Movie News

చరణ్ అడుగులెటు వైపు ?

రామ్ చరణ్ నెక్స్ట్ సినిమా విషయంలో క్లారిటీ వచ్చేసింది. కాకపోతే ఆ సినిమా తర్వాత చరణ్ చేయబోయే సినిమా మీద ఇప్పుడు అందరికీ డౌట్స్ నెలకొంటున్నాయి. శంకర్ తో చేస్తున్న RC15 సినిమా తర్వాత చరణ్ బుచ్చి బాబుతో ఓ సినిమా చేయబోతున్నాడు. స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంతో మాస్ యాక్షన్ సినిమాగా తెరకెక్కబోతున్న ఈ సినిమా తర్వాత చరణ్ ఇద్దరు దర్శకులకి కమిట్ మెంట్ ఇచ్చాడు. అందులో ఒకరు సుకుమార్. మరొకరు కన్నడ డైరెక్టర్ నర్తన్.

సుకుమార్ తో ‘రంగస్థలం’ చేసి నటుడిగా ఎంతో ఎదిగిన చరణ్ ‘పుష్ప2 ‘ తర్వాత తనతోనే సినిమా చేయాలని సుక్కు కి రిక్వెస్ట్ పెట్టాడు. సుకుమార్ కూడా చరణ్ సినిమా కోసం కథ సిద్దం చేసి పెట్టేశాడు. పుష్ప2 ఘాట్ గ్యాప్ లో చరణ్ సినిమా మీద వర్క్ చేసుకుంటున్నాడు. నర్తన్ కూడా చరణ్ సినిమా స్క్రిప్ట్ పనిలోనే ఉన్నాడు. ఇప్పటికే ఓ లైన్ ఓకే చేయించుకొని దాని మీద వర్క్ చేస్తున్నాడు. ఈ కాంబో సినిమాను యూవీ క్రియేషన్స్ నిర్మించనుంది.

ఇటు సుకుమార్ అటు నర్తన్ ఈ ఇద్దరిలో చరణ్ ముందుగా చేయబోయే సినిమాపై ఇండస్ట్రీలో హాట్ డిస్కషన్ నడుస్తుంది. మెగా ఫ్యాన్స్ మాత్రం నర్తన్ ప్రాజెక్ట్ కంటే సుకుమార్ సినిమా మీదే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ఇటీవలే రాజమౌళి ఈ కాంబో సినిమా ఇంట్రో సీక్వెన్స్ గురించి గొప్పగా చెప్పడంతో సినిమాపై అంచనాలు తారా స్థాయికి చేరుకున్నాయి. రంగస్థలం తర్వాత ఆ కాంబోలో రాబోతున్న సినిమాపై మూవీ లవర్స్ లో కూడా భారీ ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. బిజినెస్ పరంగానూ ఈ ప్రాజెక్ట్ కే క్రేజ్ ఉంటుంది.

ప్రస్తుతం చరణ్ శంకర్ సినిమా పూర్తి చేయాల్సి ఉంది. ఆ తర్వాత బుచ్చి బాబు సినిమా. ఇక సుకుమార్ కూడా పుష్ప 2 ని చెక్కుతున్నాడు. ఈ ప్రాజెక్ట్స్ కంప్లీట్ అయ్యే లోపు లెక్కలు మరతాయెమో చెప్పలేం.

This post was last modified on February 21, 2023 8:26 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఐపీఎస్ సునీల్.. అలా రిటైర్ కావాల్సిందేనా?

వైసీపీ హయాంలో అప్పటి సీఎం జగన్ కనుసన్నల్లో పనిచేసిన అధికారులు రూల్స్‌ను పక్కన పెట్టి ఇష్టానుసారంగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి.…

5 hours ago

అమరావతిలో కొత్త నిర్ణయం: పేదలకు నష్టం లేకుండా మార్పు

జగన్ హయాంలో తీసుకున్న పలువురు నిర్ణయాలు రాష్ట్రాన్ని వెనక్కి నెట్టాయని, ముఖ్యంగా ఆర్థికంగానే కాకుండా రాజధాని పరంగా కూడా రాష్ట్రానికి…

6 hours ago

మరి కొద్ది గంటల్లో పెళ్లి.. అక్కచెల్లెళ్లు మృతి?

రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్‌పూర్ జిల్లా మనాయ్ గ్రామంలో శనివారం జరగాల్సిన వివాహ కార్యక్రమాలకు కొద్దిగంటల ముందు ఇద్దరు అక్కచెల్లెళ్లు అనుమానాస్పద…

7 hours ago

ప‌వ‌న్‌కు షారుఖ్ రేంజిలో ఇస్తామ‌న్నా..

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌క‌ట‌న‌లు చేస్తానంటే ఆయ‌న‌కు భారీ పారితోష‌కం ఇవ్వ‌డానికి బోలెడ‌న్ని కంపెనీలు ముందుకు వ‌స్తాయి. కానీ…

7 hours ago

కోర్టు హీరోయిన్ నెమ్మదిగా నడవాలంట

గత ఏడాది నాని నిర్మించిన కోర్టుతో పరిచయమైన హీరోయిన్ శ్రీదేవి అప్పల అందులో టీనేజ్ కొచ్చిన కాలేజీ అమ్మాయిగా నటనతో…

7 hours ago

సూపర్ 8లో టీమిండియాకు సఫారీ షాక్

టీ20 వరల్డ్ కప్ గ్రూప్ స్టేజ్ లో వరుస విజయాలతో దూసుకువచ్చిన టీమిండియాకు సూపర్ 8 ఆరంభంలోనే ఊహించని ఎదురుదెబ్బ…

8 hours ago