తెలుగులో పెద్ద కథానాయికగా ఎదిగిన తెలుగు కథానాయికల్లో ఆమని ఒకరు. మిగతా హీరోయిన్లలా గ్లామర్ ముద్ర వేయించుకోకున్నా.. కెరీర్ ఆసాంతం ఎక్కువగా సంప్రదాయబద్ధమైన పాత్రలే చేసినా.. వాటితోనే మంచి గుర్తింపు సంపాదించి స్టార్ హీరోయిన్గా ఎదిగిందామె. కథానాయికగా ఆమె తొలి చిత్రం ‘జంబలకిడిపంబ’ సూపర్ హిట్ కాగా.. ఆ తర్వాత శుభలగ్నం, మావిచిగురు సహా చాలా హిట్ సినిమాల్లో ఆమె నటించింది.
కథానాయికగా కెరీర్ ముగిశాక సినిమాలు పక్కన పెట్టేసి కుటుంబ జీవితానికి పరిమితం అయిన ఆమె.. కొన్నేళ్లుగా క్యారెక్టర్ రోల్స్లో ఆకట్టుకుంటోంది. ఈ మధ్య ఎక్కువగా అమ్మ పాత్రలు చేస్తోంది. తాజాగా ఆమె తన కెరీర్ ఆరంభంలో ఎదురైన లైంగిక వేధింపుల గురించి ఓపెన్ అయింది. ఒక డిస్ట్రిబ్యూటర్ కూతురినైన తనకు కూడా ఈ తరహా ఇబ్బందులు తప్పలేదని ఆమె వెల్లడించింది.
‘‘మా నాన్న డిస్ట్రిబ్యూటర్. నాకు చిన్నప్పటి నుంచి సినిమాల్లోకి రావాలని ఉండేది. నేను తెరంగేట్రం చేస్తానంటే ముందు నాన్న ఒప్పుకోలేదు. తర్వాత నా ఇష్టం చూసి సరే అన్నారు. ముందు తమిళ సినిమాలతో కెరీర్ మొదలుపెట్టాను. అవకాశాల కోసం రెండేళ్లు కష్టపడ్డాను. ఛాన్స్ ఇస్తామంటూనే తమకు నచ్చినట్లు ఉండాలని పరోక్షంగా చెప్పేవాళ్లు.
ఒంటరిగా వచ్చి కలవమని చెప్పేవాళ్లు. మా అమ్మ అండతో వాటన్నింటినీ సున్నితంగా తిరస్కరించా. కొంత కాలానికి వాళ్ల మాటల్లోని అర్థాలు తెలిశాయి. అప్పుడు చాలా బాధ పడ్డా. నాన్న చెప్పినా వినకుండా తప్పుడు మార్గంలోకి వచ్చేశానా అనిపించింది. కానీ కొన్ని రోజులకే తెలుగులో ‘జంబలకిడి పంబ’ ఆఫర్ వచ్చింది. ఆ సినిమా సూపర్ హిట్ అయింది.
నా కెరీర్ ఊపందుకుంది. తెలుగులో స్టార్ హీరోయిన్గా ఎదిగాను. ఇక వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకపోయింది’’ అని ఆమని వెల్లడించింది. తన కెరీర్లో చిరంజీవి పక్కన కథానాయికగా చేయకపోవడమే లోటని, ‘రిక్షావోడు’లో ఛాన్స్ వచ్చినట్లే వచ్చి మిస్సయిందని ఆమె తెలిపింది.
This post was last modified on February 23, 2023 11:51 pm
దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ కు ఇటీవల ఎక్కడ లేని ప్రాచుర్యం లభించింది. నీట్ పేపర్ లీకేజి కి…
గతంలో బ్రహ్మానందం, బాబు మోహన్ లాంటి కమెడియన్స్ ఉన్నప్పుడు వాళ్ళ కోసమే విడిగా కామెడీ ఎపిసోడ్స్ రాసేవాళ్ళు. మెయిన్ రైటర్స్…
తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుల జాబితా తీస్తే.. అందులో పైవరుసలో ఉండే ఆర్టిస్టుల్లో మోహన్ బాబు ఒకరు.…
ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కొత్త ప్రస్థానం మొదలైపోయింది. నిన్నటిదాకా రాజకీయ వ్యూహకర్తగా, ఓ రాజకీయ పార్టీకి అధినేతగా…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు చెందిన ఓ కీలక కేసు విషయంలో సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. వ్యక్తి చనిపోయిన తర్వాత.. కేసును…
టాలీవుడ్ విచిత్రాలు కొన్ని భలే అనిపిస్తాయి. కాకతాళీయమే అయినా అదేదో రాసిపెట్టి జరగడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇటీవలే విడుదలైన శ్రీనివాస…