ఎంత స్టార్ హీరోయినైనా పదిహేనేళ్లకు పైగా పరిశ్రమలో మనుగడ సాగించడం చాలా కష్టం. ఒకప్పుడు సావిత్రి జమున లాంటి వాళ్ళకు సాధ్యమయ్యింది కానీ ఇప్పుడలా కుదరడం లేదు. అయినా సరే త్రిష, తమన్నాలు ఇప్పటికీ తమ ఇన్నింగ్స్ ని దిగ్విజయంగా కొనసాగిస్తున్నారు.
వీళ్లకు పెళ్లి కాకపోవడం చాలా ప్లస్ అయ్యింది. కానీ కాజల్ అగర్వాల్ కేసు వేరు. వివాహం జరిగాక ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా ఏకంగా తల్లి పాత్రలోకి కూడా వచ్చేసింది. ఈ కారణంగానే అప్పటికి వెయిటింగ్ లో ఉన్న కొందరు దర్శకులకు నో చెప్పాల్సి వచ్చింది.
బాబుకి సంబంధించిన బాధ్యతలు మెల్లగా తగ్గడంతో కొత్త సినిమాలు చేసేందుకు కాజల్ అగర్వాల్ ప్లాన్ చేసుకొంటోంది. బాలకృష్ణ దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్ లో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ లో తననే హీరోయిన్ గా తీసుకునే ఆలోచన చేస్తున్నట్టు తెలిసింది.
టాలీవుడ్ సీనియర్ హీరోలకు జోడిని సెట్ చేయడం డైరెక్టర్లకు పెద్ద సవాల్ గా మారుతోంది. ప్రతిసారి ఈ సమస్య రిపీట్ అవుతోంది. కాజల్ ఆల్రెడీ చిరంజీవి ఖైదీ నెంబర్ 150లో చేసింది. ఆచార్యలోనూ నటించింది కానీ చెప్పాపెట్టకుండా ఆ క్యారెక్టర్ ని తీసేయడం వేరే కథ
ప్రస్తుతం కాజల్ అగర్వాల్ చేతిలో ఉన్నది కమల్ హాసన్ ఇండియన్ 2 ఒకటే. అందులో తన వంతు భాగం పూర్తి చేసేందుకు త్వరలో సెట్లో అడుగుపెట్టనుంది. ఒక ప్రత్యేకమైన కేర్ టేకర్ ని బాబు కోసం తీసుకుని షూటింగులకు తీసుకెళ్లి ఎలాంటి ఇబ్బంది రాకుండా ప్లాన్ చేసుకుందట.
ఇవి కాకుండా రిలీజ్ కు రెడీగా ఉన్న కాజల్ సినిమాలు రెండు తమిళంలో రాబోతున్నాయి. వాటిలో ఒకటి దెయ్యంగా కూడా నటించింది. ఏళ్ళ తరబడి ల్యాబులో మగ్గుతున్న హిందీ క్వీన్ రీమేక్ మాత్రం బయటికి వచ్చే సూచనలు కనిపించడం లేదు. మొత్తానికి కాజల్ కెరీర్ మళ్ళీ ఊపందుకునేలా ఉంది
This post was last modified on February 26, 2023 2:26 pm
ఐపీఎల్ 2026 సీజన్ మొదటి మ్యాచ్లో ఎదురుదెబ్బ తగిలినా, సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) రెండో మ్యాచ్లోనే అద్భుతంగా పుంజుకుంది. కోల్కతాలోని…
టాలీవుడ్ ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. సాధారణంగా…
అందరూ ఎదురు చూస్తున్న రామాయణ పార్ట్ 1 టీజర్ వచ్చేసింది. రెండు నిమిషాల ముప్పై ఎనిమిది సెకండ్ల వీడియో మొత్తం…
తెలంగాణకు చెందిన రాజ్యసభ సభ్యురాలు, కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ నాయకురాలు రేణుకా చౌదరి.. రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే…
మొన్న సోమవారం నుంచి దురంధర్ ది రివెంజ్ ఆక్యుపెన్సీలు బాగా తగ్గిపోవడం ట్రేడ్ వర్గాలను ఆందోళనకు గురి చేశాయి. యాభై…
ఏపీకి అమరావతి ఏకైక, శాశ్వత రాజధానిగా కొనసాగేందుకు అవసరమైన చట్ట సవరణలు సవ్యంగా ముగిసిన వేళ... అమరావతిని చిదిమేసేందుకు వైసీపీ చేసిన దాష్టీకం…