తమిళ దర్శకుల కోసం తెలుగు హీరోలు, నిర్మాతలు వెంటపడడం.. ఇక్కడొచ్చి వాళ్లు సినిమాలు చేయడం దశాబ్దాల నుంచి ఉన్నదే. కానీ గత కొన్నేళ్లలో పరిస్థితి మారిపోయింది. మన సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో అదరగొట్టేస్తుండడం.. భారీ వసూళ్లు రాబడుతుండడం.. అదే సమయంలో తమిళ దర్శకుడు డౌన్ అయిపోవడంతో అక్కడి హీరోల ఆలోచన మారుతోంది. తెలుగు దర్శకులతో సినిమాలు చేయడానికి వాళ్లు ఆసక్తి చూపిస్తున్నారు.
ఇప్పటికే విజయ్.. మన వంశీ పైడిపల్లితో ‘వారసుడు’ సినిమా చేశాడు. ఆ చిత్రం డివైడ్ టాక్ తట్టుకుని కమర్షియల్గా పెద్ద సక్సెసే అయింది. ఇప్పుడిక ధనుష్.. మరో టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరితో చేసిన ‘సార్’ విడుదలకు సిద్ధమైంది. అది కూడా ప్రామిసింగ్గా కనిపిస్తోంది. ధనుష్.. శేఖర్ కమ్ములతోనూ ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే.
వీళ్ల తర్వాత మరో టాలీవుడ్ దర్శకుడు కోలీవుడ్ హీరోతో జట్టు కట్టబోతున్నాడు. అతనే.. పరశురామ్. ‘సర్కారు వారి పాట’ తర్వాత కొత్త సినిమా ప్రకటన విషయంలో బాగానే టైం తీసుకున్నాడు పరశురామ్. నాగచైతన్యతో అనుకున్న సినిమా వర్కవుట్ కాలేదు. ఇటీవలే తన కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ‘గీత గోవిందం’లో హీరోగా చేసిన విజయ్ దేవరకొండతో సినిమా అనౌన్స్ చేశాడు. ఆ సినిమాను దిల్ రాజు నిర్మించబోతున్నాడు.
ఇప్పుడు పరశురామ్ తమిళ కథానాయకుడు కార్తితో సినిమాను ఓకే చేయించుకున్నట్లు సమాచారం. కార్తిని పరశురామ్ కలుస్తున్నట్లు ఇంతకుముందే వార్తలు వచ్చాయి. కాగా ఇప్పుడు వీరి సినిమా ఓకే అయినట్లు తెలుస్తోంది. కానీ కార్తికి చాలా కమిట్మెంట్లు ఉండడంతో ఈ సినిమా పట్టాలెక్కడానికి టైం పడుతుంది. ఈలోపు విజయ్ దేవరకొండతో సినిమాను పూర్తి చేస్తాడు పరశురామ్. అతడికి చాలా మంది నిర్మాతలతో కమిట్మెంట్లు ఉండగా.. వారిలో ఒకరికి ఈ ప్రాజెక్టును ఇప్పించనున్నట్లు తెలుస్తోంది.
This post was last modified on February 16, 2023 10:17 pm
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…
మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…
సరైన భద్రత ఏర్పాట్లు చేయకుండా సినిమా, రాజకీయ ఈవెంట్లు పెడితే ఏం జరుగుతుందో.. ఎప్పటికప్పుడు ఉదాహరణలు చూస్తూనే ఉన్నాం. అయినా…
నటుడు శ్రీకాంత్ వారసుడిగా పెళ్లి సందడితో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రోషన్ మేక తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నాడు. మధ్యలో…
స్టార్ హీరోలు ఏడాదికి ఒక్క సినిమా అయినా చేయాలని.. అప్పుడే ఇండస్ట్రీ బాగుంటుందనే అభిప్రాయం ఎప్పట్నుంచో ఉన్నదే. పెద్ద స్టార్లు మాత్రమే…