నందమూరి తారకరత్న కన్నుమూశారు. నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర ప్రారంభం రోజున ఆ కార్యక్రమంలో పాల్గొన్న తారకరత్న కార్డియాక్ అరెస్ట్తో కుప్పకూలిపోయారు. అప్పటి నుంచి ఆయనకు బెంగళూరులో వైద్యం అందుతోంది.
పాదయాత్రలో భాగంగా లోకేష్ తో కలిసి నడుస్తుండగా కార్డియాక్ అరెస్ట్ కావడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. వెంటనే ఆయనను కుప్పంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం అక్కడి నుంచి బెంగళూరులోని నారాయణ హృదాయలకు తరలించారు మెరుగైన వైద్యం అందిస్తున్నారు. విదేశాల నుంచి కూడా వైద్యులను రప్పించి చికిత్స అందించారు. కానీ ఆయన ఆరోగ్యంలో ఎలాంటి మెరుగుదల కనిపించలేదు.
విదేశాల నుంచి రప్పించిన వైద్యులు కూడా తారకరత్నకు చికిత్స అందించారు. ఆయన ఆరోగ్యం మెరుగవుతోందని తొలుత భావించినా పరిస్థితి మెరుగుపడగా శివరాత్రి రోజున ఆయన కన్నుమూశారు. తారకరత్న మరణ వార్తతో సినీ లోకంతో పాటు తెలుగు రాష్ట్రాల్లో విషాదాన్ని నింపింది. నందమూరి ఫ్యామిలీకి పలువురు ప్రగాఢసానుభూతి తెలుపుతున్నారు.
శనివారం ఉదయం నుంచే నందమూరి కుటుంబసభ్యులు, టీడీపీ నాయకులు బెంగళూరులోని ఆసుపత్రికి వెళ్లివస్తుండడంతో అంతటా అనుమానాలు కనిపించాయి. రాత్రి సమయానికి ఆయన మరణించినట్లు మీడియాలో కథనాలు వచ్చాయి.
తారకరత్న సినీ కెరీర్ తరువాత కొద్దినెలలుగా రాజకీయంగా యాక్టివ్గా మారారు. చంద్రబాబు, లోకేశ్ కూడా తారకరత్నను ప్రోత్సహించడంతో ఆయన ఏపీలోని కొన్ని నియోజకవర్గాలలో తిరుగుతూ స్థానిక నాయకులను కలుస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో ఆయన లోకేశ్తో పాదయాత్రలోనూ పాల్గొన్నారు.
This post was last modified on February 19, 2023 5:49 am
కాదేదీ ఫ్యాన్ వార్స్కు అనర్హం అన్నట్లుగా.. సోషల్ మీడియాలో గొడవలు పడడానికి రకరకాల కారణాలు వెతుక్కుంటూ ఉంటారు సినీ అభిమానులు.…
పోయినేడాది వాలెంటైన్స్ డే సందర్భంగా తెలుగు నుంచి ఒక కళాఖండం రిలీజైంది. దాని పేరు.. లైలా. మన దగ్గర డిజాస్టర్లు…
మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు ఇంటిపై దాడి చేసిన ఘటన రాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేపిన సంగతి…
మంత్రి నారా లోకేశ్ పై మాజీ మంత్రి జోగి రమేశ్ చేసిన అనుచిత వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేేపిన సంగతి…
రాష్ట్రాల బాధ్యత విషయంలో కేంద్రం పూర్తిగా తప్పుకొందా? ఇక నుంచి రాష్ట్రాల ఆదాయం పూర్తిగా ఆయా రాష్ట్రాలే సంపాయించుకోవాలా? అంటే..…
వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు 14 రోజుల పాటు రిమాండ్ ఖైదు విధిస్తూ.. గుంటూరు జిల్లా…