Movie News

పవన్ కోసం మూడు వెర్షన్లు

తమిళ్ లో వచ్చిన వినోదాయ సీతమ్ చూసి త్రివిక్రమ్ ఈ సినిమాను ఇష్టపడ్డాడు. అక్కడి నుండి ఈ రీమేక్ ప్రాజెక్ట్ సెట్ చేసేందుకు బాగా కష్టపడ్డాడు. పవన్ కళ్యాణ్ కి సినిమా చూపించి సముద్రఖని తో ప్రాజెక్ట్ సెట్ చేశాడు. త్రివిక్రమ్ కంటే ముందు సముద్రఖని తెలుగు రీమేక్ కోసం ఓ వెర్షన్ రాశాడు. కానీ అది త్రివిక్రమ్ కి నచ్చలేదు. దీంతో స్టార్ రైటర్ సాయి మాధవ బుర్రా ను రంగంలోకి దింపారు. ఆయన కూడా ఓ వెర్షన్ ఇచ్చాడు. అదీ వర్కవుట్ అవ్వలేదు.

అప్పుడు మహేష్ ప్రాజెక్ట్ నుండి బయటికొచ్చి త్రివిక్రమ్ తన వెర్షన్ రాశాడు. చాలా మార్పులు చేశాడు. మధ్య వయసు పాత్రను తొలగించి తేజ్ కోసం ఓ కుర్రాడి పాత్రను క్రియేట్ చేశాడు త్రివిక్రమ్. ఆ పాత్రకు తగ్గట్టు హీరోయిన్ , లవ్ యాడ్ చేశాడు. భాద్యత లేని ఓ కుర్రాడు చనిపోయాక ఎలా భాద్యత తెలుసుకున్నాడు అనేట్టుగా ఫైనల్ వెర్షన్ రెడీ చేశారని తెలుస్తుంది. ఇక సముద్రఖని ఫైనల్ చేసిన కాస్టింగ్ ను కూడా త్రివిక్రమ్ మార్చేశారని అంటున్నారు.

ఫైనల్ గా ఇప్పుడు త్రివిక్రమ్ వెర్షనే సెట్స్ మీదకి వచ్చింది. ఈ డిస్కషన్స్ లో పవన్ ఉన్నది తక్కువే త్రివిక్రమే ప్రతీ విషయంలో ఇన్వాల్వ్ అవుతూ ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకొచ్చారు. ఈ రీమేక్ హిట్టయినా, ఫ్లాప్ అయిన ఆ క్రెడిట్ సముద్రఖని కంటే త్రివిక్రమ్ కే దక్కుతుందన్నమాట. మరి ఒరిజినల్ తో పోలిస్తే త్రివిక్రమ్ వెర్షన్ ఎలా ఉండబోతుందో ? చూడాలి.

This post was last modified on February 25, 2023 3:41 pm

Share
Show comments

Recent Posts

సంచలన బిల్లు: అసెంబ్లీకి రాకపోతే జీతం కట్

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. తాజాగా బుధవారం జరిగిన మంత్రి వర్గ సమావేశంలో సీఎం చంద్రబాబు బడ్జెట్…

8 minutes ago

శంక‌ర్‌కు బ‌డా నిర్మాత కండిష‌న్‌

రాజ‌మౌళి కంటే ముందు సౌత్ ఇండియ‌న్ సినిమా స్థాయిని పెంచి.. అద్భుత‌మైన క‌థ‌లు, క‌ళ్లు చెదిరే విజువ‌ల్ ఎఫెక్ట్స్, సాంకేతిక…

44 minutes ago

హిర‌ణ్య క‌శ్య‌ప‌ను వ‌ద‌ల‌ని గుణ‌శేఖర్

హిర‌ణ్య‌క‌శ్య‌ప‌.. టాలీవుడ్లో చాలా ఏళ్ల పాటు చ‌ర్చ‌ల్లో ఉన్న చిత్రం. సీనియ‌ర్ ద‌ర్శ‌కుడు గుణ‌శేఖ‌ర్.. రుద్ర‌మ‌దేవి త‌ర్వాత తీయాల‌నుకున్న సినిమా…

2 hours ago

పిఠాపురం కోసం ఢిల్లీ వరకు.. కేంద్ర మంత్రులకు పవన్ విజ్ఞాపన

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బుధవారం ఢిల్లీలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన పలువురు కేంద్ర…

2 hours ago

వైసీపీ మాజీ ఎంపీ నుంచే వైసీపీ కార్యకర్తకు బెదిరింపులా?

వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ తన వ్యవహార శైలితో నిత్యం వార్తల్లో నిలుస్తుంటారన్న సంగతి తెలిసిందే. వైసీపీ హయాంలో…

5 hours ago

మొదటి దెబ్బ తిన్న టీం ఇండియా

​విశాఖపట్నం వేదికగా జరిగిన నాలుగో టీ20లో టీమిండియాకు చిక్కెదురైంది. వరుసగా మూడు విజయాలతో జోరు మీదున్న భారత్‌కు న్యూజిలాండ్ షాక్…

7 hours ago