ఇండస్ట్రీలో ఏ హీరోనైనా నడిపించేది సక్సెస్ మాత్రమే. అది బలంగా ఉందా ఆఫర్లు వస్తుంటాయి. లేదూ అంటే త్వరగా తట్టాబుట్టా సర్దుకోవడమో లేదా సపోర్టింగ్ ఆర్టిస్టుగా మారడమో చేయాల్సి ఉంటుంది. కానీ కొందరు అదృష్టవంతులు ఉంటారు. హిట్టు ఫ్లాపుతో సంబంధం లేకుండా నిర్మాతలు పెట్టుబడులతో రెడీ అవుతారు. థియేటర్లలో ఆడినా ఆడకపోయినా డబ్బింగ్, శాటిలైట్ తదితర హక్కుల రూపంలో ఈజీగా రికవర్ అవ్వొచ్చనే నమ్మకంతో వరసగా సినిమాలు తీస్తుంటారు. డైలాగ్ కింగ్ సాయికుమార్ అబ్బాయి ఆది సాయికుమార్ దీనికి మంచి ఉదాహరణగా నిలుస్తున్నాడు.
ఈ వారం ఇతని కొత్త చిత్రం సిఎస్ఐ సనాతన్ రిలీజ్ కాబోతోంది. బాక్సాఫీస్ వద్ద అసలేమాత్రం పోటీ లేదు. క్రైమ్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ఈ సినిమాకు బజ్ కూడా జీరోనే. ఈ మూడు నాలుగు రోజుల్లో ప్రమోషన్లు స్పీడ్ పెంచి ఏమైనా హైప్ తీసుకొస్తారేమో చూడాలి. గత ఏడాది 2022లో అదివి ఏకంగా అయిదు విడుదలయ్యాయి. అతిథిదేవోభవ, బ్లాక్, తీస్ మార్ ఖాన్, క్రేజీ ఫెలో, టాప్ గేర్ ఇవేవి కనీస స్థాయిలో ఆడియన్స్ ని మెప్పించలేకపోయాయి. కొన్ని అసలు వచ్చిన సంగతే జనాలకు గుర్తు రానంత తొందరగా మాయమయ్యాయి. సో సిఎస్ఐ సనాతన్ ఏదో అద్భుతం చేయాల్సిందే.
దీని తర్వాత కూడా వరసగా జంగల్, కిరాతక, అమరన్ ఇన్ ది సిటీ చాప్టర్ వన్ ముస్తాబవుతున్నాయి. ఇటీవలే ఆది డిజిటల్ డెబ్యూ చేశాడు. లావణ్య త్రిపాఠితో కలిసి పులి మేక వెబ్ సిరీస్ తో లాంచ్ అయ్యాడు. అది కూడా సోసోగానే రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇలా విజయం లేకుండా అది సాయికుమార్ చేస్తున్న పోరాటం గత పదేళ్లుగా కొనసాగుతూనే ఉంది. ప్రొడ్యూసర్లు వస్తూనే ఉండటమే ఆశ్చర్యం కలిగించే విషయం. ఓటిటి కాలంలో సక్సెస్ తో సంబంధం లేకుండా ఇంత బిజీగా ఉన్న యూత్ హీరో ఆది ఒక్కడేనేమో. ఈ ఫ్రైడే ఎలాంటి ఫలితం అందుకుంటాడో.
This post was last modified on March 7, 2023 8:03 am
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…
మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…