తమిళ్ లో వచ్చిన వినోదాయ సీతమ్ చూసి త్రివిక్రమ్ ఈ సినిమాను ఇష్టపడ్డాడు. అక్కడి నుండి ఈ రీమేక్ ప్రాజెక్ట్ సెట్ చేసేందుకు బాగా కష్టపడ్డాడు. పవన్ కళ్యాణ్ కి సినిమా చూపించి సముద్రఖని తో ప్రాజెక్ట్ సెట్ చేశాడు. త్రివిక్రమ్ కంటే ముందు సముద్రఖని తెలుగు రీమేక్ కోసం ఓ వెర్షన్ రాశాడు. కానీ అది త్రివిక్రమ్ కి నచ్చలేదు. దీంతో స్టార్ రైటర్ సాయి మాధవ బుర్రా ను రంగంలోకి దింపారు. ఆయన కూడా ఓ వెర్షన్ ఇచ్చాడు. అదీ వర్కవుట్ అవ్వలేదు.
అప్పుడు మహేష్ ప్రాజెక్ట్ నుండి బయటికొచ్చి త్రివిక్రమ్ తన వెర్షన్ రాశాడు. చాలా మార్పులు చేశాడు. మధ్య వయసు పాత్రను తొలగించి తేజ్ కోసం ఓ కుర్రాడి పాత్రను క్రియేట్ చేశాడు త్రివిక్రమ్. ఆ పాత్రకు తగ్గట్టు హీరోయిన్ , లవ్ యాడ్ చేశాడు. భాద్యత లేని ఓ కుర్రాడు చనిపోయాక ఎలా భాద్యత తెలుసుకున్నాడు అనేట్టుగా ఫైనల్ వెర్షన్ రెడీ చేశారని తెలుస్తుంది. ఇక సముద్రఖని ఫైనల్ చేసిన కాస్టింగ్ ను కూడా త్రివిక్రమ్ మార్చేశారని అంటున్నారు.
ఫైనల్ గా ఇప్పుడు త్రివిక్రమ్ వెర్షనే సెట్స్ మీదకి వచ్చింది. ఈ డిస్కషన్స్ లో పవన్ ఉన్నది తక్కువే త్రివిక్రమే ప్రతీ విషయంలో ఇన్వాల్వ్ అవుతూ ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకొచ్చారు. ఈ రీమేక్ హిట్టయినా, ఫ్లాప్ అయిన ఆ క్రెడిట్ సముద్రఖని కంటే త్రివిక్రమ్ కే దక్కుతుందన్నమాట. మరి ఒరిజినల్ తో పోలిస్తే త్రివిక్రమ్ వెర్షన్ ఎలా ఉండబోతుందో ? చూడాలి.
This post was last modified on February 25, 2023 3:41 pm
కొందరు ఫిలిం మేకర్స్ తమ సినిమా కథేంటో చివరి వరకు దాచి పెట్టాలని ప్రయత్నిస్తారు. నేరుగా థియేటర్లలో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలనుకుంటారు.…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…