‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ నటించిన రెండు సినిమాలు తేడా కొట్టినా.. ఇప్పుడు అతడి లైనప్ ఆసక్తికరంగానే ఉంది. ‘ఆదిపురుష్’ సంగతి పక్కన పెట్టేస్తే.. సలార్, ప్రాజెక్ట్-కేలపై భారీ అంచనాలే ఉన్నాయి. వీటితో పాటు మారుతి సినిమాలో నటిస్తున్న ప్రభాస్.. ఆ తర్వాత ‘అర్జున్ రెడ్డి’ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలోనూ ఓ సినిమా చేయాల్సి ఉన్న సంగతి తెలిసిందే.
ఈ సినిమా అనౌన్స్ అయి చాలా కాలమే అయింది కానీ.. ప్రభాస్, సందీప్ కమిట్మెంట్ల వల్ల ఇది వెనక్కి వెళ్లిపోయింది. వచ్చే ఏడాది ఈ సినిమా మొదలవుతుందని అంచనా వేస్తున్నారు. ఈ చిత్రానికి ‘స్పిరిట్’ అనే టైటిల్ను మొదట్లోనే అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో ప్రభాస్ పోలీస్ పాత్ర చేయబోతున్నట్లు కూడా అప్పట్లో సమాచారం బయటికి వచ్చింది. అంతకుమించి ఈ సినిమా నుంచి చాలా కాలంగా ఏ అప్డేట్ లేదు.
ఐతే ఏడాదిగా ‘యానిమల్’ సినిమాలో బిజీగా ఉన్న సందీప్.. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ప్రభాస్ సినిమా గురించి స్పందించాడు. ‘‘ప్రభాస్తో రా అండ్ పవర్ ఫుల్ యాక్షన్ సినిమాల చేయాలని ఎప్పట్నుంచో అనుకుంటున్నా. అందుకు అనుగుణంగానే పవర్ ఫుల్ స్టోరీనే రాస్తున్నా. ఇది కచ్చితంగా ఒక రిఫ్రెషింగ్ మూవీ అవుతుంది. ప్రభాస్ నాతో చేసే సినిమా ఎలా ఉండాలని అభిమానులు కోరుకుంటారో.. అంతకుమించి ఉండేలా ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నాం’’ అని పేర్కొంటూ రెబల్ ఫ్యాన్స్లో ఎగ్జైట్మెంట్ పెంచేశాడు సందీప్.
ప్రస్తుతం సందీప్ చేస్తున్న ‘యానిమల్’ షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ చిత్రం ఈ ఏడాది ఆగస్టు 11న రిలీజ్ కావాల్సి ఉంది. రణబీర్ కపూర్ను ఇందులో తన స్టయిల్లో చాలా వయొలెంట్గా, పవర్ ఫుల్గా చూపించబోతున్నాడు సందీప్. ఈ చిత్రంలో రష్మిక మందన్నా కథానాయికగా నటిస్తోంది. ప్రభాస్ చేతిలో ఉన్న ప్రాజెక్టులన్నీ ఈ ఏడాదే పూర్తయ్యే అవకాశమున్న నేపథ్యంలో కొత్త ఏడాదిలో సందీప్ సినిమాను మొదలుపెట్టే అవకాశముంది.
This post was last modified on February 28, 2023 4:29 pm
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం.. బీఆర్ఎస్కు ఊహించని సంకటం ఎదురైంది. మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె.. కవిత.. పాత `టీఆర్ ఎస్`…
తండ్రుల వల్ల కానిది పిల్లలు చేసి చూపిస్తే అదో ఆనందం. నాగబాబు ప్రస్తుతం ఈ స్థితిని అనుభవిస్తున్నారు. నిర్మాతగా నాగబాబు…
సీనియర్ నటుడు రాజశేఖర్కు గోలీల ఫ్యాక్టరీ ఉందని.. దాని ద్వారా ప్రతి నెలా కోట్లు సంపాదిస్తున్నాడని సోషల్ మీడియాలో వీడియోలు…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్దత కల్పించే బిల్లుకు పార్లమెంటు ఉభయ సభలు ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఇక రాష్ట్రపతి ఆమోదమే…
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నోట నుంచి వచ్చిన మావిగన్ పైనే…
ఒకపక్క ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ మెల్లగా మొదలైపోతున్నాయి. ట్రాకర్స్ ఒక్కొకరుగా రంగంలోకి దిగుతున్నారు. ఏపీ తెలంగాణ డిస్ట్రిబ్యూటర్లు ఏ నిమిషంలో…