బాలీవుడ్.. టాలీవుడ్.. కోలీవుడ్.. అని తేడా లేదు. అన్ని చోట్లా వారసత్వ హీరోలదే హవా. రోజు రోజుకూ నెపో కిడ్స్ పెరుగుతున్నారే తప్ప తగ్గట్లేదు. వీరి మధ్య సొంతంగా హీరోలుగా ఎదిగి ఒక స్థాయి అందుకుంటున్న వాళ్లూ కొందరున్నారు. ఈ రెండు వర్గాలకు చెందిన హీరోలు ఇప్పుడు సింగర్ స్మిత నిర్వహించే ‘నిజం’ షోకు అతిథులుగా వెళ్లారు. ఆ ఇద్దరూ.. రానా దగ్గుబాటి, నాని. సినిమాల్లో నెపోటిజం గురించి ఈ ఇద్దరూ ఈ షోలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా నాని నెపోటిజం గురించి చేసిన వ్యాఖ్యలకు కొత్త చర్చకు దారి తీశాయి.
రామ్ చరణ్ తొలి సినిమాను కోటి మంది ప్రేక్షకులు చూశారని.. కానీ తన తొలి చిత్రాన్ని లక్షమందే చూశారని.. మరి నెపోటిజంను ప్రోత్సహిస్తున్నది ఎవరు అని నాని ప్రశ్నించడం గమనార్హం. అంటే వారసత్వ హీరోలను ప్రోత్సహిస్తున్నది, నెత్తిన పెట్టుకుంటున్నది ప్రేక్షకులే.. సినీ రంగంలో నెపోటిజం రాజ్యమేలుతోందంటే అందుక్కారణం ఆడియన్సే అని తేల్చేశాడు నాని.
ఇక రానా ఈ విషయమై మాట్లాడుతూ.. తాను టాలీవుడ్ వరకే వారసత్వ హీరోనని.. కానీ ఈ ఇండస్ట్రీ దాటితే కొత్తవాడినే అని.. కానీ తాను అన్నిచోట్లా సత్తా చాటుకోగలిగానని అన్నాడు. “నేను బాలీవుడ్లో తొలి సినిమా చేసినపుడు నేనెవరో సరిగ్గా అక్కడి వాళ్లకు తెలియదు. నా ఊరేంటో కూడా వాళ్లు ఎరుగరు. దక్షిణాది నుంచి వచ్చా కాబట్టి చెన్నై వాడిని అనుకున్నారు. నా దృష్టిలో వారసత్వం అన్నది మనల్ని పరిచయం చేయడం వరకే ఉపయోగపడుతుంది. అంతే తప్ప ఒక్కసారిగా స్టార్ అయిపోలేం. మా తాత ఒక రైతు. ఆయన పరిశ్రమలోకి వచ్చి 45 ఏళ్ల పాటు సినిమాలు చేశారు. ఆయన ఇద్దరు కొడుకులు పరిశ్రమలోకి వచ్చి వారసత్వాన్ని కొనసాగిస్తూ స్టూడియో కూడా ఏర్పాటు చేశారు. ఒకవేళ నేను వారి వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లకపోతే అది తప్పు అవుతుంది. నా కుటుంబానికి అన్యాయం చేసిన వాడిని అవుతాను. అందరూ లెగసీని మాత్రమే చూస్తారు. దాని వల్ల వచ్చే బరువు బాధ్యతలు అందరికీ తలెియవు. విజయ, ఏవీఎం లాంటి పెద్ద స్టూడియోలు ఉన్నట్లుండి కనుమరుగైపోయాయి. వాటి వారసత్వాన్ని ఆ కుటుంబాల వాళ్లు ముందుకు తీసుకెళ్లకపోవడమే అందుక్కారణం” అని రానా వ్యాఖ్యానించాడు.
ఏదో ఒక రోజు ప్రాంతీయంగా ఉన్న సినిమా పరిశ్రమలన్నీ కలిసి ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీగా మారతాయని నేను ఇండస్ట్రీలోకి వచ్చినపుడే అన్నానని.. తొమ్మిదేళ్ల పాటు ఎవ్వరూ ఆ మాట నమ్మలేదని.. కానీ ఇప్పుడు చూస్తే మనమంతా ఒక్కటైపోయామని రానా పేర్కొన్నాడు.
సమంత అసాధ్యం అనుకున్నది చేసి చూపించేసింది. ఈ రోజుతో మా ఇంటి బంగారం వంద కోట్ల గ్రాస్ క్లబ్బులో అడుగు…
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…