కొన్నిసార్లు కొందరు హీరోల సినిమాలతో పోటీ పడటం కంటే మరో రిలీజ్ డేట్ చేసుకొని పోస్ట్ పోన్ చేసుకోవడం ఉత్తమం. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రేక్షకుడు ఒకే రోజు రెండు సినిమాలు చూసేందుకు ఆసక్తి చూపించడం లేదు కూడా. అయితే కుర్ర హీరో కిరణ్ అబ్బవరం మాత్రం మాస్ మహారాజాకి పోటీ వెళ్తున్నాడు. కిరణ్ అబ్బవరం నటిస్తున్న ‘మీటర్’ సినిమా ఏప్రిల్ 7 న రిలీజ్ అవుతుంది. సరిగ్గా ఇదే రోజు రవితేజ సినిమా ‘రావణాసుర’ బరిలో ఉంది. ఇప్పటికే రిలీజ్ డేట్ తో రవితేజ సినిమాకు ప్రమోషన్స్ కూడా మొదలు పెట్టారు.
అయితే ఈ డేట్ మీద ముందు కర్చీఫ్ వేసింది రవితేజనే. వరుస హాలిడేస్ కలిసిరావడంతో ఇలా ప్లాన్ చేసుకున్నారు. అదే ఆలోచనలో కిరణ్ అబ్బవరం సినిమాను ఇటీవలే ఎనౌన్స్ చేశారు మేకర్స్. అయితే రవితేజతో ఇటీవలే యంగ్ హీరో నిఖిల్ పోటీ పడ్డాడు. రవితేజ ‘ధమాకా’ రిలీజైన రోజే నిఖిల్ ’18 పేజెస్’ తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. యావరేజ్ టాక్ తో ఓపెనయిన ధమాకా మొదటి రోజు నుండే మంచి వసూళ్లు అందుకుంది. ఫైనల్ రన్ లో 100 గ్రాస్ లిస్టులో చేరి బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. ‘ధమాకా’ తో పోటీ పడిన ’18 పేజెస్’ ఆశించిన విజయం అందుకోలేకపోయింది. రవితేజ వసూళ్ల ముందు నిఖిల్ సినిమా నిలబడలేకపోయింది.
ఇప్పుడు రవితేజ మంచి ఫామ్ లో ఉన్నాడు. ధమాకా , వాల్తేరు వీరయ్య తో బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ లు అందుకున్నాడు. దీంతో ఆటోమేటిక్ గానే రావణాసుర పై ఎక్స్ పెక్టేషన్స్ నెలకొంటున్నాయి. మరి కిరణ్ అబ్బవరం ఇప్పుడు మీటర్ సినిమాతో రవితేజకి ఎదురెళితే నిఖిల్ కి ఎదురైన పరిస్థితే రిపీట్ అవ్వొచ్చని కొందరు భావిస్తున్నారు. మీటర్ కి మైత్రి సపోర్ట్ ఉంది కాబట్టి థియేటర్స్ బాగానే దొరుకుతాయి. కానీ ఆ రోజు ప్రేక్షకులు కిరణ్ సినిమా కంటే ముందు రవితేజ సినిమాకే ఓటేసే ఛాన్స్ ఉంది. మరి కుర్ర హీరో మాస్ హీరోతో ఎలా నెగ్గుకొస్తాడో ?
This post was last modified on March 4, 2023 9:49 pm
కొందరు ఫిలిం మేకర్స్ తమ సినిమా కథేంటో చివరి వరకు దాచి పెట్టాలని ప్రయత్నిస్తారు. నేరుగా థియేటర్లలో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలనుకుంటారు.…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…