బాలీవుడ్ లో అత్యంత విజయవంతమైన సీక్వెల్స్ లో ధూమ్ ది ప్రత్యేక స్థానం. దొంగతనాలు చేసే విలన్ ని హీరోగా చూపించి అసలు కథానాయకుడిని సైడ్ ఆర్టిస్టుగా మార్చి ఆడియన్స్ ని మెప్పించడంలో దీని శైలినే వేరు. అభిషేక్ బచ్చన్ కెరీర్ లో కాస్త గట్టిగా చెప్పుకునే బ్లాక్ బస్టర్ ఏదైనా ఉందంటే అది ఇదే. కానీ ఈ సిరీస్ లో నెగటివ్ షేడ్స్ చేసిన జాన్ అబ్రహం, హృతిక్ రోషన్, అమీర్ ఖాన్ లకు వచ్చిన పేరు కంటే ఇది తక్కువే. అంతగా ఈ రాబరీ డ్రామా ప్రేక్షకులను కట్టి పడేసింది. ఇప్పుడీ ధూమ్ నాలుగో భాగం తెరకెక్కబోతోంది. ఆషామాషీ కాంబినేషన్ తో మాత్రం కాదండోయ్.
ఇటీవలే పఠాన్ రూపంలో తమ సంస్థకే కాక నార్త్ ఇండస్ట్రీ మొత్తానికి వెయ్యి కోట్ల సినిమా అందించిన సిద్దార్థ్ ఆనంద్ కే యష్ రాజ్ ఫిలింస్ నిర్మాణ బాధ్యతను అప్పగించింది. ఈసారి చోరుడిగా షారుఖ్ ఖాన్ నటించబోతున్నాడు. ఈ మేరకు డైరెక్టర్ అధికారికంగా ట్వీట్ పెట్టేశాడు. 2024 క్రిస్మస్ కానుకగా విడుదల చేసేలా ప్లానింగ్ జరుగుతోంది. సిద్దార్థ్ ఆనంద్ ఇటీవలే హృతిక్ దీపికా పదుకునేలతో ఫైటర్ ని పూర్తి చేశాడు. వచ్చే ఏడాది జనవరి 25 రిలీజ్ కానుంది. ఇది కూడా యాక్షన్ ఎంటర్ టైనరే. పోస్ట్ ప్రొడక్షన్ కోసం ఎక్కువ సమయం కేటాయించబోతున్నారు.
ధూమ్ 1,2 దర్శకత్వం వహించింది సంజయ్ గద్వి. ఈ రెండింటితో పోలిస్తే మూడోది ఆ స్థాయిలో అనిపించదు. దీన్ని తీసింది విజయ్ కృష్ణ ఆచార్య. వీళ్ళను కాదని యష్ అధినేతలు సిద్దార్థ్ ఆనంద్ కి ధూమ్ 4 ఇవ్వడం చూస్తే క్రేజ్ ని ఏ స్థాయిలో క్యాష్ చేసుకోవడానికి ప్లాన్ చేశారో అర్థం చేసుకోవచ్చు. పఠాన్ లాంటి రెగ్యులర్ స్పై డ్రామానే నమ్మశక్యం కానీ ఎలివేషన్లతో యాక్షన్ ఎపిసోడ్స్ తో నింపేసిన సిద్దార్థ్ ఇప్పుడీ ధూమ్ ని చేతిలో పెడితే ఏ స్థాయిలో అరాచకం చేస్తారో వేరే చెప్పాలా. అన్నట్టు ఇతను ప్రభాస్ తోనూ ఒక ప్యాన్ ఇండియా మూవీ ప్లాన్ చేసుకున్నాడు. అదెప్పుడు ఉంటుందో.
This post was last modified on March 8, 2023 11:24 am
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…