ఒకప్పుడు సినిమాల క్వాలిటీ, సక్సెస్ రేట్ పరంగా తమిళ సినీ పరిశ్రమ ఇండియాలోనే నంబర్ వన్ స్థాయిలో ఉండేది. అక్కడి నుంచి గొప్ప గొప్ప దర్శకులు వచ్చారు. ఎంతో వైవిధ్యమైన కథలతో సినిమాలు తీసి భారీ విజయాలను అందుకున్నారు. కానీ గత కొన్నేళ్లలో తమిళ సినిమాల ప్రమాణాలు బాగా పడిపోయాయి. అక్కడ హవా సాగించిన ఎంతోమంది దర్శకులు డౌన్ అయిపోయారు.
లోకేష్ కనకరాజ్ లాంటి చాలా కొద్దిమంది దర్శకులు మాత్రమే తమిళంలో సత్తా చాటుతున్నారు. మురుగదాస్ సహా చాలామంది టాప్ డైరెక్టర్లు స్థాయికి తగ్గ సినిమాలు చేయలేక పతనం చవిచూశారు. ఇలాంటి టైంలోనే తమిళ స్టార్ హీరోల దృష్టి తెలుగు దర్శకుల మీద పడుతోంది. ఆల్రెడీ కోలీవుడ్ టాప్ హీరో విజయ్.. మన వంశీ పైడిపల్లితో ‘వారిసు’ చేశాడు. ఆ సినిమా సంక్రాంతికి రిలీజై బ్లాక్ బస్టర్ అయింది.
ఇప్పుడు తెలుగు దర్శకుడితో కోలీవుడ్ మరో హిట్ కొట్టింది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో ధనుష్ నటించిన ‘సార్’ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు అటు తమిళంలో, ఇటు తెలుగులో పాజిటివ్ టాక్ వచ్చింది. రెండు చోట్లా కొన్ని రోజుల ముందు వరకు ఈ సినిమాకు పెద్దగా బజ్ లేదు. కానీ రిలీజ్ వీక్లో పరిస్థితి మారిపోయింది. అగ్రెసివ్ ప్రమోషన్లు కలిసొచ్చాయి. సినిమా మీద ధీమాగా ఉన్న చిత్ర బృందం పెయిడ్ ప్రిమియర్స్ కూడా వేసింది. అక్కడ్నుంచే పాజిటివ్ టాక్ మొదలైంది. ఇక రిలీజ్ రోజు కూడా టాక్ బాగుంది. సమీక్షలు కూడా సానుకూలంగా వస్తున్నాయి. సినిమా ఎంత పెద్ద సక్సెస్ అవుతుందో చెప్పలేం కానీ.. సక్సెస్ ఫుల్ సినిమాగా నిలబడ్డం మాత్రం ఖాయం.
అటు వారిసు, ఇటు సార్ రెండూ కూడా టాలీవుడ్ దర్శకులు తీసినవి మాత్రమే కాదు.. టాలీవుడ్ నిర్మాతలు ప్రొడ్యూస్ చేసినవే. ఇదే ఊపులో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ చేయబోయే సినిమా.. పరశురామ్ దర్శకత్వంలో కార్తి నటించే చిత్రం కూడా బాగా ఆడాయంటే కోలీవుడ్లో తెలుగు జెండా మరింతగా రెపరెపలాడడం ఖాయం.
This post was last modified on February 17, 2023 3:57 pm
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…