Movie News

కాజల్ తన కొడుక్కి చూపించే తొలి సినిమా?


టాలీవుడ్ చరిత్రలోనే చాలా పెద్ద రేంజికి వెళ్లిన కథానాయికల్లో కాజల్ అగర్వాల్. చిరంజీవి, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్.. ఇలా టాలీవుడ్లో చాలామంది టాప్ స్టార్లతో ఆమె సినిమాలు చేసింది. తమిళం, హిందీల్లోనూ పెద్ద పెద్ద హీరోలతో జట్టు కట్టింది. దాదాపు దశాబ్దంన్నర పాటు హవా సాగించిన కాజల్.. ఇంకా అవకాశాలు వస్తున్న టైంలోనే కరోనా బ్రేక్‌లో ఉన్నట్లుండి తన స్నేహితుడు గౌతమ్ కిచ్లును పెళ్లాడేసింది.

కాజల్ పెళ్లే అభిమానులకు పెద్ద షాక్ అంటే.. చాలా త్వరగా ఒక బిడ్డను కూడా కనేసిందామె. ఆమెకు గత ఏడాది కొడుకు పుట్టిన సంగతి తెలిసిందే. ఆ బాబుకి నీల్ అనే పేరు పెట్టుకున్నారు కాజల్ దంపతులు. ప్రస్తుతం బుడి బుడి అడుగులు వేస్తున్న నీల్‌తో చాలా సంతోషంగా గడుపుతున్న కాజల్.. రాబోయే కాలంలో తన కొడుకు విషయంలో ఎలా వ్యవహరించబోతున్నానో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది.

తన కొడుక్కి ఎనిమిదేళ్ల వయసు వచ్చే వరకు సినిమాలకు పూర్తిగా దూరంగా పెంచబోతున్నట్లు ఆమె చెప్పింది. తనకు ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ అన్నీ కూడా దూరంగా పెడుతున్నట్లు చెప్పింది. అంతే కాక తన కొడుక్కి కాస్త ఊహ వచ్చాక తన సినిమాలు చూపిస్తానని.. అప్పుడు ముందుగా ‘తుపాకి’ సినిమాను చూపిస్తానని ఆమె వెల్లడించింది. విజయ్ సరసన కాజల్ కథానాయికగా ఏస్ డైరెక్టర్ మురుగదాస్ రూపొందించిన ‘తుపాకి’ పెద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.

ఐతే కాజల్ కెరీర్లో పెర్ఫామెన్స్ పరంగా చూస్తే ‘మగధీర’, ‘సీత’ సహా చెప్పుకోదగ్గ సినిమాలు చాలానే ఉన్నాయి. కానీ ఆమె మాత్రం తాను చాలా మామూలు పాత్ర చేసిన ‘తుపాకి’ని చూపించాలనుకోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. ఈ సంగతిలా ఉంచితే.. కాజల్ త్వరలోనే టాలీవుడ్లో రీఎంట్రీకి రెడీ అవుతోంది. ఆమె అనిల్ రావిపూడి రూపొందిస్తున్న సినిమాలో నందమూరి బాలకృష్ణ సరసన నటించబోతోంది.

This post was last modified on March 8, 2023 2:56 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఐపీఎస్ సునీల్.. అలా రిటైర్ కావాల్సిందేనా?

వైసీపీ హయాంలో అప్పటి సీఎం జగన్ కనుసన్నల్లో పనిచేసిన అధికారులు రూల్స్‌ను పక్కన పెట్టి ఇష్టానుసారంగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి.…

3 hours ago

అమరావతిలో కొత్త నిర్ణయం: పేదలకు నష్టం లేకుండా మార్పు

జగన్ హయాంలో తీసుకున్న పలువురు నిర్ణయాలు రాష్ట్రాన్ని వెనక్కి నెట్టాయని, ముఖ్యంగా ఆర్థికంగానే కాకుండా రాజధాని పరంగా కూడా రాష్ట్రానికి…

4 hours ago

మరి కొద్ది గంటల్లో పెళ్లి.. అక్కచెల్లెళ్లు మృతి?

రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్‌పూర్ జిల్లా మనాయ్ గ్రామంలో శనివారం జరగాల్సిన వివాహ కార్యక్రమాలకు కొద్దిగంటల ముందు ఇద్దరు అక్కచెల్లెళ్లు అనుమానాస్పద…

4 hours ago

ప‌వ‌న్‌కు షారుఖ్ రేంజిలో ఇస్తామ‌న్నా..

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌క‌ట‌న‌లు చేస్తానంటే ఆయ‌న‌కు భారీ పారితోష‌కం ఇవ్వ‌డానికి బోలెడ‌న్ని కంపెనీలు ముందుకు వ‌స్తాయి. కానీ…

5 hours ago

కోర్టు హీరోయిన్ నెమ్మదిగా నడవాలంట

గత ఏడాది నాని నిర్మించిన కోర్టుతో పరిచయమైన హీరోయిన్ శ్రీదేవి అప్పల అందులో టీనేజ్ కొచ్చిన కాలేజీ అమ్మాయిగా నటనతో…

5 hours ago

సూపర్ 8లో టీమిండియాకు సఫారీ షాక్

టీ20 వరల్డ్ కప్ గ్రూప్ స్టేజ్ లో వరుస విజయాలతో దూసుకువచ్చిన టీమిండియాకు సూపర్ 8 ఆరంభంలోనే ఊహించని ఎదురుదెబ్బ…

6 hours ago