తెలుగు , తమిళ్ లో బిజీ ఆర్టిస్ట్ ఎవరంటే టక్కున వినిపించే పేరు సముద్రఖని. అవును దర్శకుడిగా ఎన్నో సినిమాలు చేసిన ఈయన నటుడిగా ఇప్పుడు ఫుల్ బిజీ అయిపోయాడు. తెలుగులో అల వైకుంఠ పురములో , క్రాక్ సినిమాలు సముద్రఖనిను బిజీ యాక్టర్ ను మార్చేశాయి. ఆ రెండు సినిమాల తర్వాత ఆయన చాలా తెలుగు సినిమాలు చేశాడు. తాజాగా ‘సార్’ లో మెయిన్ విలన్ గా నటించాడు.
అయితే ఇప్పుడు ఈ బిజీ యాక్టర్ మళ్ళీ మెగా ఫోన్ పట్టి దర్శకుడిగా బిజీ అయ్యాడు. ఇటీవలే తమిళ్ లో ‘వినోదాయ సీతమ్’ తీశాడు సముద్రఖని. దర్శకత్వంతో పాటు ఇందులో దేవుడిగా కనిపించి సక్సెస్ అందుకున్నాడు. ఇప్పుడు ఆ సినిమాను తెలుగులో పవన్ కళ్యాణ్ , సాయి ధరం తేజ్ కాంబోలో రీమేక్ చేయనున్నాడు. హైదరాబాద్ లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమయింది. ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ ఇరవై ఐదు రోజులు డేట్స్ ఇచ్చాడు. అంతా కలిపి రెండు మూడు నెలలలోనే షూటింగ్ కంప్లీట్ చేసేలా ప్లాన్ చేసుకుంటున్నారు.
ఈ షూటింగ్ పూర్తయ్యే వరకు సముద్రఖని నటుడిగా మరో సినిమా చేసే అవకాశం లేదు. ఇందులోనే ఏదైనా ఇంపార్టెంట్ రోల్ ఉంటే చేసుకోవాలి తప్ప మరో సినిమా చేయడానికి కుదరని పని. తాజాగా రెండు పెద్ద సినిమాలకు కూడా ఆయన నో చెప్పేశాడని తెలుస్తుంది. మరి ఈ సీనియర్ యాక్టర్ ను మైండ్ లో పెట్టుకొని కేరెక్టర్ రాసుకున్న దర్శకులకు పెద్ద ఇబ్బందే. ఆయన దర్శకుడిగా చేసే సినిమా కంప్లీట్ అయ్యే వరకు వెయిట్ చేస్తారా ? మరో ఆల్టర్నేట్ యాక్టర్ ను పెట్టుకుంటారా ? చూడాలి.
This post was last modified on February 22, 2023 5:18 pm
ఏపీ సీఎం చంద్రబాబు ఏ చిన్న అవకాశాన్నీ వదలట్లేదా? అంటే.. ఔననే సమాధానమే వస్తోంది. పెట్టుబడులకు ఎక్కడ అవకాశం ఉంటే..…
ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేయడం చిన్న సినిమాల నిర్మాతలకు దినదిన గండంగా మారిపోయింది. ఆడియన్స్ అభిరుచులు మారిపోయాయో లేక ఓటిటిల…
మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో శాసన సభను బాయ్కాట్ చేసిన వైసీపీ ప్రజాప్రతినిధులు శాసన మండలిలో మాత్రం చిందులు తొక్కుతున్నారు.…
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…