Movie News

అందరూ బన్నీ త్రివిక్రమ్ కాలేరు

నాన్ బాహుబలి రికార్డులు సాధించిన బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన అల వైకుంఠపురములో మైలురాళ్లు ఇప్పటికీ చాలా చోట్ల భద్రంగా ఉన్నాయి. వాల్తేరు వీరయ్య ఎంత గట్టిగా ప్రయత్నిస్తున్నా చాలా కేంద్రాల్లో దగ్గరగా వెళ్ళిందే తప్ప ఓవర్ టేక్ చేయలేకపోయింది.

ఒక ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ని ఇండస్ట్రీ హిట్ సాధించే స్థాయిలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తీర్చిదిద్దిన తీరు ఎవర్ గ్రీన్ క్లాసిక్ గా మార్చేసింది. టీవీలో వచ్చినా ఓటిటిలో చూసినా ఈ మూవీకున్నంత రిపీట్ వేల్యూ ఈ మధ్య కాలంలో దేనికీ లేదన్నది వాస్తవం. సహజంగానే దీని రీమేకులు జరుగుతాయి

తాజాగా బాలీవుడ్ లో షెహజాదా రిలీజయ్యింది. అల్లు అర్జున్ స్థానంలో కార్తీక్ ఆర్యన్ చేరగా పూజా హెగ్డే పాత్రలో కృతి సనన్ వచ్చింది. ఉదయం షోలు పూర్తవ్వడం ఆలస్యం దీనికి ఆశించిన స్థాయిలో టాక్ రాలేదు. క్రిటిక్స్ అయితే బాలేదంటూ తీర్పులిచ్చేశారు. బన్నీ గ్రేస్ ని కార్తీక్ క్యారీ చేయలేకపోయాడు.

మార్పులు చేయకుండా యధాతథంగా తీసే క్రమంలో దర్శకుడు రోహిత్ ధావన్ తడబడటంతో ఒరిజినల్ వెర్షన్ చూడని వాళ్ళను సైతం మెప్పించేలా లేకపోయింది. పరేష్ రావల్, మనీషా కొయిరాలా, కెకె మీనన్ లాంటి సూపర్ క్యాస్టింగ్ ఉన్నా వాళ్ళను బ్యాడ్ రైటింగ్ తో వృధా చేసుకున్నారు

ఇక అల వైకుంఠపురములో చూసినవాళ్లు మాత్రం షెహజాదాకు దూరంగా ఉంటే బెటర్. నిజానికి అల వైకుంఠపురములో గొప్ప కథేమీ కాదు. ఎప్పుడో వచ్చిన ఇంటిగుట్టు లాంటి వాటిలో ఈ తరహా కథలు వచ్చాయి. కానీ త్రివిక్రమ్ మార్కు టేకింగ్ ప్లస్ సంభాషణలు ఎక్కడికో తీసుకెళ్లి కూర్చోబెట్టాయి.

ముఖ్యంగా తమన్ సంగీతం ఎంత గొప్ప బలంగా నిలిచిందో మర్చిపోగలమా. కానీ హిందీ వెర్షన్ కు ప్రీతమ్ కనీసం అందులో పావు వంతు అవుట్ ఫుట్ ఇవ్వలేకపోయాడు. షెహజాదా ఎంత భారీగా తీసినా అందరూ బన్నీ త్రివిక్రమ్ లు కాదుగా ఒక మాములు కంటెంట్ ని బ్లాక్ బస్టర్ గా నిలబెట్టేందుకు

This post was last modified on February 17, 2023 9:26 pm

Share
Show comments
Published by
Satya
Tags: Shehzada

Recent Posts

ఐపీఎస్ సునీల్.. అలా రిటైర్ కావాల్సిందేనా?

వైసీపీ హయాంలో అప్పటి సీఎం జగన్ కనుసన్నల్లో పనిచేసిన అధికారులు రూల్స్‌ను పక్కన పెట్టి ఇష్టానుసారంగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి.…

2 hours ago

అమరావతిలో కొత్త నిర్ణయం: పేదలకు నష్టం లేకుండా మార్పు

జగన్ హయాంలో తీసుకున్న పలువురు నిర్ణయాలు రాష్ట్రాన్ని వెనక్కి నెట్టాయని, ముఖ్యంగా ఆర్థికంగానే కాకుండా రాజధాని పరంగా కూడా రాష్ట్రానికి…

3 hours ago

మరి కొద్ది గంటల్లో పెళ్లి.. అక్కచెల్లెళ్లు మృతి?

రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్‌పూర్ జిల్లా మనాయ్ గ్రామంలో శనివారం జరగాల్సిన వివాహ కార్యక్రమాలకు కొద్దిగంటల ముందు ఇద్దరు అక్కచెల్లెళ్లు అనుమానాస్పద…

3 hours ago

ప‌వ‌న్‌కు షారుఖ్ రేంజిలో ఇస్తామ‌న్నా..

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌క‌ట‌న‌లు చేస్తానంటే ఆయ‌న‌కు భారీ పారితోష‌కం ఇవ్వ‌డానికి బోలెడ‌న్ని కంపెనీలు ముందుకు వ‌స్తాయి. కానీ…

3 hours ago

కోర్టు హీరోయిన్ నెమ్మదిగా నడవాలంట

గత ఏడాది నాని నిర్మించిన కోర్టుతో పరిచయమైన హీరోయిన్ శ్రీదేవి అప్పల అందులో టీనేజ్ కొచ్చిన కాలేజీ అమ్మాయిగా నటనతో…

4 hours ago

సూపర్ 8లో టీమిండియాకు సఫారీ షాక్

టీ20 వరల్డ్ కప్ గ్రూప్ స్టేజ్ లో వరుస విజయాలతో దూసుకువచ్చిన టీమిండియాకు సూపర్ 8 ఆరంభంలోనే ఊహించని ఎదురుదెబ్బ…

4 hours ago