Movie News

ఆ జాబితాలో పరశురామ్ కూడా..


తమిళ దర్శకుల కోసం తెలుగు హీరోలు, నిర్మాతలు వెంటపడడం.. ఇక్కడొచ్చి వాళ్లు సినిమాలు చేయడం దశాబ్దాల నుంచి ఉన్నదే. కానీ గత కొన్నేళ్లలో పరిస్థితి మారిపోయింది. మన సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో అదరగొట్టేస్తుండడం.. భారీ వసూళ్లు రాబడుతుండడం.. అదే సమయంలో తమిళ దర్శకుడు డౌన్ అయిపోవడంతో అక్కడి హీరోల ఆలోచన మారుతోంది. తెలుగు దర్శకులతో సినిమాలు చేయడానికి వాళ్లు ఆసక్తి చూపిస్తున్నారు.

ఇప్పటికే విజయ్.. మన వంశీ పైడిపల్లితో ‘వారసుడు’ సినిమా చేశాడు. ఆ చిత్రం డివైడ్ టాక్ తట్టుకుని కమర్షియల్‌గా పెద్ద సక్సెసే అయింది. ఇప్పుడిక ధనుష్.. మరో టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరితో చేసిన ‘సార్’ విడుదలకు సిద్ధమైంది. అది కూడా ప్రామిసింగ్‌గా కనిపిస్తోంది. ధనుష్.. శేఖర్ కమ్ములతోనూ ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే.

వీళ్ల తర్వాత మరో టాలీవుడ్ దర్శకుడు కోలీవుడ్ హీరోతో జట్టు కట్టబోతున్నాడు. అతనే.. పరశురామ్. ‘సర్కారు వారి పాట’ తర్వాత కొత్త సినిమా ప్రకటన విషయంలో బాగానే టైం తీసుకున్నాడు పరశురామ్. నాగచైతన్యతో అనుకున్న సినిమా వర్కవుట్ కాలేదు. ఇటీవలే తన కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ‘గీత గోవిందం’లో హీరోగా చేసిన విజయ్ దేవరకొండతో సినిమా అనౌన్స్ చేశాడు. ఆ సినిమాను దిల్ రాజు నిర్మించబోతున్నాడు.

ఇప్పుడు పరశురామ్ తమిళ కథానాయకుడు కార్తితో సినిమాను ఓకే చేయించుకున్నట్లు సమాచారం. కార్తిని పరశురామ్ కలుస్తున్నట్లు ఇంతకుముందే వార్తలు వచ్చాయి. కాగా ఇప్పుడు వీరి సినిమా ఓకే అయినట్లు తెలుస్తోంది. కానీ కార్తికి చాలా కమిట్మెంట్లు ఉండడంతో ఈ సినిమా పట్టాలెక్కడానికి టైం పడుతుంది. ఈలోపు విజయ్ దేవరకొండతో సినిమాను పూర్తి చేస్తాడు పరశురామ్. అతడికి చాలా మంది నిర్మాతలతో కమిట్మెంట్లు ఉండగా.. వారిలో ఒకరికి ఈ ప్రాజెక్టును ఇప్పించనున్నట్లు తెలుస్తోంది.

This post was last modified on February 16, 2023 10:17 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘అమ్మాయిలను అనుభవించడానికే సినిమాలు తీస్తున్నారు’

సినీ ప‌రిశ్ర‌మ‌లో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్ప‌లేమ‌ని సీనియ‌ర్ ద‌ర్శ‌క నిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ స్ప‌ష్టం చేశారు. ఇటీవ‌ల…

2 hours ago

డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ సతీమణి

బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…

4 hours ago

చంద్రబాబు ప్రయోగశాలగా మారిన కుప్పం

త‌న సొంత నియోజ‌కవ‌ర్గం కుప్పాన్ని ప్ర‌యోగ‌శాల‌గా మార్చ‌నున్న‌ట్టు సీఎం చంద్ర‌బాబు తెలిపారు. తాజాగా శుక్ర‌వారం రాత్రి త‌న నియోజ‌క‌వర్గానికి వ‌చ్చిన…

4 hours ago

కేసీఆర్ చెప్పిన‌ట్లు కుద‌ర‌దు

ఫోన్ ట్యాపింగ్ కేసు విచార‌ణ విష‌యంలో తెలంగాణ‌ మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ పంతం నెగ్గ‌లేదు. త‌న‌ను ఎర్ర‌వెల్లిలోని త‌న ఫామ్…

5 hours ago

చరణ్ కోసం అఖిల్ త్యాగం చేస్తాడా?

రామ్ చరణ్ కొత్త సినిమా ‘పెద్ది’కి సెట్స్ మీదికి వెళ్లే సమయంలో రిలీజ్ డేట్ ఖరారు చేశారు. ఈ ఏడాది…

6 hours ago

పోలీసులకు వార్నింగ్ ఇచ్చి సారీ చెప్పిన కౌశిక్ రెడ్డి!

వీణవంకలో సమ్మక్క-సారలమ్మ జాతరలో మొక్కులు చెల్లించుకునేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన కుటుంబ సభ్యులు, మహిళా సర్పంచ్…

7 hours ago