ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్నా విడుదల విషయంలో మీనమేషాలు లెక్కబెట్టుకుంటూ వచ్చిన రానా నాయుడు ఇటీవలే ముంబైలో గ్రాండ్ ట్రైలర్ లాంచ్ తో ప్రమోషన్లను వేగవంతం చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు పబ్లిసిటీని నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లే పనిలో ఉంది నెట్ ఫ్లిక్స్. అందులో భాగంగానే సరికొత్త ప్రోమోలతో ఆడియన్స్ ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. వెంకటేష్ రానాలు ఇద్దరూ వీటిలో భాగమవుతున్నారు. ముఖ్యంగా వెంకీకి ఇది ఫస్ట్ డిజిటల్ డెబ్యూ కావడంతో అంచనాలు భారీగా ఉంటాయి కనక దానికి తగ్గట్టే కంటెంట్ ఉందనే నమ్మకాన్ని కలిగిస్తున్నారు.
మార్చి 10న స్ట్రీమింగ్ కాబోతున్న ఈ సిరీస్ ని ఒకరోజు ముందే భారీ ఎత్తున ప్రీమియర్ చేయబోతున్నారు . దీని కోసం పలు నగరాలను ఎంపిక చేసి ప్రత్యేకంగా ఆహ్వానించబడ్డ అభిమానులకు మీడియా ప్రతినిధులకు షో వేస్తారు. ఇదంతా థియేటర్లోనే ఉంటుంది. ఏసిటి ఫైబర్ నెట్ లాంటి వాటితో టైఅప్ చేసుకుని దాని కనెక్షన్ తీసుకున్న వాళ్లకు ఫ్రీ టికెట్ ఇచ్చేలా ఒప్పందం కూడా చేసుకున్నారు. ఇదంతా హైప్ పెంచే ప్రయత్నమే. వెంకటేష్ రానా పరస్పరం విపరీతంగా ద్వేషించుకునే తండ్రి కొడుకులుగా నటిస్తున్నారు. ఈ క్యారెక్టరైజేషన్లే హైలైట్ గా నిలవబోతున్నాయి.
రానా ఫ్యాన్స్ దీన్నుంచి చాలా ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. భీమ్లా నాయక్ క్రెడిట్ ఎక్కువ శాతం పవన్ కళ్యాణ్ ఖాతాలోకి వెళ్లగా ఎంతో కష్టపడి చేసిన విరాట పర్వం ఫలితం నిరాశపరిచింది. అందుకే దీంతో సాలిడ్ కంబ్యాక్ దక్కాలని కోరుకుంటున్నారు. ఎఫ్3తో ఒక హిట్టు ఓరి దేవుడా క్యామియోతో యావరేజ్ అందుకున్న వెంకటేష్ ని ఇందులో కంప్లీట్ మాస్ అవతారంలో చూడొచ్చు. అయితే వెబ్ సిరీస్ కాబట్టి సందర్భానుసారంగా జొప్పించిన బూతులు కొన్ని ఫ్యామిలీ ఆడియన్స్ కి ఎలా రీచ్ అవుతాయనే టెన్షన్ లేకపోలేదు. మొత్తానికి రానానాయుడు వచ్చేనాటికి ఓ పెద్ద సినిమా రేంజ్ హడావిడి ఖాయం.
This post was last modified on February 22, 2023 3:49 pm
కథానాయికగా మలయాళంలో పరిచయం అయి.. తెలుగులో మంచి ఫాలోయింగ్, అవకాశాలు అందుకున్న అమ్మాయి అనుపమ పరమేశ్వరన్. ఆమె కెరీర్లో ఎక్కువ…
వైసీపీ నాయకుడు వాసుపల్లి గణేష్ ఎయిర్ పోర్టుకి పెళ్లికి లింక్ పెట్టి మాట్లాడ్డం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఊరందరిదీ…
శర్వానంద్ ఈ ఏడాది నాలుగు నెలల గ్యాప్ లో రెండు సినిమాలు ఇచ్చాడు. నారి నారి నడుమ మురారి విపరీతమైన…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కెరీర్ పతాక స్థాయిలో ఉన్నపుడు ఆయనకు, కథానాయికలకు మధ్య లింకులు పెడుతూ అనేక వార్తలు వచ్చాయి. అందులో ఎక్కువ చర్చనీయాంశం…
వైసీపీ అధినేత జగన్కు ఏపీ ప్రజలు థ్యాంక్స్ చెబుతున్నారంటూ.. ఆ పార్టీ సోషల్ మీడియా ఊదర గొడుతోంది. అంతేకాదు.. గత…
సూపర్ స్టార్ కృష్ణ సోదరులు, సీనియర్ నిర్మాత ఆదిశేషగిరిరావు ఇవాళ జరిగిన శ్రీనివాస మంగాపురం ఈవెంట్ లో ఒక మాట…