Movie News

దీపికా పదుకునేకు ఆస్కార్ ఆహ్వానం

ఇంకో తొమ్మిది రోజుల్లో జరగనున్న ఆస్కార్ సంబరానికి ఫ్యాన్స్ రెడీ అవుతున్నారు. ముఖ్యంగా భారతీయులు నాటు నాటుకి ఖచ్చితంగా అవార్డు వస్తుందనే నమ్మకంతో కౌంట్ డౌన్ మొదలుపెట్టేశారు. రాజమౌళి రామ్ చరణ్ తదితరులు ఇప్పటికే యుఎస్ ప్రమోషన్లలో బిజీగా ఉండగా ఇంకో రెండు రోజుల్లో జూనియర్ ఎన్టీఆర్, చంద్రబోస్ బయలుదేరబోతున్నారు. రాహుల్ సిప్లిగుంజ్ కాలభైరవలు ప్రయాణ ఏర్పాట్లలో ఉన్నారు. తెలుగు రాష్ట్రాల మూవీ లవర్స్ బహుశా ఎప్పుడూ లేనంత భారీ సంఖ్యలో ఈ ఈవెంట్ ని లైవ్ గా చూడబోతున్నారని ఒక అంచనా.

ఇదిలా ఉండగా ఇప్పుడీ వేడుకకు ప్రాజెక్ట్ కె హీరోయిన్ దీపికా పదుకునేకు ఆహ్వానం అందించింది. అయితే స్వీకరించడానికి కాదు లెండి. పురస్కార గ్రహీతల్లో ఒకరికి అందజేయడానికి. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. జెన్నిఫర్ కానెల్లి, అరియనా డీబోస్, సామ్యుల్ జాక్సన్, జోనాథన్ మేజర్స్ తదితర బృందంలో దీపికకు చోటు దక్కింది. తనతో ఎవరికి ఇప్పిస్తారనేది మాత్రం సస్పెన్స్. ముందే విజేతల వివరాలు బయటికి తెలిసే అవకాశం లేదు కాబట్టి ప్రత్యక్షంగా చూసే దాకా చెప్పలేం. ఈవెంట్ జరుగుతున్నపుడు యాంకర్ చెప్పాకే చూడాలి.

ఆస్కార్ 95లో ఈ గౌరవం అందుకున్న ఇండియన్ హీరోయిన్ దీపికనే. ప్రాజెక్ట్ కెతో టాలీవుడ్ కు పరిచయమవుతున్న ఈ బాలీవుడ్ భామకు తెలుగులో క్రేజీ ఆఫర్లు వస్తున్నాయి కానీ హిందీలోనే బిజీ ఉండటం వల్ల ఒప్పుకోలేకపోతోంది. ఎన్టీఆర్ 30కి సైతం అడిగారు కానీ ఈ కారణం వల్లే నో చెప్పింది. ప్రభాస్ మూవీలో రెగ్యులర్ హీరోయిన్ గా కాకుండా డిఫరెంట్ గెటప్ తో చాలా డెప్త్ ఉన్న క్యారెక్టర్ లో దర్శకుడు నాగ అశ్విన్ ప్రెజెంట్ చేయబోతున్నారు. ఇటీవలే హైదరాబాద్ లో ఓ కీలక షెడ్యూల్ పూర్తి చేసుకున్న దీపికా తిరిగి వేసవిలో జాయినవుతుంది.

This post was last modified on March 3, 2023 10:35 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

హీట్ పెంచేస్తున్న నభా.. శారీలోనూ ఇంత గ్లామరా?

టాలీవుడ్ ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. సాధారణంగా…

24 minutes ago

రామాయణ బృందం డిఫెండ్ అవుతోందా

అందరూ ఎదురు చూస్తున్న రామాయణ పార్ట్ 1 టీజర్ వచ్చేసింది. రెండు నిమిషాల ముప్పై ఎనిమిది సెకండ్ల వీడియో మొత్తం…

2 hours ago

దురంధర్ 2 మూడో వేట మొదలు

మొన్న సోమవారం నుంచి దురంధర్ ది రివెంజ్ ఆక్యుపెన్సీలు బాగా తగ్గిపోవడం ట్రేడ్ వర్గాలను ఆందోళనకు గురి చేశాయి. యాభై…

3 hours ago

మండలి చైర్మన్ నే కొట్టిన వైసీపీ మంత్రి ఎవరు?

ఏపీకి అమరావతి ఏకైక, శాశ్వత రాజధానిగా కొనసాగేందుకు అవసరమైన చట్ట సవరణలు సవ్యంగా ముగిసిన వేళ... అమరావతిని చిదిమేసేందుకు వైసీపీ చేసిన దాష్టీకం…

3 hours ago

లేడీ డైరెక్టర్ ట్రెండ్ సెట్ చేస్తుందా?

సినీ రంగంలో మహిళలు నటనలోకి పెద్ద సంఖ్యలోనే వస్తారు కానీ.. టెక్నికల్ సైడ్ వెళ్లే వాళ్లు తక్కువ. అందులోనూ దర్శకత్వం వైపు అడుగులు…

5 hours ago

చివరి బంతి వరకు ఆడబోతున్న పెద్ది

పెద్ది వాయిదా గురించి కథనాలు వస్తూనే ఉన్నాయి. లేట్ లేదని రాకాస ప్రమోషన్ వీడియోలో రామ్ చరణ్ స్వయంగా చెప్పినా…

5 hours ago