ఇంకో తొమ్మిది రోజుల్లో జరగనున్న ఆస్కార్ సంబరానికి ఫ్యాన్స్ రెడీ అవుతున్నారు. ముఖ్యంగా భారతీయులు నాటు నాటుకి ఖచ్చితంగా అవార్డు వస్తుందనే నమ్మకంతో కౌంట్ డౌన్ మొదలుపెట్టేశారు. రాజమౌళి రామ్ చరణ్ తదితరులు ఇప్పటికే యుఎస్ ప్రమోషన్లలో బిజీగా ఉండగా ఇంకో రెండు రోజుల్లో జూనియర్ ఎన్టీఆర్, చంద్రబోస్ బయలుదేరబోతున్నారు. రాహుల్ సిప్లిగుంజ్ కాలభైరవలు ప్రయాణ ఏర్పాట్లలో ఉన్నారు. తెలుగు రాష్ట్రాల మూవీ లవర్స్ బహుశా ఎప్పుడూ లేనంత భారీ సంఖ్యలో ఈ ఈవెంట్ ని లైవ్ గా చూడబోతున్నారని ఒక అంచనా.
ఇదిలా ఉండగా ఇప్పుడీ వేడుకకు ప్రాజెక్ట్ కె హీరోయిన్ దీపికా పదుకునేకు ఆహ్వానం అందించింది. అయితే స్వీకరించడానికి కాదు లెండి. పురస్కార గ్రహీతల్లో ఒకరికి అందజేయడానికి. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. జెన్నిఫర్ కానెల్లి, అరియనా డీబోస్, సామ్యుల్ జాక్సన్, జోనాథన్ మేజర్స్ తదితర బృందంలో దీపికకు చోటు దక్కింది. తనతో ఎవరికి ఇప్పిస్తారనేది మాత్రం సస్పెన్స్. ముందే విజేతల వివరాలు బయటికి తెలిసే అవకాశం లేదు కాబట్టి ప్రత్యక్షంగా చూసే దాకా చెప్పలేం. ఈవెంట్ జరుగుతున్నపుడు యాంకర్ చెప్పాకే చూడాలి.
ఆస్కార్ 95లో ఈ గౌరవం అందుకున్న ఇండియన్ హీరోయిన్ దీపికనే. ప్రాజెక్ట్ కెతో టాలీవుడ్ కు పరిచయమవుతున్న ఈ బాలీవుడ్ భామకు తెలుగులో క్రేజీ ఆఫర్లు వస్తున్నాయి కానీ హిందీలోనే బిజీ ఉండటం వల్ల ఒప్పుకోలేకపోతోంది. ఎన్టీఆర్ 30కి సైతం అడిగారు కానీ ఈ కారణం వల్లే నో చెప్పింది. ప్రభాస్ మూవీలో రెగ్యులర్ హీరోయిన్ గా కాకుండా డిఫరెంట్ గెటప్ తో చాలా డెప్త్ ఉన్న క్యారెక్టర్ లో దర్శకుడు నాగ అశ్విన్ ప్రెజెంట్ చేయబోతున్నారు. ఇటీవలే హైదరాబాద్ లో ఓ కీలక షెడ్యూల్ పూర్తి చేసుకున్న దీపికా తిరిగి వేసవిలో జాయినవుతుంది.
This post was last modified on March 3, 2023 10:35 am
కలిసి రాజకీయం చేయకపోయినా వైఎస్సార్సీపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య కొన్ని పోలికలు కనిపిస్తున్నాయి. అటు ఏపీలో, ఇటు తెలంగాణలో ఈ…
సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటూ.. తన సినిమాల ఈవెంట్లలో, ఇంటర్వ్యూల్లో హాట్ హాట్ కామెంట్లు చేస్తుంటాడు ప్రముఖ తెలుగు…
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు'తో ఇప్పుడు తప్పకుండా హిట్ కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. గతంలో 'గద్దలకొండ గణేష్'…
ఆదివారం రోజు అందులోనూ ప్రత్యేకంగా సాయంత్రం షోలకు ఆక్యుపెన్సీలు బాగుండటం సహజమే కానీ ఈవారం మాత్రం బయ్యర్లు ఆనందంతో మునిగిపోయేలా…
తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమలులో కీలక మార్పులు తెచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతుంది. కళాశాలలకు…
నీట్ ప్రశ్నపత్రం లీకేజీకి వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టిన ఢిల్లీ నిరసనలో ఉగ్రవాదుల కుట్ర కోణం బయట పడిందని ఢిల్లీ టాస్క్ఫోర్స్…