తెలుగు , తమిళ్ లో బిజీ ఆర్టిస్ట్ ఎవరంటే టక్కున వినిపించే పేరు సముద్రఖని. అవును దర్శకుడిగా ఎన్నో సినిమాలు చేసిన ఈయన నటుడిగా ఇప్పుడు ఫుల్ బిజీ అయిపోయాడు. తెలుగులో అల వైకుంఠ పురములో , క్రాక్ సినిమాలు సముద్రఖనిను బిజీ యాక్టర్ ను మార్చేశాయి. ఆ రెండు సినిమాల తర్వాత ఆయన చాలా తెలుగు సినిమాలు చేశాడు. తాజాగా ‘సార్’ లో మెయిన్ విలన్ గా నటించాడు.
అయితే ఇప్పుడు ఈ బిజీ యాక్టర్ మళ్ళీ మెగా ఫోన్ పట్టి దర్శకుడిగా బిజీ అయ్యాడు. ఇటీవలే తమిళ్ లో ‘వినోదాయ సీతమ్’ తీశాడు సముద్రఖని. దర్శకత్వంతో పాటు ఇందులో దేవుడిగా కనిపించి సక్సెస్ అందుకున్నాడు. ఇప్పుడు ఆ సినిమాను తెలుగులో పవన్ కళ్యాణ్ , సాయి ధరం తేజ్ కాంబోలో రీమేక్ చేయనున్నాడు. హైదరాబాద్ లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమయింది. ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ ఇరవై ఐదు రోజులు డేట్స్ ఇచ్చాడు. అంతా కలిపి రెండు మూడు నెలలలోనే షూటింగ్ కంప్లీట్ చేసేలా ప్లాన్ చేసుకుంటున్నారు.
ఈ షూటింగ్ పూర్తయ్యే వరకు సముద్రఖని నటుడిగా మరో సినిమా చేసే అవకాశం లేదు. ఇందులోనే ఏదైనా ఇంపార్టెంట్ రోల్ ఉంటే చేసుకోవాలి తప్ప మరో సినిమా చేయడానికి కుదరని పని. తాజాగా రెండు పెద్ద సినిమాలకు కూడా ఆయన నో చెప్పేశాడని తెలుస్తుంది. మరి ఈ సీనియర్ యాక్టర్ ను మైండ్ లో పెట్టుకొని కేరెక్టర్ రాసుకున్న దర్శకులకు పెద్ద ఇబ్బందే. ఆయన దర్శకుడిగా చేసే సినిమా కంప్లీట్ అయ్యే వరకు వెయిట్ చేస్తారా ? మరో ఆల్టర్నేట్ యాక్టర్ ను పెట్టుకుంటారా ? చూడాలి.
This post was last modified on February 22, 2023 5:18 pm
కొందరు ఫిలిం మేకర్స్ తమ సినిమా కథేంటో చివరి వరకు దాచి పెట్టాలని ప్రయత్నిస్తారు. నేరుగా థియేటర్లలో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలనుకుంటారు.…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…