పాత టైటిల్స్ ని కొత్తగా వాడుకోవడం ఎప్పటి నుంచో ఉన్నదే. కాకపోతే స్టార్ హీరోలవి డిసైడ్ చేసేటప్పుడు మాత్రం చాలా అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఇటీవలే పవన్ కళ్యాణ్ సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్ లో వినోదయ సితం రీమేక్ మొదలైన సంగతి తెలిసిందే. సముతిరఖని దర్శకత్వంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే సంభాషణలు అందించగా తమన్ సంగీతం సమకూరుస్తున్నాడు. తేజుకి హీరోయిన్ గా కేతిక శర్మ నటించనుండగా అతని చెల్లి క్యారెక్టర్ కి ప్రియా ప్రకాష్ వారియర్ ని ఎంచుకున్నారు. క్యాస్టింగ్ మొత్తం పూర్తి చేశారు.
దీనికి దేవుడు టైటిల్ ని పరిశీలనలో ఉంచినట్టు లేటెస్ట్ అప్డేట్. అయితే ఈ పేరు వెనుక ఓ ఆసక్తికరమైన నేపథ్యం ఉంది. 1997 లో బాలకృష్ణ హీరోగా దేవుడు వచ్చింది. రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో రూపొందిన ఈ విలేజ్ డ్రామా ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. అయితే అమాయకంగా చంటి తరహాలో బాలయ్య నటన మాస్ ని ఆకట్టుకుంది. ఆ తర్వాత దీన్ని ఎవరూ వాడుకోలేదు. దేవుడు చేసిన మనుషులు లాంటివి వచ్చాయి కానీ ఇంకెవరూ పెట్టుకునే సాహసం చేయలేదు. ఇప్పుడు పవన్ చేస్తున్న పాత్ర అలాంటిదే కాబట్టి యూనిట్ దీనివైపే మొగ్గు చూపుతున్నట్టు టాక్.
చాలా తక్కువ రోజుల్లో షూటింగ్ పూర్తి చేయబోతున్న ఈ మూవీని వేసవికి విడుదల చేయాలనే లక్ష్యంతో నిర్మాతలున్నారు. కొంత భాగం చిత్రీకరణ అయ్యాక ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి ఆ వెంటనే బిజినెస్ వ్యవహారాలు చక్కదిద్దబోతున్నారు. క్రేజ్ దృష్ట్యా బడ్జెట్ తో సంబంధం లేకుండా ఈజీగా వంద కోట్ల మార్కుని అందుకునే అంచనాలు బలంగా ఉన్నాయి. పైగా ఆకర్షణీయమైన కాంబో కావడంతో ఆఫర్స్ భారీగా ఉన్నాయి. దీనికోసమే హరిహరవీరమల్లుకి బ్రేక్ వేసి మరీ హెయిర్ స్టైల్ మార్చుకున్న పవన్ తర్వాత దాన్ని కంటిన్యూ చేయబోతున్నారు. సమాంతరంగా హరీష్ శంకర్, సుజిత్ ల ప్రాజెక్ట్స్ లో ఒకటి జరుగుతాయి.
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…
లెనిన్ సినిమా ప్రమోషన్లలో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. లెనిన్…
పిల్లలు సంపద అని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. తాను చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానని తెలిపారు. దీనిని…
వియత్నాంలో విహార యాత్రకు వెళ్లిన భారతీయుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఊహించని ప్రమాదంలో చిక్కుకుని 15 మంది భారతీయులు మృతి…