ఇంకో ఇరవై రోజుల్లో ఆర్ఆర్ఆర్ మొదటి యానివర్సరి వచ్చేస్తోంది. మన భారతీయలకు దాని మీద మళ్ళీ మళ్ళీ చూసే మోజు తగ్గిపోయింది కానీ అమెరికాలో మాత్రం ఇప్పట్లో ఈ సినిమాను వదిలేలా లేరు. ఆస్కార్ వేడుక దగ్గర పడుతున్న వేళ జక్కన్న సృష్టించిన ఈ మాయాజాలం యుఎస్ లో ఇంకా ప్రకంపనలు సృష్టిస్తూనే ఉంది. లాస్ యాంజిల్స్ లో ఉన్న అతి పెద్ద థియేటర్ లో స్పెషల్ స్క్రీనింగ్ వేస్తే మొత్తం హౌస్ ఫుల్ అయిపోయి షోకు ముందు క్యూలలో బారులు తీరిన జనాన్ని వీడియోల రూపంలో బయట పెట్టింది. ప్రపంచంలోనే అతి పెద్ద థియేటర్ ఇది.
మొత్తం 1647 సీటింగ్ కెపాసిటీ ఉన్న ఆ హాలులో వివిధ తరగతులు ఉన్నాయి. అన్ని నిండిపోవడం ఆశ్చర్యం కలిగించే విషయం. రాజమౌళి, రామ్ చరణ్, కీరవాణిలు ప్రత్యేకంగా హాజరై విచ్చేసిన వాళ్ళతో ముఖాముఖీ కూడా నిర్వహించారు. రాహుల్ సిప్లిగుంజ్, కాల భైరవలకు అకాడెమి నుంచి అధికారిక ఆహ్వానం అందాక నాటు నాటు పాటకు విజయావకాశాలు పెరిగినట్టు విశ్లేషకులు భావిస్తున్నారు. ఓ ఇంగ్లీష్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రామ్ చరణ్ మాట్లాడుతూ స్టేజి మీద లైవ్ పెర్ఫార్మన్స్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పడం అభిమానులను ఎగ్జైట్ మెంట్ కు గురి చేస్తోంది.
ఇటు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇండియా వైడ్ ఆర్ఆర్ఆర్ ని మార్చి 10న రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎలాగూ 12న ఆస్కార్ ఈవెంట్ జరుగుతుంది కాబట్టి ఒకవేళ అందరూ కోరుకున్నట్టు అవార్డు వస్తే కనక ఆ సంబరాలేవో నేరుగా సినిమా చూస్తూ థియేటర్లలోనే జరుపుకోవచ్చు. ఆ రోజు చెప్పుకోదగ్గ తెలుగు, బాలీవుడ్ రిలీజులు ఏవీ లేకపోవడంతో ఆడియన్స్ మరోసారి బ్రహ్మరధం పడతారనే అంచనాలు బలంగా ఉన్నాయి. టాలీవుడ్ స్థాయిలో పతాకస్థాయికి తీసుకెళ్లిన బాహుబలిని మించి ఇప్పుడీ ట్రిపులార్ ప్రభంజనం మాములుగా లేదు.
అగ్రరాజ్యం అమెరికాలో శాశ్వత నివాసం కోసం గ్రీన్ కార్డ్.. అత్యంత కీలకం. దీనిని సాధించడమే మహా యజ్ఞం చేసినంత పనిగా…
ఒకప్పుడు బంగారం నిల్వల విషయంలో కేజీఎఫ్ గురించి చర్చ జరిగేదని.. కానీ, ఇప్పుడు కర్నూలు జిల్లాలోని జొన్నగిరి గురించి దేశవ్యాప్తంగా…
వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి ఆర్కే రోజా అరెస్టు తప్పదా? ఆమెపై వచ్చిన ఆరోపణలకు సంబంధించిన నివేదిక రెడీ అయిందా?…
సూపర్ స్టార్ రజినీకాంత్ కొత్త సినిమా ఎట్లకేలకు ఖరారైంది. తన మిత్రుడే అయిన లెెజెండరీ నటుడు కమల్ హాసన్ నిర్మాణంలో…
విజయవాడలోని కృష్ణలంకకు చెందిన గాదె సాయికృష్ణ మిస్సింగ్ వ్యవహారం రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో తీవ్ర…
ప్రస్తుతం తెలుగులో ఉన్న ఉత్తమ గేయ రచయితల్లో అనంత శ్రీరామ్ ఒకరు. టీనేజీలో ఇంజినీరింగ్ చదువుతూ లిరిసిస్టుగా మారిన అనంత..…