పాత టైటిల్స్ ని కొత్తగా వాడుకోవడం ఎప్పటి నుంచో ఉన్నదే. కాకపోతే స్టార్ హీరోలవి డిసైడ్ చేసేటప్పుడు మాత్రం చాలా అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఇటీవలే పవన్ కళ్యాణ్ సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్ లో వినోదయ సితం రీమేక్ మొదలైన సంగతి తెలిసిందే. సముతిరఖని దర్శకత్వంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే సంభాషణలు అందించగా తమన్ సంగీతం సమకూరుస్తున్నాడు. తేజుకి హీరోయిన్ గా కేతిక శర్మ నటించనుండగా అతని చెల్లి క్యారెక్టర్ కి ప్రియా ప్రకాష్ వారియర్ ని ఎంచుకున్నారు. క్యాస్టింగ్ మొత్తం పూర్తి చేశారు.
దీనికి దేవుడు టైటిల్ ని పరిశీలనలో ఉంచినట్టు లేటెస్ట్ అప్డేట్. అయితే ఈ పేరు వెనుక ఓ ఆసక్తికరమైన నేపథ్యం ఉంది. 1997 లో బాలకృష్ణ హీరోగా దేవుడు వచ్చింది. రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో రూపొందిన ఈ విలేజ్ డ్రామా ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. అయితే అమాయకంగా చంటి తరహాలో బాలయ్య నటన మాస్ ని ఆకట్టుకుంది. ఆ తర్వాత దీన్ని ఎవరూ వాడుకోలేదు. దేవుడు చేసిన మనుషులు లాంటివి వచ్చాయి కానీ ఇంకెవరూ పెట్టుకునే సాహసం చేయలేదు. ఇప్పుడు పవన్ చేస్తున్న పాత్ర అలాంటిదే కాబట్టి యూనిట్ దీనివైపే మొగ్గు చూపుతున్నట్టు టాక్.
చాలా తక్కువ రోజుల్లో షూటింగ్ పూర్తి చేయబోతున్న ఈ మూవీని వేసవికి విడుదల చేయాలనే లక్ష్యంతో నిర్మాతలున్నారు. కొంత భాగం చిత్రీకరణ అయ్యాక ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి ఆ వెంటనే బిజినెస్ వ్యవహారాలు చక్కదిద్దబోతున్నారు. క్రేజ్ దృష్ట్యా బడ్జెట్ తో సంబంధం లేకుండా ఈజీగా వంద కోట్ల మార్కుని అందుకునే అంచనాలు బలంగా ఉన్నాయి. పైగా ఆకర్షణీయమైన కాంబో కావడంతో ఆఫర్స్ భారీగా ఉన్నాయి. దీనికోసమే హరిహరవీరమల్లుకి బ్రేక్ వేసి మరీ హెయిర్ స్టైల్ మార్చుకున్న పవన్ తర్వాత దాన్ని కంటిన్యూ చేయబోతున్నారు. సమాంతరంగా హరీష్ శంకర్, సుజిత్ ల ప్రాజెక్ట్స్ లో ఒకటి జరుగుతాయి.
This post was last modified on February 24, 2023 1:34 pm
కొందరు ఫిలిం మేకర్స్ తమ సినిమా కథేంటో చివరి వరకు దాచి పెట్టాలని ప్రయత్నిస్తారు. నేరుగా థియేటర్లలో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలనుకుంటారు.…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…