ఇంకో ఇరవై రోజుల్లో ఆర్ఆర్ఆర్ మొదటి యానివర్సరి వచ్చేస్తోంది. మన భారతీయలకు దాని మీద మళ్ళీ మళ్ళీ చూసే మోజు తగ్గిపోయింది కానీ అమెరికాలో మాత్రం ఇప్పట్లో ఈ సినిమాను వదిలేలా లేరు. ఆస్కార్ వేడుక దగ్గర పడుతున్న వేళ జక్కన్న సృష్టించిన ఈ మాయాజాలం యుఎస్ లో ఇంకా ప్రకంపనలు సృష్టిస్తూనే ఉంది. లాస్ యాంజిల్స్ లో ఉన్న అతి పెద్ద థియేటర్ లో స్పెషల్ స్క్రీనింగ్ వేస్తే మొత్తం హౌస్ ఫుల్ అయిపోయి షోకు ముందు క్యూలలో బారులు తీరిన జనాన్ని వీడియోల రూపంలో బయట పెట్టింది. ప్రపంచంలోనే అతి పెద్ద థియేటర్ ఇది.
మొత్తం 1647 సీటింగ్ కెపాసిటీ ఉన్న ఆ హాలులో వివిధ తరగతులు ఉన్నాయి. అన్ని నిండిపోవడం ఆశ్చర్యం కలిగించే విషయం. రాజమౌళి, రామ్ చరణ్, కీరవాణిలు ప్రత్యేకంగా హాజరై విచ్చేసిన వాళ్ళతో ముఖాముఖీ కూడా నిర్వహించారు. రాహుల్ సిప్లిగుంజ్, కాల భైరవలకు అకాడెమి నుంచి అధికారిక ఆహ్వానం అందాక నాటు నాటు పాటకు విజయావకాశాలు పెరిగినట్టు విశ్లేషకులు భావిస్తున్నారు. ఓ ఇంగ్లీష్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రామ్ చరణ్ మాట్లాడుతూ స్టేజి మీద లైవ్ పెర్ఫార్మన్స్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పడం అభిమానులను ఎగ్జైట్ మెంట్ కు గురి చేస్తోంది.
ఇటు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇండియా వైడ్ ఆర్ఆర్ఆర్ ని మార్చి 10న రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎలాగూ 12న ఆస్కార్ ఈవెంట్ జరుగుతుంది కాబట్టి ఒకవేళ అందరూ కోరుకున్నట్టు అవార్డు వస్తే కనక ఆ సంబరాలేవో నేరుగా సినిమా చూస్తూ థియేటర్లలోనే జరుపుకోవచ్చు. ఆ రోజు చెప్పుకోదగ్గ తెలుగు, బాలీవుడ్ రిలీజులు ఏవీ లేకపోవడంతో ఆడియన్స్ మరోసారి బ్రహ్మరధం పడతారనే అంచనాలు బలంగా ఉన్నాయి. టాలీవుడ్ స్థాయిలో పతాకస్థాయికి తీసుకెళ్లిన బాహుబలిని మించి ఇప్పుడీ ట్రిపులార్ ప్రభంజనం మాములుగా లేదు.
This post was last modified on March 2, 2023 10:30 am
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…
దేశంలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…