏపీలో సంచలనం చోటు చేసుకుంది. ఎన్నికల వేళ అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఇప్పటికే చాలా మంది…
ఏపీలో ఎన్నికలకు మరో వారం రోజులు మాత్రమే గడువు ఉంది. ఈ నెల 13న అంటే వచ్చే సోమవారం.. ఎన్నికల…
‘ఆర్ఆర్ఆర్’ తర్వాత మెగా పవర్ స్టార్ ఆలస్యం చేయకుండా శంకర్ దర్శకత్వంలో ‘గేమ్ చేంజర్’ మొదలుపెట్టేశాడని చాలా సంతోషించారు మెగా…
కేంద్ర మంత్రి, బీజేపీ అగ్రనేత.. అమిత్ షా.. ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్పై సంచలన వ్యాఖ్యలు చేశా రు.…
ఈ ఏడాది పాన్ ఇండియా స్థాయిలో మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో ‘పుష్ప: ది రూల్’ ఒకటి. ‘పుష్ప: ది రైజ్’తో…