కొన్నిసార్లు కొందరు హీరోల సినిమాలతో పోటీ పడటం కంటే మరో రిలీజ్ డేట్ చేసుకొని పోస్ట్ పోన్ చేసుకోవడం ఉత్తమం. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రేక్షకుడు ఒకే రోజు రెండు సినిమాలు చూసేందుకు ఆసక్తి చూపించడం లేదు కూడా. అయితే కుర్ర హీరో కిరణ్ అబ్బవరం మాత్రం మాస్ మహారాజాకి పోటీ వెళ్తున్నాడు. కిరణ్ అబ్బవరం నటిస్తున్న ‘మీటర్’ సినిమా ఏప్రిల్ 7 న రిలీజ్ అవుతుంది. సరిగ్గా ఇదే రోజు రవితేజ సినిమా ‘రావణాసుర’ బరిలో ఉంది. ఇప్పటికే రిలీజ్ డేట్ తో రవితేజ సినిమాకు ప్రమోషన్స్ కూడా మొదలు పెట్టారు.
అయితే ఈ డేట్ మీద ముందు కర్చీఫ్ వేసింది రవితేజనే. వరుస హాలిడేస్ కలిసిరావడంతో ఇలా ప్లాన్ చేసుకున్నారు. అదే ఆలోచనలో కిరణ్ అబ్బవరం సినిమాను ఇటీవలే ఎనౌన్స్ చేశారు మేకర్స్. అయితే రవితేజతో ఇటీవలే యంగ్ హీరో నిఖిల్ పోటీ పడ్డాడు. రవితేజ ‘ధమాకా’ రిలీజైన రోజే నిఖిల్ ’18 పేజెస్’ తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. యావరేజ్ టాక్ తో ఓపెనయిన ధమాకా మొదటి రోజు నుండే మంచి వసూళ్లు అందుకుంది. ఫైనల్ రన్ లో 100 గ్రాస్ లిస్టులో చేరి బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. ‘ధమాకా’ తో పోటీ పడిన ’18 పేజెస్’ ఆశించిన విజయం అందుకోలేకపోయింది. రవితేజ వసూళ్ల ముందు నిఖిల్ సినిమా నిలబడలేకపోయింది.
ఇప్పుడు రవితేజ మంచి ఫామ్ లో ఉన్నాడు. ధమాకా , వాల్తేరు వీరయ్య తో బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ లు అందుకున్నాడు. దీంతో ఆటోమేటిక్ గానే రావణాసుర పై ఎక్స్ పెక్టేషన్స్ నెలకొంటున్నాయి. మరి కిరణ్ అబ్బవరం ఇప్పుడు మీటర్ సినిమాతో రవితేజకి ఎదురెళితే నిఖిల్ కి ఎదురైన పరిస్థితే రిపీట్ అవ్వొచ్చని కొందరు భావిస్తున్నారు. మీటర్ కి మైత్రి సపోర్ట్ ఉంది కాబట్టి థియేటర్స్ బాగానే దొరుకుతాయి. కానీ ఆ రోజు ప్రేక్షకులు కిరణ్ సినిమా కంటే ముందు రవితేజ సినిమాకే ఓటేసే ఛాన్స్ ఉంది. మరి కుర్ర హీరో మాస్ హీరోతో ఎలా నెగ్గుకొస్తాడో ?
This post was last modified on March 4, 2023 9:49 pm
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…