‘మీ టూ’ ఉద్యమం తర్వాత ఎంతోమంది సెలబ్రెటీ లేడీస్ తమకు ఎదురైన లైంగిక వేధింపుల అనుభవాల గురించి ఓపెన్ అయ్యారు. కొందరు ఈ ఉద్యమాన్ని వాడుకుని తప్పుడు ఆరోపణలు చేశారనే చర్చ కూడా జరిగినప్పటికీ.. మెజారిటీ మహిళలు తమకు జరిగిన అన్యాయాల గురించి ధైర్యంగా బయటికి చెప్పడం మంచి పరిణామం అనే చెప్పాలి. సినిమా హీరోయిన్లు ఎక్కువగా తమ ప్రొఫెషన్లో అవకాశాల పేరుతో తమను ఎలా వేధించారో చెప్పుకున్నారు.
ఐతే ఇప్పుడు ఓ సీనియర్ హీరోయిన్.. తన ఇంట్లో, అది కూడా తన తండ్రి ద్వారా లైంగిక వేధింపులు ఎదుర్కొన్న విషయాన్ని బయటపెట్టడం చర్చనీయాంశంగా మారింది. రాజకీయాల్లోకి కూడా అడుగు పెట్టి డేరింగ్ లేడీగా పేరు తెచ్చుకున్న ఖుష్బు.. ఇన్నేళ్ల తర్వాత తన చిన్నతనంలో ఎదురైన చేదు అనుభవాల గురించి మాట్లాడడం అందరికీ ఆశ్చర్యం కలిగిస్తోంది.
“చిన్నతనంలో లైంగిక వేధింపులు ఎదుర్కొన్న అమ్మాయిలైనా.,. అబ్బాయిలైనా జీవితాంతం బాధ పడుతూనే ఉంటారు. నా తల్లి భయంకరమైన వైవాహిక జీవితాన్ని అనుభవించింది. ఆమె భర్త.. భార్యను, పిల్లల్ని కొట్టడం.. తన ఏకైక కుమార్తెను లైంగికంగా వేధించడం జన్మహక్కుగా భావించిన వ్యక్తి. అతను నాపై లైంగిక దాడి చేసేటప్పటికి నా వయసు కేవలం ఎనిమిదేళ్లు. ఐతే అతడికి వ్యతిరేకంగా మాట్లాడే ధైర్యం నాకు 15 ఏళ్ల వయసులో వచ్చింది. మొదట్లో ఈ విషయాన్ని చెబితే మా అమ్మ నమ్మదేమో అని భయం ఉండేది. ఎందుకంటే ఆమె ఏం జరిగినా భర్త దేవుడు అనే మైండ్ సెట్తో ఉండేది. అందుకే నాకు ఎదురైన అనుభవం గురించి ముందు ఎవరికీ చెప్పుకోలేదు. కానీ ఒక వయసు వచ్చాక ఇదంతా తట్టుకోవడం కష్టమై అతడికి ఎదురు తిరగడం మొదలుపెట్టా. దాంతో అతను ఉన్నపళంగా మమ్మల్ని వదిలేసి ఎటో వెళ్లిపోయాడు. దీంతో జీవనాధారం పోయి తర్వాతి రోజు తిండి దొరుకుతుందో లేదో తెలియని పరిస్థితిలో బతికాం. తర్వాత ధైర్యం కూడకట్టుకుని పరిస్థితులకు ఎదురుగా పోరాడటం నేర్చుకున్నా” అని ఖుష్బు తెలిపింది.
తమ భాషను, తమ సంస్కృతిని, తమ సామిత్యాన్ని గౌరవించుకోవడంలో మిగతా వాళ్లతో పోలిస్తే తెలుగు వాళ్లది ఎప్పుడూ వెనుకబాటే అన్న…
ఢిల్లీలో పర్యటిస్తున్న సీఎం చంద్రబాబుకు కేంద్రంలోని పెద్దలు బిగ్ ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఎన్డీయే కూటమిని మరింత బలోపేతం…
తమిళ నటి వరలక్ష్మి శరత్ కుమార్.. ఇటీవల వరుసగా వివాదాల్లో చిక్కుకుంటోంది. వరలక్ష్మి స్వీయ దర్శకత్వంలో రూపొందించిన ‘సరస్వతి’ సినిమాకు…
జనసేన అధినేత పవన్ కల్యాణ్.. తన వ్యూహాన్ని దాదాపు తేల్చేశారు. రాజకీయంగా తనకు ఉన్న లక్ష్యాన్ని కూడా వివరించారు. దేశాన్ని…
ఇప్పుడంతా అప్ డేటెడ్ వెర్షన్లే వినిపిస్తున్నాయి. వ్యవహారికంతో పాటుగా పాలిటిక్స్ లోనూ నయా తరం వచ్చేసింది. ఆ ఫలితమే జన్…
మెగా డీఎస్సీ పరీక్షలు జరిగి దాదాపు ఏడాది అవుతోంది. సెలెక్ట్ అయిన అభ్యర్థులు ఉద్యోగాల్లో చేరి ఆరు నెలలు దాటిపోయింది.…