ఎంత స్టార్ హీరోయినైనా పదిహేనేళ్లకు పైగా పరిశ్రమలో మనుగడ సాగించడం చాలా కష్టం. ఒకప్పుడు సావిత్రి జమున లాంటి వాళ్ళకు సాధ్యమయ్యింది కానీ ఇప్పుడలా కుదరడం లేదు. అయినా సరే త్రిష, తమన్నాలు ఇప్పటికీ తమ ఇన్నింగ్స్ ని దిగ్విజయంగా కొనసాగిస్తున్నారు.
వీళ్లకు పెళ్లి కాకపోవడం చాలా ప్లస్ అయ్యింది. కానీ కాజల్ అగర్వాల్ కేసు వేరు. వివాహం జరిగాక ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా ఏకంగా తల్లి పాత్రలోకి కూడా వచ్చేసింది. ఈ కారణంగానే అప్పటికి వెయిటింగ్ లో ఉన్న కొందరు దర్శకులకు నో చెప్పాల్సి వచ్చింది.
బాబుకి సంబంధించిన బాధ్యతలు మెల్లగా తగ్గడంతో కొత్త సినిమాలు చేసేందుకు కాజల్ అగర్వాల్ ప్లాన్ చేసుకొంటోంది. బాలకృష్ణ దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్ లో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ లో తననే హీరోయిన్ గా తీసుకునే ఆలోచన చేస్తున్నట్టు తెలిసింది.
టాలీవుడ్ సీనియర్ హీరోలకు జోడిని సెట్ చేయడం డైరెక్టర్లకు పెద్ద సవాల్ గా మారుతోంది. ప్రతిసారి ఈ సమస్య రిపీట్ అవుతోంది. కాజల్ ఆల్రెడీ చిరంజీవి ఖైదీ నెంబర్ 150లో చేసింది. ఆచార్యలోనూ నటించింది కానీ చెప్పాపెట్టకుండా ఆ క్యారెక్టర్ ని తీసేయడం వేరే కథ
ప్రస్తుతం కాజల్ అగర్వాల్ చేతిలో ఉన్నది కమల్ హాసన్ ఇండియన్ 2 ఒకటే. అందులో తన వంతు భాగం పూర్తి చేసేందుకు త్వరలో సెట్లో అడుగుపెట్టనుంది. ఒక ప్రత్యేకమైన కేర్ టేకర్ ని బాబు కోసం తీసుకుని షూటింగులకు తీసుకెళ్లి ఎలాంటి ఇబ్బంది రాకుండా ప్లాన్ చేసుకుందట.
ఇవి కాకుండా రిలీజ్ కు రెడీగా ఉన్న కాజల్ సినిమాలు రెండు తమిళంలో రాబోతున్నాయి. వాటిలో ఒకటి దెయ్యంగా కూడా నటించింది. ఏళ్ళ తరబడి ల్యాబులో మగ్గుతున్న హిందీ క్వీన్ రీమేక్ మాత్రం బయటికి వచ్చే సూచనలు కనిపించడం లేదు. మొత్తానికి కాజల్ కెరీర్ మళ్ళీ ఊపందుకునేలా ఉంది
This post was last modified on February 26, 2023 2:26 pm
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా రూపొందుతున్న 'ఆదర్శ కుటుంబం' షూటింగ్ మంచి స్వింగ్ లో ఉంది. ముందుగా తీసుకున్న…
మరీ డెడ్ డ్రైగా మారిపోయిన తెలుగు రాష్ట్రాల థియేటర్లు పెద్ద సినిమాలు లేక అల్లాడిపోతున్నాయి. రెండు మూడు రోజులు ప్రమోషన్లతో…
తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా సాధించుకునేందుకు కొనసాగిన ఉద్యమం కొత్త పుంతలు తొక్కింది. యావత్తు తెలంగాణ వేదికగా సాగిన ఈ ఉద్యమంలో…
``రాజకీయ నేతలు.. ప్రజల కోసం పనిచేసేది తక్కువ.. సెక్స్ వీడియోలు చూసేది ఎక్కువ. కావాలంటే.. నా ఫోన్ సహా.. రాష్ట్రంలోని…
బద్రి లాంటి సూపర్ హిట్ మూవీతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు పూరి జగన్నాథ్. అరంగేట్రంలోనే అలాంటి హిట్ పడిందంటే ఇక…
తెలంగాణ ప్రభుత్వం ఆరుగురు సీనియర్ ఐపీఎస్ అధికారులకు డైరెక్టర్ జనరల్స్(డీజీ)గా పదోన్నతి కల్పించింది. వీరిలో మహేశ్ భగవత్, స్వాతి లక్రా,…