రామ్ చరణ్ నెక్స్ట్ సినిమా విషయంలో క్లారిటీ వచ్చేసింది. కాకపోతే ఆ సినిమా తర్వాత చరణ్ చేయబోయే సినిమా మీద ఇప్పుడు అందరికీ డౌట్స్ నెలకొంటున్నాయి. శంకర్ తో చేస్తున్న RC15 సినిమా తర్వాత చరణ్ బుచ్చి బాబుతో ఓ సినిమా చేయబోతున్నాడు. స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంతో మాస్ యాక్షన్ సినిమాగా తెరకెక్కబోతున్న ఈ సినిమా తర్వాత చరణ్ ఇద్దరు దర్శకులకి కమిట్ మెంట్ ఇచ్చాడు. అందులో ఒకరు సుకుమార్. మరొకరు కన్నడ డైరెక్టర్ నర్తన్.
సుకుమార్ తో ‘రంగస్థలం’ చేసి నటుడిగా ఎంతో ఎదిగిన చరణ్ ‘పుష్ప2 ‘ తర్వాత తనతోనే సినిమా చేయాలని సుక్కు కి రిక్వెస్ట్ పెట్టాడు. సుకుమార్ కూడా చరణ్ సినిమా కోసం కథ సిద్దం చేసి పెట్టేశాడు. పుష్ప2 ఘాట్ గ్యాప్ లో చరణ్ సినిమా మీద వర్క్ చేసుకుంటున్నాడు. నర్తన్ కూడా చరణ్ సినిమా స్క్రిప్ట్ పనిలోనే ఉన్నాడు. ఇప్పటికే ఓ లైన్ ఓకే చేయించుకొని దాని మీద వర్క్ చేస్తున్నాడు. ఈ కాంబో సినిమాను యూవీ క్రియేషన్స్ నిర్మించనుంది.
ఇటు సుకుమార్ అటు నర్తన్ ఈ ఇద్దరిలో చరణ్ ముందుగా చేయబోయే సినిమాపై ఇండస్ట్రీలో హాట్ డిస్కషన్ నడుస్తుంది. మెగా ఫ్యాన్స్ మాత్రం నర్తన్ ప్రాజెక్ట్ కంటే సుకుమార్ సినిమా మీదే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ఇటీవలే రాజమౌళి ఈ కాంబో సినిమా ఇంట్రో సీక్వెన్స్ గురించి గొప్పగా చెప్పడంతో సినిమాపై అంచనాలు తారా స్థాయికి చేరుకున్నాయి. రంగస్థలం తర్వాత ఆ కాంబోలో రాబోతున్న సినిమాపై మూవీ లవర్స్ లో కూడా భారీ ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. బిజినెస్ పరంగానూ ఈ ప్రాజెక్ట్ కే క్రేజ్ ఉంటుంది.
ప్రస్తుతం చరణ్ శంకర్ సినిమా పూర్తి చేయాల్సి ఉంది. ఆ తర్వాత బుచ్చి బాబు సినిమా. ఇక సుకుమార్ కూడా పుష్ప 2 ని చెక్కుతున్నాడు. ఈ ప్రాజెక్ట్స్ కంప్లీట్ అయ్యే లోపు లెక్కలు మరతాయెమో చెప్పలేం.
This post was last modified on February 21, 2023 8:26 pm
భోగాపురం విమానాశ్రయం నిర్మాణానికి కొబ్బరికాయ కొట్టింది నేనే, గుమ్మడికాయ కట్టింది నేనే అని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించిన విషయం తెలిసిందే.…
నేచురల్ స్టార్ నాని కేవలం నటుడిగానే కాకుండా 'వాల్ పోస్టర్ సినిమా' బ్యానర్పై నిర్మాతగా కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన…
టాలీవుడ్లో మంచి అభిరుచి ఉన్న దర్శకుల్లో క్రిష్ ఒకడు. దాదాపు రెండు దశాబ్దాల కెరీర్లో క్రిష్ ఎన్నడూ రొటీన్ సినిమా…
మంచి టాలెంట్ ఉన్న యంగ్ జనరేషన్ దర్శకులు కెరీర్ ప్రారంభంలో హిట్లు అందుకున్నప్పటికీ దాన్ని నిలబెట్టుకునే క్రమంలో, కథల ఎంపికలో…
స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం అని సినిమాల్లో చూడటమే కానీ నిజ జీవితంలో దాన్ని ఆచరించే వాళ్ళను వేళ్ళ మీద…
ఒక జడ్జి ప్రజల్ని చీమలతో పోల్చితో మరొకరు నిరుద్యోగులను బొద్దింకలతో పోల్చడం దేశ ప్రజలను విస్మయానికి గురి చేసింది. దాని…