ప్రస్తుతం కొన్ని సినిమాలు ప్రేక్షకులకు ఎందుకు నచ్చుతున్నాయో , ఎందుకు నచ్చడం లేదో అర్థం కాని పరిస్థితి కనిపిస్తుంది. క్రిటిక్స్ తక్కువ రేటింగ్స్ ఇచ్చినా కొన్ని సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లు రాబడుతున్నాయి. యావరేజ్ కంటెంట్ తో కూడా కొన్ని సినిమాలు ఆడియన్స్ ను మెప్పిస్తున్నాయి. ఆ లిస్టులో వాల్తేరు వీరయ్య కూడా ఉండనే ఉంది. సంక్రాంతి బరిలో వచ్చిన ఈ మెగా మూవీలో వింటేజ్ చిరును చూపించి మార్కులు కొట్టేశాడు బాబీ.
ఒకప్పటి చిరు వింటేజ్ కామెడీ వాడుకొని ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులను కూడా ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా చిరు కామెడీ టైమింగ్ ను పర్ఫెక్ట్ గా వాడుకొని ఓ బ్లాక్ బస్టర్ కొట్టేశాడు. నిజానికి వాల్తేరు వీరయ్య లో బాబీ తీసుకుంది రొటీన్ కథే. రొటీన్ రివేంజ్ యాక్షన్ డ్రామాకి తమ్ముడి సెంటిమెంట్ ఎటాచ్ చేశాడు. ఎమోషన్ పక్కన పెడితే సినిమాలో చిరు కామెడీ వర్కవుట్ అయింది.
ఇప్పుడు భోలా శంకర్ లో కూడా వీరయ్య స్టైల్ లోనే మంచి ఎంటర్టైన్ మెంట్ అందించబోతున్నాడట చిరు. ఈ సినిమాలో ముందే మంచి కామెడీ ప్లాన్ చేసుకున్నాడు మెహర్ రమేష్. తాజాగా వాల్తేరు వీరయ్య సక్సెస్ తర్వాత ఇంకొన్ని మార్పులు చేసి సిస్టర్ సెంటిమెంట్ తగ్గించి కామెడీ కి పెద్ద పీట వేశారట. శ్రీముఖి తో అలాగే మిగతా పాత్రలతో చిరు కామెడీ సీన్స్ బాగా వచ్చాయని తెలుస్తుంది.
ఖైదీ నెంబర్ 150 తర్వాత చిరు కొన్ని సినిమాలు చేసినా అందులో లేని చిరు వింటేజ్ కామెడీ వాల్తేరు వీరయ్య లో ఉండటంతో సినిమా సక్సెస్ అయ్యింది. అందుకే అందులో వర్కవుట్ అయిన కామెడీనే చిరు నమ్ముకొని భోలా శంకర్ లో మరోసారి రిపీట్ చేసి నవ్వించేందుకు రెడీ అవుతున్నాడు. సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ లో కూడా ఫన్ ఉండేలా ప్లాన్ చేసుకున్నాడట మెహర్ రమేశ్. చూడాలి బాబీ సక్సెస్ ఫార్ములాతో మెహర్ మెగా హిట్ కొడతాడా ? లేదా ?
యూపీలోని మహారాజ్గంజ్ జిల్లా నేపాల్ సరిహద్దులో సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్బీ) బలగాలకు ఒక విదేశీయుడు పట్టుబడటం దేశవ్యాప్తంగా కలకలం…
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా సినిమా ఫలితాన్ని తేల్చి చెప్పేది బాక్సాఫీస్ వసూళ్లే. అవి ఎంత ఘనంగా వచ్చాయనే దాన్ని బట్టే…
రాజకీయ వ్యూహకర్త నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన ప్రశాంత్ కిషోర్ (పీకే) ఆస్తుల వివరాలు ఇప్పుడు పాలిటిక్స్ లో హాట్…
తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాల్లో అక్కినేని వారిది ఒకటి. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది.…
టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…
ఏపీ సీఎం చంద్రబాబు కలల ప్రాజెక్టు.. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కేంద్ర ప్రభుత్వం `ప్రత్యేక`…