మంచు మనోజ్.. కర్నూలు జిల్లా పొలిటికల్ ఫ్యామిలీకి చెందిన భూమా మౌనికారెడ్డిని రెండో పెళ్లి చేసుకోబోతున్న విషయం కొన్ని నెలల కిందటే బయటికి వచ్చింది. ఐతే సడెన్గా నిన్న పెళ్లి కబురును బయటపెట్టి తన అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చాడు మనోజ్. నిన్న రాత్రే పెళ్లి జరిగింది. కాసేపటికే పెళ్లి ఫొటోలు బయటికి వచ్చాయి.
ఐతే ఆ ఫొటోల్లో మంచు ఫ్యామిలీ నుంచి కేవలం మనోజ్ అక్క లక్ష్మీప్రసన్న మాత్రమే కనిపించింది. ఎక్కడా మనోజ్ తల్లిదండ్రులు మోహన్ బాబు, నిర్మల కనిపించలేదు. అంతే కాక మనోజ్ అన్న మంచు విష్ణు, ఆయన సతీమణి.. ఇతర కుటుంబ సభ్యులు కూడా లేకపోవడంతో జనాలకు రకరకాల సందేహాలు కలిగాయి. ఈ పెళ్లి విషయంలో మోహన్ బాబు అసంతృప్తితో ఉన్నారని.. ఆయనకు పెళ్లి ఇష్టం లేదని.. అందుకే వివాహ వేడుకకు రాలేదని సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు జరిగిపోయాయి.
ఐతే మరుసటి రోజు ఉదయానికల్లా ఈ ప్రచారానికి తెరపడిపోయింది. ముందు రిలీజ్ చేసిన ఫొటోల్లో కనిపించని మోహన్ బాబు.. తర్వాతి రోజు బయటికి వచ్చిన ఫొటోల్లో కనిపించారు. తన సతీమణి నిర్మలతో కలిసి ఆయన వివాహ వేదిక ఎక్కారు. కొత్త జంటను ఆశీర్వదించారు. మోహన్ బాబును పట్టుకుని మౌనిక ఉద్వేగానికి గురవుతున్న ఫొటోలు కూడా బయటికి వచ్చాయి. ఈ వేడుకకు మంచు విష్ణు భార్యా పిల్లలతో కలిసి హాజరైన ఫొటోలు కూడా సోషల్ మీడియాలో ఇప్పుడు కనిపిస్తున్నాయి.
This post was last modified on March 4, 2023 3:01 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…