Movie News

కోలీవుడ్లో ‘తెలుగు’ జెండా


ఒకప్పుడు సినిమాల క్వాలిటీ, సక్సెస్ రేట్ పరంగా తమిళ సినీ పరిశ్రమ ఇండియాలోనే నంబర్ వన్ స్థాయిలో ఉండేది. అక్కడి నుంచి గొప్ప గొప్ప దర్శకులు వచ్చారు. ఎంతో వైవిధ్యమైన కథలతో సినిమాలు తీసి భారీ విజయాలను అందుకున్నారు. కానీ గత కొన్నేళ్లలో తమిళ సినిమాల ప్రమాణాలు బాగా పడిపోయాయి. అక్కడ హవా సాగించిన ఎంతోమంది దర్శకులు డౌన్ అయిపోయారు.

లోకేష్ కనకరాజ్ లాంటి చాలా కొద్దిమంది దర్శకులు మాత్రమే తమిళంలో సత్తా చాటుతున్నారు. మురుగదాస్ సహా చాలామంది టాప్ డైరెక్టర్లు స్థాయికి తగ్గ సినిమాలు చేయలేక పతనం చవిచూశారు. ఇలాంటి టైంలోనే తమిళ స్టార్ హీరోల దృష్టి తెలుగు దర్శకుల మీద పడుతోంది. ఆల్రెడీ కోలీవుడ్ టాప్ హీరో విజయ్.. మన వంశీ పైడిపల్లితో ‘వారిసు’ చేశాడు. ఆ సినిమా సంక్రాంతికి రిలీజై బ్లాక్ బస్టర్ అయింది.

ఇప్పుడు తెలుగు దర్శకుడితో కోలీవుడ్ మరో హిట్ కొట్టింది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో ధనుష్ నటించిన ‘సార్’ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు అటు తమిళంలో, ఇటు తెలుగులో పాజిటివ్ టాక్ వచ్చింది. రెండు చోట్లా కొన్ని రోజుల ముందు వరకు ఈ సినిమాకు పెద్దగా బజ్ లేదు. కానీ రిలీజ్ వీక్‌లో పరిస్థితి మారిపోయింది. అగ్రెసివ్ ప్రమోషన్లు కలిసొచ్చాయి. సినిమా మీద ధీమాగా ఉన్న చిత్ర బృందం పెయిడ్ ప్రిమియర్స్ కూడా వేసింది. అక్కడ్నుంచే పాజిటివ్ టాక్ మొదలైంది. ఇక రిలీజ్ రోజు కూడా టాక్ బాగుంది. సమీక్షలు కూడా సానుకూలంగా వస్తున్నాయి. సినిమా ఎంత పెద్ద సక్సెస్ అవుతుందో చెప్పలేం కానీ.. సక్సెస్ ఫుల్ సినిమాగా నిలబడ్డం మాత్రం ఖాయం.

అటు వారిసు, ఇటు సార్ రెండూ కూడా టాలీవుడ్ దర్శకులు తీసినవి మాత్రమే కాదు.. టాలీవుడ్ నిర్మాతలు ప్రొడ్యూస్ చేసినవే. ఇదే ఊపులో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ చేయబోయే సినిమా.. పరశురామ్‌ దర్శకత్వంలో కార్తి నటించే చిత్రం కూడా బాగా ఆడాయంటే కోలీవుడ్లో తెలుగు జెండా మరింతగా రెపరెపలాడడం ఖాయం.

This post was last modified on February 17, 2023 3:57 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఐపీఎస్ సునీల్.. అలా రిటైర్ కావాల్సిందేనా?

వైసీపీ హయాంలో అప్పటి సీఎం జగన్ కనుసన్నల్లో పనిచేసిన అధికారులు రూల్స్‌ను పక్కన పెట్టి ఇష్టానుసారంగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి.…

3 hours ago

అమరావతిలో కొత్త నిర్ణయం: పేదలకు నష్టం లేకుండా మార్పు

జగన్ హయాంలో తీసుకున్న పలువురు నిర్ణయాలు రాష్ట్రాన్ని వెనక్కి నెట్టాయని, ముఖ్యంగా ఆర్థికంగానే కాకుండా రాజధాని పరంగా కూడా రాష్ట్రానికి…

4 hours ago

మరి కొద్ది గంటల్లో పెళ్లి.. అక్కచెల్లెళ్లు మృతి?

రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్‌పూర్ జిల్లా మనాయ్ గ్రామంలో శనివారం జరగాల్సిన వివాహ కార్యక్రమాలకు కొద్దిగంటల ముందు ఇద్దరు అక్కచెల్లెళ్లు అనుమానాస్పద…

4 hours ago

ప‌వ‌న్‌కు షారుఖ్ రేంజిలో ఇస్తామ‌న్నా..

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌క‌ట‌న‌లు చేస్తానంటే ఆయ‌న‌కు భారీ పారితోష‌కం ఇవ్వ‌డానికి బోలెడ‌న్ని కంపెనీలు ముందుకు వ‌స్తాయి. కానీ…

4 hours ago

కోర్టు హీరోయిన్ నెమ్మదిగా నడవాలంట

గత ఏడాది నాని నిర్మించిన కోర్టుతో పరిచయమైన హీరోయిన్ శ్రీదేవి అప్పల అందులో టీనేజ్ కొచ్చిన కాలేజీ అమ్మాయిగా నటనతో…

4 hours ago

సూపర్ 8లో టీమిండియాకు సఫారీ షాక్

టీ20 వరల్డ్ కప్ గ్రూప్ స్టేజ్ లో వరుస విజయాలతో దూసుకువచ్చిన టీమిండియాకు సూపర్ 8 ఆరంభంలోనే ఊహించని ఎదురుదెబ్బ…

5 hours ago