పేరుకు ఉత్తరాది అమ్మాయే కానీ.. చాలా ఏళ్ల నుంచి హైదరాబాద్లోనే ఉంటోంది పూనమ్ కౌర్. చేసిన సినిమాలు తక్కువ.. అవి కూడా పెద్దగా పేరు తెచ్చిపెట్టలేదు కానీ.. వ్యక్తిగత విషయాలతో ఆమె ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. పవన్ కళ్యాణ్తో తన పేరు ముడిపడడం వల్లే పూనమ్కు ఎక్కువ పాపులారిటీ వచ్చిందనడంలో దాచిపెట్టేదేమీ లేదు.
ఈ విషయంలో రకరకాల ఊహాగానాలు, వివాదాలు ఉన్నాయి. ఈ మధ్య రాహుల్ గాంధీ లాంటి రాజకీయ నాయకులతో కలిసి కనిపించడం వల్ల పూనమ్ హైలైట్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా ఆమె తాను తెలంగాణ అమ్మాయినే అని పేర్కొంటూ.. కానీ తనను తెలుగు సినీ పరిశ్రమలో ఎదగకుండా తొక్కేస్తున్నారని వ్యాఖ్యానించడం విశేషం.
“నేను ఒక పంజాబీని కావడం.. సిక్కు మతం నుంచి రావడం వల్ల మీడియా వాళ్లు ఎప్పుడూ పంజాబీ పిల్ల అంటూ ఉంటారు. కానీ నేనేమంటానంటే.. నేను పుట్టి పెరిగింది ఇక్కడే. కల్చర్ ఇక్కడే. నన్ను ఎందుకు అందరూ సెపరేట్గా చూస్తారు. పంజాబీ పంజాబీ అని ఎందుకు అంటారు? నాకు ఇండస్ట్రీలో పని చేయాలని ఉంది. కానీ మీకు ఇష్టమైన అమ్మాయిలే పని చేయాలా? బాంబే నుంచి వచ్చిన అమ్మాయిలే పని చేయాలా? తెలుగు అమ్మాయి.. తెలుగుబిడ్డ.. సావిత్రి అమ్మ అని చెప్తారు. కానీ ఇక్కడున్న బిడ్డల్ని ప్రోత్సహించరు? అది అసమంజసం కాదా? రాజకీయ స్వార్థం వల్ల చాలామంది అమ్మాయిలను తొక్కేస్తున్నారు.. అందులో నేను కూడా ఒకదాన్ని” అంటూ తెలంగాణ రాజ్భవన్లో గవర్నర్ తమిళిసై, నటి ఖుష్బూ తదితరులు పాల్గొన్న కార్యక్రమానికి హాజరైన సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ పూనమ్ కౌర్ పేర్కొంది.
సెలబ్రెటీల కుటుంబాల్లో కొందరిలో ఎంతో ప్రతిభ ఉన్నప్పటికీ.. అది ఎప్పుడో కానీ బయటికి రాదు. ఎప్పుడూ మామూలుగా కనిపించే వ్యక్తులు..…
రిలీజైన రోజు నుంచి వీకెండ్ దాకా చెడుగుడు ఆడేసిన లెనిన్ ఎట్టకేలకు అఖిల్ కెరీర్ లో ఒక హిట్టుని చేర్చేసింది.…
టాలీవుడ్ అగ్రశ్రేణి డ్యాన్స్ మాస్టర్లు ఇద్దరి మధ్య వివాదం రాజుకుంది. జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ మధ్య ఘర్షణ చోటు…
టాలీవుడ్ ప్యాన్ ఇండియా సినిమాల వ్యవహారం అదిగో పులి ఇదిగో తోక కథలా మారిపోయింది. ఒక డేట్ వేయడం, దానికి…
మలయాళ హీరో అయినప్పటికీ సలార్ నుంచి పృథ్విరాజ్ సుకుమారన్ కు మన దగ్గర కూడా ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ నమ్మకంతోనే…
ఘట్టమనేని మూడో తరం నుంచి మొదటి వారసుడు జయకృష్ణ తొలి సినిమా శ్రీనివాస మంగాపురం జూలై 30 విడుదలకు రెడీ…