ఇండస్ట్రీలో ఏ హీరోనైనా నడిపించేది సక్సెస్ మాత్రమే. అది బలంగా ఉందా ఆఫర్లు వస్తుంటాయి. లేదూ అంటే త్వరగా తట్టాబుట్టా సర్దుకోవడమో లేదా సపోర్టింగ్ ఆర్టిస్టుగా మారడమో చేయాల్సి ఉంటుంది. కానీ కొందరు అదృష్టవంతులు ఉంటారు. హిట్టు ఫ్లాపుతో సంబంధం లేకుండా నిర్మాతలు పెట్టుబడులతో రెడీ అవుతారు. థియేటర్లలో ఆడినా ఆడకపోయినా డబ్బింగ్, శాటిలైట్ తదితర హక్కుల రూపంలో ఈజీగా రికవర్ అవ్వొచ్చనే నమ్మకంతో వరసగా సినిమాలు తీస్తుంటారు. డైలాగ్ కింగ్ సాయికుమార్ అబ్బాయి ఆది సాయికుమార్ దీనికి మంచి ఉదాహరణగా నిలుస్తున్నాడు.
ఈ వారం ఇతని కొత్త చిత్రం సిఎస్ఐ సనాతన్ రిలీజ్ కాబోతోంది. బాక్సాఫీస్ వద్ద అసలేమాత్రం పోటీ లేదు. క్రైమ్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ఈ సినిమాకు బజ్ కూడా జీరోనే. ఈ మూడు నాలుగు రోజుల్లో ప్రమోషన్లు స్పీడ్ పెంచి ఏమైనా హైప్ తీసుకొస్తారేమో చూడాలి. గత ఏడాది 2022లో అదివి ఏకంగా అయిదు విడుదలయ్యాయి. అతిథిదేవోభవ, బ్లాక్, తీస్ మార్ ఖాన్, క్రేజీ ఫెలో, టాప్ గేర్ ఇవేవి కనీస స్థాయిలో ఆడియన్స్ ని మెప్పించలేకపోయాయి. కొన్ని అసలు వచ్చిన సంగతే జనాలకు గుర్తు రానంత తొందరగా మాయమయ్యాయి. సో సిఎస్ఐ సనాతన్ ఏదో అద్భుతం చేయాల్సిందే.
దీని తర్వాత కూడా వరసగా జంగల్, కిరాతక, అమరన్ ఇన్ ది సిటీ చాప్టర్ వన్ ముస్తాబవుతున్నాయి. ఇటీవలే ఆది డిజిటల్ డెబ్యూ చేశాడు. లావణ్య త్రిపాఠితో కలిసి పులి మేక వెబ్ సిరీస్ తో లాంచ్ అయ్యాడు. అది కూడా సోసోగానే రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇలా విజయం లేకుండా అది సాయికుమార్ చేస్తున్న పోరాటం గత పదేళ్లుగా కొనసాగుతూనే ఉంది. ప్రొడ్యూసర్లు వస్తూనే ఉండటమే ఆశ్చర్యం కలిగించే విషయం. ఓటిటి కాలంలో సక్సెస్ తో సంబంధం లేకుండా ఇంత బిజీగా ఉన్న యూత్ హీరో ఆది ఒక్కడేనేమో. ఈ ఫ్రైడే ఎలాంటి ఫలితం అందుకుంటాడో.
ఇప్పుడు ప్రపంచంలో నంబర్ వన్ డైౌరెక్టర్ ఎవరు అని పోల్ పెడితే.. తిరుగులేని ఆధిక్యంతో క్రిస్టోఫర్ నోలనే గెలుస్తాడు అనడంలో…
గత శుక్రవారం ‘సింగ్గీతం’ చిత్రం విడుదల కావడానికి ముందు పెద్దగా బజ్ కనిపించలేదు. 94 ఏళ్ల వయసులో సింగీతం ఓపిగ్గా…
గత ఎన్నికల సమయంలో మంగళగిరిలోని ప్రతి వీధిలోనూ పర్యటించిన నారా లోకేష్.. అక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యను ప్రభుత్వం…
విడుదల ఎప్పుడు ఉంటుందో కానీ కల్కి 2 మీద అంచనాలు మాములుగా లేవు. కల్కి 2898 ఏడి గొప్ప విజయమే…
అక్కినేని నాగచైతన్య, దర్శకుడు విక్రమ్ కుమార్లది కల్ట్ కాంబినేషన్. వీరి కలయికలో వచ్చిన తొలి చిత్రం ‘మనం’ ఎంత పెద్ద…
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్న పరిస్థితి. సాధారణంగా జూన్ వచ్చిందంటే.. ఎండలు తగ్గుముఖం పట్టి..…