టాలీవుడ్ చరిత్రలోనే చాలా పెద్ద రేంజికి వెళ్లిన కథానాయికల్లో కాజల్ అగర్వాల్. చిరంజీవి, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్.. ఇలా టాలీవుడ్లో చాలామంది టాప్ స్టార్లతో ఆమె సినిమాలు చేసింది. తమిళం, హిందీల్లోనూ పెద్ద పెద్ద హీరోలతో జట్టు కట్టింది. దాదాపు దశాబ్దంన్నర పాటు హవా సాగించిన కాజల్.. ఇంకా అవకాశాలు వస్తున్న టైంలోనే కరోనా బ్రేక్లో ఉన్నట్లుండి తన స్నేహితుడు గౌతమ్ కిచ్లును పెళ్లాడేసింది.
కాజల్ పెళ్లే అభిమానులకు పెద్ద షాక్ అంటే.. చాలా త్వరగా ఒక బిడ్డను కూడా కనేసిందామె. ఆమెకు గత ఏడాది కొడుకు పుట్టిన సంగతి తెలిసిందే. ఆ బాబుకి నీల్ అనే పేరు పెట్టుకున్నారు కాజల్ దంపతులు. ప్రస్తుతం బుడి బుడి అడుగులు వేస్తున్న నీల్తో చాలా సంతోషంగా గడుపుతున్న కాజల్.. రాబోయే కాలంలో తన కొడుకు విషయంలో ఎలా వ్యవహరించబోతున్నానో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది.
తన కొడుక్కి ఎనిమిదేళ్ల వయసు వచ్చే వరకు సినిమాలకు పూర్తిగా దూరంగా పెంచబోతున్నట్లు ఆమె చెప్పింది. తనకు ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ అన్నీ కూడా దూరంగా పెడుతున్నట్లు చెప్పింది. అంతే కాక తన కొడుక్కి కాస్త ఊహ వచ్చాక తన సినిమాలు చూపిస్తానని.. అప్పుడు ముందుగా ‘తుపాకి’ సినిమాను చూపిస్తానని ఆమె వెల్లడించింది. విజయ్ సరసన కాజల్ కథానాయికగా ఏస్ డైరెక్టర్ మురుగదాస్ రూపొందించిన ‘తుపాకి’ పెద్ద బ్లాక్బస్టర్గా నిలిచిన సంగతి తెలిసిందే.
ఐతే కాజల్ కెరీర్లో పెర్ఫామెన్స్ పరంగా చూస్తే ‘మగధీర’, ‘సీత’ సహా చెప్పుకోదగ్గ సినిమాలు చాలానే ఉన్నాయి. కానీ ఆమె మాత్రం తాను చాలా మామూలు పాత్ర చేసిన ‘తుపాకి’ని చూపించాలనుకోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. ఈ సంగతిలా ఉంచితే.. కాజల్ త్వరలోనే టాలీవుడ్లో రీఎంట్రీకి రెడీ అవుతోంది. ఆమె అనిల్ రావిపూడి రూపొందిస్తున్న సినిమాలో నందమూరి బాలకృష్ణ సరసన నటించబోతోంది.
ప్రేమికుల నుంచి నిజ జీవిత భార్యాభర్తలుగా మారిన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించిన ప్యాన్ ఇండియా మూవీ…
సంక్రాంతి తర్వాత వెలవెలబోయిన టాలీవుడ్ బాక్సాఫీస్లో మళ్లీ కళ తెచ్చే సినిమా అవుతుందని అందరూ ‘పెద్ది’ మీదే ఆశలు పెట్టుకున్నారు.…
మలయాళంతో పాటు తెలుగులోనూ మంచి విజయం సాధించిన మూవీ ప్రేమలు. దీంట్లో జంటగా నటించిన నస్లెన్, మమిత బైజు ఎంత…
కంటెంట్ ఉంటే చాలు ప్రేక్షకులు బడ్జెట్, స్టార్ క్యాస్టింగ్ పట్టించుకోరని ప్రతి భాషలో రుజువవుతూనే ఉంది. మన దగ్గర బలగం,…
సాంకేతికంగా మనిషి ఎన్నో అద్భుతాలను సృష్టించాడు. వాటిని తన జీవన విధానంలో భాగం చేసుకున్నాడు. సుఖమయ జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. అయితే…
ఏపీలోని కూటమి సర్కారు ఇటీవలే నిర్వహించిన మెగా డీఎస్సీపై విపక్ష వైసీపీ బారీ అవినీతి ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే.…