తెలుగులో పెద్ద కథానాయికగా ఎదిగిన తెలుగు కథానాయికల్లో ఆమని ఒకరు. మిగతా హీరోయిన్లలా గ్లామర్ ముద్ర వేయించుకోకున్నా.. కెరీర్ ఆసాంతం ఎక్కువగా సంప్రదాయబద్ధమైన పాత్రలే చేసినా.. వాటితోనే మంచి గుర్తింపు సంపాదించి స్టార్ హీరోయిన్గా ఎదిగిందామె. కథానాయికగా ఆమె తొలి చిత్రం ‘జంబలకిడిపంబ’ సూపర్ హిట్ కాగా.. ఆ తర్వాత శుభలగ్నం, మావిచిగురు సహా చాలా హిట్ సినిమాల్లో ఆమె నటించింది.
కథానాయికగా కెరీర్ ముగిశాక సినిమాలు పక్కన పెట్టేసి కుటుంబ జీవితానికి పరిమితం అయిన ఆమె.. కొన్నేళ్లుగా క్యారెక్టర్ రోల్స్లో ఆకట్టుకుంటోంది. ఈ మధ్య ఎక్కువగా అమ్మ పాత్రలు చేస్తోంది. తాజాగా ఆమె తన కెరీర్ ఆరంభంలో ఎదురైన లైంగిక వేధింపుల గురించి ఓపెన్ అయింది. ఒక డిస్ట్రిబ్యూటర్ కూతురినైన తనకు కూడా ఈ తరహా ఇబ్బందులు తప్పలేదని ఆమె వెల్లడించింది.
‘‘మా నాన్న డిస్ట్రిబ్యూటర్. నాకు చిన్నప్పటి నుంచి సినిమాల్లోకి రావాలని ఉండేది. నేను తెరంగేట్రం చేస్తానంటే ముందు నాన్న ఒప్పుకోలేదు. తర్వాత నా ఇష్టం చూసి సరే అన్నారు. ముందు తమిళ సినిమాలతో కెరీర్ మొదలుపెట్టాను. అవకాశాల కోసం రెండేళ్లు కష్టపడ్డాను. ఛాన్స్ ఇస్తామంటూనే తమకు నచ్చినట్లు ఉండాలని పరోక్షంగా చెప్పేవాళ్లు.
ఒంటరిగా వచ్చి కలవమని చెప్పేవాళ్లు. మా అమ్మ అండతో వాటన్నింటినీ సున్నితంగా తిరస్కరించా. కొంత కాలానికి వాళ్ల మాటల్లోని అర్థాలు తెలిశాయి. అప్పుడు చాలా బాధ పడ్డా. నాన్న చెప్పినా వినకుండా తప్పుడు మార్గంలోకి వచ్చేశానా అనిపించింది. కానీ కొన్ని రోజులకే తెలుగులో ‘జంబలకిడి పంబ’ ఆఫర్ వచ్చింది. ఆ సినిమా సూపర్ హిట్ అయింది.
నా కెరీర్ ఊపందుకుంది. తెలుగులో స్టార్ హీరోయిన్గా ఎదిగాను. ఇక వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకపోయింది’’ అని ఆమని వెల్లడించింది. తన కెరీర్లో చిరంజీవి పక్కన కథానాయికగా చేయకపోవడమే లోటని, ‘రిక్షావోడు’లో ఛాన్స్ వచ్చినట్లే వచ్చి మిస్సయిందని ఆమె తెలిపింది.
This post was last modified on February 23, 2023 11:51 pm
స్టార్ హీరోలు నటించిన ప్యాన్ ఇండియా సినిమాలకు శాటిలైట్ ప్రీమియర్లు భారీ స్థాయిలో స్పందన తెచ్చుకుంటాయి. కానీ కొన్నిసార్లు మాత్రం…
గ్యారెంటీ కామెడీ ఉంటుందని అల్లరి నరేష్ సినిమాలకు పేరు. కానీ గత కొన్నేళ్లుగా ఈ జానర్ కు ఆదరణ తగ్గడం,…
లోకనాయకుడు కమల్ హాసన్, దర్శకుడు శంకర్ కలయికలో తెరకెక్కిన భారతీయుడు 2 విడుదల జూన్ 13 ఉంటుందని మీడియా మొత్తం…
ఏపీ సీఎం జగన్ చిన్నాన్న వివేకానందరెడ్డికేసులో తాజాగా సంచలనం చోటు చేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏ-8గా ఉన్న…
లోక్ సభ ఎన్నికలలో ఖచ్చితంగా ఎంపీగా గెలిచి పార్లమెంటులో అడుగుపెట్టాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీ సేఫ్ గేమ్ ఆడుతున్నాడు. 2019…
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం కష్టం. ఇప్పుడు ఇలాంటి పరిస్తితే.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్న…