Movie News

అతడి వ్యాఖ్యలకు ఆమె క్షమాపణ

వెంకటేష్ మహా.. ఈ ఉదయం నుంచి తెలుగు సోషల్ మీడియా సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారిన పేరు. ‘కేరాఫ్ కంచరపాలెం’తో దర్శకుడిగా పరిచయం అయిన ఇతను.. తాజాగా ఇంద్రగంటి మోహనకృష్ణ, వివేక్ ఆత్రేయ, నందిని రెడ్డి, శివ నిర్వాణలతో కలిసి పాల్గొన్న ఒక రౌండ్ టేబుల్ చర్చా కార్యక్రమంలో కమర్షియల్ సినిమాల గురించి చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి.

బ్లాక్ బస్టర్ మూవీ ‘కేజీఎఫ్’లో లోపాల గురించి వెటకారంగా మాట్లాడడమే కాక.. కమర్షియల్ సినిమాలు తీయడం పెద్ద విషయమే కాదని, తాము కనుక ఇప్పుడు చేస్తున్న వైవిధ్యమైన సినిమాలు పక్కన పెట్టి ఒకసారి రంగంలోకి దిగితే ఇప్పుడు వస్తున్న కమర్షియల్ సినిమాలను మించి తీయగలమని అతను సవాలు విసిరాడు.

ఐతే తాము తీసే సినిమాల గురించి ఎన్ని గొప్పలు పోయినా ఓకే కానీ.. అందుకు కమర్షియల్ సినిమాలను కించపరిచేలా మాట్లాడాలా అంటూ నెటిజన్లు వెంకటేష్ మహా మీద విరుచుకుపడుతున్నారు. ఎక్కువమందికి నచ్చే సినిమాల మీద ఈ ఏడుపులేంటని వెంకటేష్‌ను ట్రోల్ చేస్తున్నారు. వెంకటేష్ ‘కేజీఎఫ్’ను తక్కువ చేసి మాట్లాడుతున్న సమయంలో ఇంద్రగంటి, వివేక్, నందిని, శివ గట్టిగా నవ్వడం పట్ల కూడా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నందిని ట్విట్టర్ వేదికగా వివరణ ఇచ్చింది. కమర్షియల్ సినిమాల్లో ప్రయత్నాన్ని ప్రేక్షకులు మెచ్చడం వల్లే ఆ సినిమాలు పెద్ద సక్సెస్ అవుతాయని.. తమ చర్చలో ఎవరినీ కించపరిచే ఉద్దేశం లేదని.. నిజానికి కమర్షియల్ సినిమా మీద ఒక సానుకూల చర్చనే తాము చేపట్టామని నందిని వెల్లడించింది.

ఎవరైనా ఇందుకు నొచ్చుకుని ఉంటే మన్నించాలని ఆమె కోరింది. ఐతే ప్రస్తుతం సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ చూస్తుంటే.. వెంకటేష్ మహాకే మున్ముందు చాలా కష్టం అయ్యేలా ఉంది. తన వ్యాఖ్యలపై అతను కూడా క్షమాపణలు చెప్పక తప్పేలా లేదు.

This post was last modified on March 6, 2023 10:03 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఐపీఎస్ సునీల్.. అలా రిటైర్ కావాల్సిందేనా?

వైసీపీ హయాంలో అప్పటి సీఎం జగన్ కనుసన్నల్లో పనిచేసిన అధికారులు రూల్స్‌ను పక్కన పెట్టి ఇష్టానుసారంగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి.…

2 hours ago

అమరావతిలో కొత్త నిర్ణయం: పేదలకు నష్టం లేకుండా మార్పు

జగన్ హయాంలో తీసుకున్న పలువురు నిర్ణయాలు రాష్ట్రాన్ని వెనక్కి నెట్టాయని, ముఖ్యంగా ఆర్థికంగానే కాకుండా రాజధాని పరంగా కూడా రాష్ట్రానికి…

3 hours ago

మరి కొద్ది గంటల్లో పెళ్లి.. అక్కచెల్లెళ్లు మృతి?

రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్‌పూర్ జిల్లా మనాయ్ గ్రామంలో శనివారం జరగాల్సిన వివాహ కార్యక్రమాలకు కొద్దిగంటల ముందు ఇద్దరు అక్కచెల్లెళ్లు అనుమానాస్పద…

3 hours ago

ప‌వ‌న్‌కు షారుఖ్ రేంజిలో ఇస్తామ‌న్నా..

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌క‌ట‌న‌లు చేస్తానంటే ఆయ‌న‌కు భారీ పారితోష‌కం ఇవ్వ‌డానికి బోలెడ‌న్ని కంపెనీలు ముందుకు వ‌స్తాయి. కానీ…

3 hours ago

కోర్టు హీరోయిన్ నెమ్మదిగా నడవాలంట

గత ఏడాది నాని నిర్మించిన కోర్టుతో పరిచయమైన హీరోయిన్ శ్రీదేవి అప్పల అందులో టీనేజ్ కొచ్చిన కాలేజీ అమ్మాయిగా నటనతో…

3 hours ago

సూపర్ 8లో టీమిండియాకు సఫారీ షాక్

టీ20 వరల్డ్ కప్ గ్రూప్ స్టేజ్ లో వరుస విజయాలతో దూసుకువచ్చిన టీమిండియాకు సూపర్ 8 ఆరంభంలోనే ఊహించని ఎదురుదెబ్బ…

4 hours ago