నేచురల్ స్టార్ నాని ఇప్పుడు ఏమంత గొప్ప ఫాంలో లేడు. అతడి చివరి సినిమా ‘అంటే సుందరానికీ’ ఓ మోస్తరు టాక్ తెచ్చుకుని కూడా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్గా నిలిచింది. అంతకుముందు వచ్చిన ‘శ్యామ్ సింగరాయ్’ ఓ మోస్తరుగా ఆడింది. ఇలాంటి ట్రాక్ రికార్డుతో నాని ఇప్పుడు ట్రేడ్ సర్కిల్లో సంచలనం రేపుతున్నాడు. అతడి కొత్త చిత్రం ‘దసరా’కు హైప్ రోజు రోజుకూ పెరిగిపోతోంది. నాని తొలిసారిగా పూర్తి స్థాయి డీగ్లామరస్ రోల్ చేసిన ఊర మాస్ సినిమా ‘దసరా’కు తెలుగు రాష్ట్రాల్లోనే కాక.. యుఎస్లో సైతం బిజినెస్ భారీగా జరిగింది. దీని రిలీజ్ కూడా పెద్ద హీరోల స్థాయిలో ఉండబోతోందన్నది స్పష్టం.
ఈసారి వేసవి బరిలో టాప్ స్టార్ల సినిమాలు ఏవీ లేవు. ఉన్న వాటిలో అత్యంత హైప్ ఉన్నది ‘దసరా’ చిత్రానికే. ఇప్పటిదాకా నాని చిత్రాలు వేటికీ 50 కోట్లకు మించి బిజినెస్ జరగలేదంటే.. దీనికి మాత్రం బిజినెస్ రూ.80 కోట్లు దాటిపోవడం విశేషం.
ఇక రిలీజ్ పరంగానూ నాని గత సినిమాల రికార్డులన్నింటినీ భారీ తేడాతో కొట్టేయబోతోంది ‘దసరా’. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 1500 స్క్రీన్లలో ఈ సినిమా రిలీజ్ కాబోతోందని అంచనా.
యుఎస్లో ఈ సినిమా రిలీజ్ లొకేషన్ల లెక్క చూసి అక్కడి ట్రేడ్ వర్గాలకు దిమ్మదిరిగిపోతోంది. ఏకంగా 500 ప్లస్ లొకేషన్లలో ఈ సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తోంది ప్రత్యాంగిర సినిమాస్ సంస్థ. టాలీవుడ్ టాప్ స్టార్ల సినిమాలకు ఏమాత్రం తీసిపోని రిలీజ్ ఇది. యుఎస్లో 500 ప్లస్ లొకేషన్లలో సినిమాలను రిలీజ్ చేసే హీరోలు టాలీవుడ్లో పట్టుమని పదిమంది కూడా లేరు. ఆ జాబితాలో నాని ఉండడం అంటే చిన్న విషయం కాదు.
పెద్ద స్టార్లు బరిలో లేని వేసవి సీజన్ను నాని ఎంత బాగా ఉపయోగించుకుంటున్నాడో చెప్పడానికి ఇది ఉదాహరణ. సినిమాకు పాజిటివ్ టాక్ రావాలే కానీ.. 2 మిలియన్ మార్కును తొలి వీకెండ్లోనే ఈ సినిమా టచ్ చేస్తే ఆశ్చర్యపోవాల్సిన పని లేదు.
This post was last modified on March 4, 2023 2:32 pm
బాలీవుడ్ లోనే కాదు భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదయిన సినిమాగా తెరకెక్కుతున్న రామాయణ పార్ట్ 1 టీజర్ ఇవాళ…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే లక్ష్యంతో గత నెల 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా భేటీ అయి.. దీనిపై…
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…